tag:blogger.com,1999:blog-60932894265821322452024-03-06T19:33:47.451-08:00ఆకలిఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comBlogger388125tag:blogger.com,1999:blog-6093289426582132245.post-15320893453600808462023-12-22T02:02:00.000-08:002023-12-22T02:02:21.476-08:00ఈ ఏడాదిలో క్రైం రేటు పెరిగింది : హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్రెడ్డి<br /><div class="post-share">
<div class="post-share-icons cf">
<a class="link facebook" href="https://www.facebook.com/sharer.php?u=https%3A%2F%2Fprajasakti.com%2Fvarthalu%2Fstate%2Fcrime-rate-has-increased-this-year-hyderabad-cp-kottakota-srinivas-reddy%2F" target="_blank">
<i class="fa fa-facebook"></i>
</a>
<a class="link twitter" href="http://twitter.com/share?url=https%3A%2F%2Fprajasakti.com%2Fvarthalu%2Fstate%2Fcrime-rate-has-increased-this-year-hyderabad-cp-kottakota-srinivas-reddy%2F&text=%E0%B0%88%20%E0%B0%8F%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%82%20%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B1%81%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%20%3A%20%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%20%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF" target="_blank">
<i class="fa fa-twitter"></i>
</a>
<a class="link email" href="mailto:?subject=ఈ%20ఏడాదిలో%20క్రైం%20రేటు%20పెరిగింది%20:%20హైదరాబాద్%20సిపి%20కొత్తకోట%20శ్రీనివాస్రెడ్డి&body=https%3A%2F%2Fprajasakti.com%2Fvarthalu%2Fstate%2Fcrime-rate-has-increased-this-year-hyderabad-cp-kottakota-srinivas-reddy%2F" target="_blank">
<i class="fa fa-envelope-o"></i>
</a>
<a class="link telegram" href="https://telegram.me/share/url?url=https%3A%2F%2Fprajasakti.com%2Fvarthalu%2Fstate%2Fcrime-rate-has-increased-this-year-hyderabad-cp-kottakota-srinivas-reddy%2F&text&title=%E0%B0%88%20%E0%B0%8F%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%82%20%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B1%81%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%20%3A%20%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%20%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF" target="_blank">
<i class="fa fa-telegram"></i>
</a>
<a href="https://wa.me/?text=Check%20out%20this%20post:%20https://prajasakti.com/varthalu/state/crime-rate-has-increased-this-year-hyderabad-cp-kottakota-srinivas-reddy/" style="background: #25d366;" target="_blank">
<i class="fa fa-watsapp"></i>
</a>
</div>
</div>
<img alt="" class="img-responsive wp-post-image" height="345" src="https://prajasakti.com/wp-content/uploads/2023/12/cp.jpg" width="600" />
<p><strong>తెలంగాణ :</strong> 2022 ఏడాదితో పోలిస్తే
2023లో క్రైమ్ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్ సిపి కొత్తకోట
శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ కమిషనరేట్లో నగర
వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి,
స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం మేర పెరిగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు
సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. చాలా
కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్ నిమజ్జనోత్సవం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి
రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు.</p>
<p style="text-align: center;"><strong>ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి : సిపి</strong></p>
<p>ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని సిపి వివరించారు. మహిళలపై అత్యాచార
కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. సైబర్ నేరాలు 11
శాతం పెరిగాయన్నారు. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే,
ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు. ఆర్థిక నేరాలపై
2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయన్నారు పోక్సో
కేసులు 12 శాతానికి తగ్గాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో
తీవ్రంగా కఅషి చేస్తోందని చెప్పారు. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా
పట్టుకుంటామని, డ్రగ్స్ను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ను
వినియోగిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను
వేగంగా పరిష్కరిస్తున్నామని సిపిఎం తెలిపారు.</p>
<p style="text-align: center;"><strong>పబ్స్ తెరిచే ప్రసక్తే లేదు : సిపి </strong></p>
<p>కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిఎట్టి పరిస్థితుల్లో తిరిగి పబ్స్ ఓపెన్
చేయించే ప్రసక్తి ఉండదు అని సిపి స్పష్టం చేశారు. న్యూ ఇయర్ రోజు ఎవరైనా
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.
రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి ఉందని హైదరాబాద్
సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12.30 గంటల నుంచే కష్టమర్లను
బయటకి పంపాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించినా,
సప్లై చేసినట్లు తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. ఎవరైనా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సిపి హెచ్చరించారు.</p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-53340525429685550132023-12-05T12:33:00.000-08:002023-12-05T12:38:45.513-08:00తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి<div><div style="text-align: left;"><b><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHO8HQnCqtpj1HecvvDZegvJQEWniDpiMgXNEAJnboZ-LVYn1ii7A3yC8S8m4kitXOEA9_ZxAu5Oew0DyEm-mXYTKIlwDRJ9bA2UepUusfOyyAvpFmF8Vd3MaaoU2RZ8PKjHeBbDjevqF8riAdeUJkYncXMA33FI7naezkoHI-9dkypbJiKUz3DqUnGrBG/s1084/Revanth%20Reddy%20HD%20png%20images.jpg" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1084" data-original-width="494" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHO8HQnCqtpj1HecvvDZegvJQEWniDpiMgXNEAJnboZ-LVYn1ii7A3yC8S8m4kitXOEA9_ZxAu5Oew0DyEm-mXYTKIlwDRJ9bA2UepUusfOyyAvpFmF8Vd3MaaoU2RZ8PKjHeBbDjevqF8riAdeUJkYncXMA33FI7naezkoHI-9dkypbJiKUz3DqUnGrBG/s320/Revanth%20Reddy%20HD%20png%20images.jpg" width="146" /></a></div></b></div><b><br />డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం </b><br /></div><div style="text-align: justify;"> తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన బిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతో.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై నమ్మకమో కానీ.. ఈసారి హస్తం పార్టీకే ఓటరు జై కొట్టారు. ఈ సమయంలోనే.. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే సిఎం అభ్యర్థి ఎవరూ అన్న చర్చ జరుగుతుండగా.. ఎక్కువగా వినిపించిన పేరు అనుముల రేవంత్ రెడ్డి. అటు అధిష్ఠానం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరబోతోంది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిది. 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంగా వినిపించిన ఒకే ఒక్క పేరు రేవంత్ రెడ్డి. పార్టీ గెలిచినప్పటి నుంచి అధిష్ఠానం మనసులో కూడా అదే పేరు ఉన్నా.. బయటకు చెప్పలేక తచ్చాడుతున్న సమయంలోనూ.. రాష్ట్రమంతా ముక్తకంఠంతో తమకు రేవంత్ రెడ్డే సీఎం అని... మిగితా ఎవ్వరు వచ్చినా ఒప్పుకోమన్న రీతిలో తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే.. రేవంత్ రెడ్డిపై అటు అధిష్ఠానానికి, ఇటు రాష్ట్ర ప్రజానికానికి అంత నమ్మకమేంటీ.. సీఎంగా రేవంత్ రెడ్డే ఎందుకు.. ఆయనకున్న అర్హత లేంటీ అన్న చర్చ నడుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి జడ్పీటీసీగా గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన ఓ సాధారణ వ్యక్తి ఏదో ఓ రోజు సిఎం అవుతానని ఆరోజే కలగన్నాడు. ఇప్పుడు ఆయన కోరుకోకపోయినా.. అటు అధిష్ఠానం, ఇటు ప్రజలు ఆయనే కావాలని బలంగా నమ్ముతున్నారంటే.. ఆయనలో ఏదో ఉంది.. అదేంటీ..?<br /></div><div style="text-align: justify;"><b> సీఎం కావాలన్న లక్ష్యం 17 ఏళ్ల క్రితమే..</b>: 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి.. ఎవి కాలేజీలో బిఎ చదివారు. ఆ సమయంలోనే.. ఎబివిపి తరపున స్టూడెంట్ లీడర్గా యాక్టీవ్ రోల్ ప్లే చేశారు. కట్ చేస్తే.. 2006లో మిడ్జిల్ మండలం జడ్పిటిసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి గెలిచారు. అనంతరం.. 2007లో మాహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన చురుకుదనం చూసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి పసుపు కండువా కప్పితే.. మరింత ఉత్సాహంతో పని చేశారు. 2009లో టిడిపి తరపున కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు చాలా దగ్గరైపోయి.. పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి ఫ్లోర్ లీడర్గా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించారంటే.. ఆయనకున్న కమిట్మెంటే కారణం.<br /></div><div style="text-align: justify;"> <b> ఆ ఒక్క అరెస్టుతో మారిపోయిన సీన్: </b> ఇక.. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కావటంతో రేవంత్ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే.. రేవంత్ ఏమాత్రం భయపడకుండా.. ఇదంతా కేసీఆర్ అండ్ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే.. కెసిఆర్్ను సిఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ అతిథిగా వచ్చి వెళ్లటం లాంటి ఘటనలతో తీవ్రంగా బాధపడిన రేవంత్ రెడ్డి.. ఏమాత్రం కుంగిపోలేదు. వేరే నేతలైతే తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో.. ఎక్కడో ఓ పాయింట్లో సరెండర్ అయిపోయే వారేమో. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం అర్జున్ రెడ్డి టైపులో మరింత అగ్రెస్సివ్గా మారిపోయారు.<br /></div><div style="text-align: justify;"><b> టిడిపి వద్దనుకుంది.. హస్తం కావాలనుకుంది:</b> జైలుకు వెళ్లి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత.. సీన్ మొత్తం మారిపోయింది. ముందు నుంచీ కొంత అగ్రెస్సిన్ నాయకుడిగానే పేరున్న రేవంత్.. ఆ తర్వాత తన మాటల్లో, విమర్శల్లో పదును పెంచారు. మైక్ పట్టుకుంటే చాలు కెసిఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ మీద పరుష పదజాలంతో శివాలెత్తి పోయేవారు. సొంతంగా సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేసుకుని తన ఇమేజ్ను గణనీయంగా పెంచుకోగలిగారు. అదే సమయంలో.. తెలంగాణలో టిడిపి బలహీనపడిపోవటం.. ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కటంతో.. రేవంత్ ఒంటరిగా మిగిలిపోయారు. మరోవైపు.. చంద్రబాబు కూడా తెలంగాణపై అంతగా దృష్టి పెట్టకపోవటంతో ఆయన భవితవ్యం శూన్యంగా మారింది. అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టాలని ఆయన అభిమానులు కోరగా.. అప్పటికే బలహీనమైపోతున్న కాంగ్రెస్ నేతలు రేవంత్తో టచ్లోకి వచ్చారు. ఈ విషయం బాబుకు తెలియటంతో.. ఆయణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.<br /></div><div style="text-align: justify;"> <b> ఏడాదిలోనే సీనియర్లకు పోటీగా: </b>ఇంకేముంది.. హస్తంతో రేవంత్ దోస్తీ కుదిరిపోయింది. 2017 అక్టోబర్ 30న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా భుజాన వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రేవంత్.. పొలిటికల్ కెరీర్ మరింత పుంజుకుంది. ఆయన వాగ్ధాటితో అధికార బిఆర్ఎస్ నేతలపై.. ముఖ్యంగా కెసిఆర్ మీద బలమైన విమర్శలు చేస్తూ.. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకుని.. ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తన చురుకుదనం, అగ్రెస్సివ్నెస్తో పార్టీలో చేరిన ఏడాదికే అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. దీంతో.. టిపిసిసి అధ్యక్షుని రేసులో ఇద్దరు సీనియర్ల సరసన నిలిచారు. కానీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డికే అధిష్ఠానం పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.<br /></div><div style="text-align: justify;"><b> పార్టీని జీరో నుంచి హీరోగా మార్చి: </b>కానీ.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ పరాభవమే మూటగట్టుకుంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి సైతం ఓడిపోయారు. దీంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొంది తిరిగి తన సత్తా చాటారు. ఎంపీగా గెలవటంతో.. <b>డి</b>ల్లీి నేతలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు రేవంత్కు మంచి అవకాశంగా మారింది. దీంతో.. 2021లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి.. టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. అందుకు కారణం.. యువనేత, అగ్రెస్సివ్ స్పీచులతో ప్రజలను ఆకట్టుకుంటూ మాస్ లీడర్గా పేరుతెచ్చుకోవటం, ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉన్న పార్టీకి ఊపిరిలూదేందుకు కావాల్సిన స్ట్రాటజీలున్న నేతగా గుర్తించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుతారు. ఇక అప్పటి నుంచి రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.<br /></div><div style="text-align: justify;"><b> ఆర్టిస్టు నుంచి సిఎం దాకా : </b>రేవంత్ రెడ్డి 1969, నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నా ఆర్ట్స్ లో సాధన చేశారు. ఆర్టిస్టు నుంచి ముఖ్యమంత్రి దాకా అనేక ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సారథిగా వెలుగొందుతున్నాడు. ప్రజలకు మంచి చేసి చిరస్థాయిగా నిలుస్తాడని ఆశిద్ధాం. <br /></div><div><br /><br /></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-38113312304321027532023-10-24T11:03:00.001-07:002023-10-24T11:05:28.530-07:00నంద్యాల తొలి ఎమ్మెల్యే మల్లు సుబ్బారెడ్డి<div style="text-align: justify;"> <div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjisG1YepNZaJfSpO0UV7k-GKBJI0Jz32I4zAUsUnv8BQbxyJSjI9R8snlvzlTHIJiDe8hH6WR9WDl4KXxklYEVuVh-WyHZkAa9kVbI3_YXGWInuKtXzdm5JUQBggDCxqgwXATduvXVirkTVxFaFflMIU7kK08elMdgQe_xQtjf_GnElin2_Z4EuydSsmZ9/s1502/ndl%20web-2023.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1502" data-original-width="994" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjisG1YepNZaJfSpO0UV7k-GKBJI0Jz32I4zAUsUnv8BQbxyJSjI9R8snlvzlTHIJiDe8hH6WR9WDl4KXxklYEVuVh-WyHZkAa9kVbI3_YXGWInuKtXzdm5JUQBggDCxqgwXATduvXVirkTVxFaFflMIU7kK08elMdgQe_xQtjf_GnElin2_Z4EuydSsmZ9/s320/ndl%20web-2023.jpg" width="212" /></a></div><br />నంద్యాల
మొదటి ఎమ్మెల్యే అయిన మల్లు రామసుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
కర్నూలు ఉమ్మడి జిల్లా పాణ్యం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
ఆయనకు ముగ్గురు సోదరులు ఒక సోదరి. మల్లు సుబ్బారెడ్డి ఎస్ఎస్ఎల్ సి వరకు
నంద్యాల ఎస్పిజి హై స్కూల్లో ఆ తరువాత ఇంటర్మీడియట్ , డిగ్రీ అనంతపురం
ఆర్ట్స్ కాలేజీలో చదివారు. తర్వాత 'లా' డిగ్రీ మద్రాసు 'లా 'కాలేజ్ లో
పూర్తి చేసి నంద్యాలలో న్యాయవాద వృత్తి చేపట్టారు.1941 సంవత్సరంలో
బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని మూడు
నెలలు బళ్లారి సెంట్రల్ జైలులో గడిపి తరువాత 1942 సంవత్సరం నుండి 1944 వ
సంవత్సరం వరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు
వెల్లూరు, తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. స్వాతంత్య్ర వచ్చిన తరువాత
1952వ సంవత్సరంలో స్వాతంత్రం తొలి శాసనసభ ఎన్నికల్లో మల్లు సుబ్బారెడ్డి
నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్
అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1954వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి
ప్రకాశం పంతులు ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎత్తివేయాలని ఓటింగ్
నిర్వహించింది. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉప
ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మల్లు సుబ్బారెడ్డికి మంత్రి పదవి
ఇప్పిస్తానని చెప్పినా మల్లు సుబ్బారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు
వేయమని అడిగినా తిరస్కరించి మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి
వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ ఒక్క ఓటుతో ప్రభుత్వం పడి పోయింది. మరలా 1955వ
సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. మరలా 1962వ సంవత్సరంలో నంద్యాల నియోజకవర్గం
నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 1967 వ సంవత్సరము వరకు
ఎమ్మెల్యేగా కొనసాగారు. 1968 డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు. మల్లు
సుబ్బారెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడైన మల్లు
రామచంద్రారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ నంద్యాలలో మెడిసేవా
డయాగ్నోసిస్ సర్వీసెస్ ఎండిగా కొనసాగుతున్నారు.<br /></div>
panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-71385129997003436092023-02-13T00:54:00.003-08:002023-02-13T01:14:56.458-08:00 220 జంటలకు సామూహిక వివాహం<div><div style="text-align: justify;"></div> <div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjx5F7ZHqN6l49g4NW5y7ns7_4vdaUZ-Vau2ZN8dU_toBlXvO62s1FpuJUEvAJjd0AZv6regcDXJbSe8hH9IeLbNfJ1ArFHxdosLhTGCveVhSqCskmf8xAweabx0taf53I6_TDFMMl3m0M3vOqr5hOWWc4YCCrM6SHL3U0zCsvuaqWYpIvfx_Ylh0h2xg/s685/ngkl-03.jpg" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="433" data-original-width="685" height="202" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjx5F7ZHqN6l49g4NW5y7ns7_4vdaUZ-Vau2ZN8dU_toBlXvO62s1FpuJUEvAJjd0AZv6regcDXJbSe8hH9IeLbNfJ1ArFHxdosLhTGCveVhSqCskmf8xAweabx0taf53I6_TDFMMl3m0M3vOqr5hOWWc4YCCrM6SHL3U0zCsvuaqWYpIvfx_Ylh0h2xg/s320/ngkl-03.jpg" width="320" /></a></div></div><div style="text-align: justify;"> నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం
సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. ఎంజెఆర్ ట్రస్ట్ అధినేత,
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆ ధ్వర్యంలో నాగర్కర్నూలు జిల్లాపరిషత్
పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై 220 జంటలు ఒక్కటయ్యాయి. <br /></div><div><p style="text-align: justify;"> తెలంగాణరాష్ట్రం
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం(12-02-2023) సామూహిక వివాహాలు
కనులపండువగా జరిగాయి. మర్రిజనార్దన్రెడ్డిచారిటబుల్ ట్రస్ట్ (ఎంజెఆర్)
అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక
జిల్లాపరిషత్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై 220 జంటలు
ఒక్కటయ్యాయి. హిందూ, ముస్లిం, క్రిష్టియన్లకు వారి సంప్రదాయ పద్ధతుల్లో
వివాహాలు జరిపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి
జమునారాణి పెండ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఓవైపు లక్ష్మీనర్సింహస్వామి
కల్యాణం, మరోవైపు జంటలకు ఒకేసారి వివాహాలు జరిపించారు. సినిమా సెట్టింగ్ను
తలపించేలా భారీగా వేసిన మండపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు
ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు,
గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
అతిథులుగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు
వేలాదిగా తరలివచ్చి వేడుకను తిలకించారు. వచ్చిన వారందరికీ విందు భోజనాలు
ఏర్పాటు చేశారు. కొత్త జంటలకు పెండ్లికి ముందు పట్టువస్త్రాలు, బంగారు
తాళి, మెట్టెలు అందించారు. తరువాత బీరువా, మంచం, బెడ్, దిండ్లు,
ట్రావెలింగ్ బ్యాగ్, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, కుక్కర్, వంటసామగ్రిని
బహూకరించారు. సాయంత్రం నూతన జంటలను డిజె డ్యాన్స్ల మధ్య అప్పగింతల
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి
చందు, కలెక్టర్ ఉదరుకుమార్ పాల్గన్నారు.</p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhc62u0Ye79dR6zRPatG1YjK-agINYu1f_zXfvvVvEVDU0kZifVrAtnjTJ4XFgYXCdoITlAuKmfM6I7-iZMPMTtU6SdoJZljuWogCABUqIH6elYquNCIh1O7fwrEAsyVoRvRiw6gv_JCRM9ZQ5LoBESR74lyOVmMgjUJcz78cJmZEqvK38hG8D1N9F_qg/s816/ngkl-01.jpg" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="478" data-original-width="816" height="187" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhc62u0Ye79dR6zRPatG1YjK-agINYu1f_zXfvvVvEVDU0kZifVrAtnjTJ4XFgYXCdoITlAuKmfM6I7-iZMPMTtU6SdoJZljuWogCABUqIH6elYquNCIh1O7fwrEAsyVoRvRiw6gv_JCRM9ZQ5LoBESR74lyOVmMgjUJcz78cJmZEqvK38hG8D1N9F_qg/s320/ngkl-01.jpg" width="320" /></a></div><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjo0Y8g0Jhf1F3ibPBffLo4HXX4ZFW3nCkxopHXwr2wcx4MLOdGaYJlL_wSU0KIe9BHaQCnCty2F7GHIxzjhPSAwUuUkPl52mbo19TJt8wnumTTBUC7tk5i41z_5ZRn8fLImM2vXj8fgfPrietWGOcvE38AAkgunR1y79XtelPapEgDe8WkxmyzqtU1sA/s1032/ngkl-02.jpg" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="560" data-original-width="1032" height="174" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjo0Y8g0Jhf1F3ibPBffLo4HXX4ZFW3nCkxopHXwr2wcx4MLOdGaYJlL_wSU0KIe9BHaQCnCty2F7GHIxzjhPSAwUuUkPl52mbo19TJt8wnumTTBUC7tk5i41z_5ZRn8fLImM2vXj8fgfPrietWGOcvE38AAkgunR1y79XtelPapEgDe8WkxmyzqtU1sA/s320/ngkl-02.jpg" width="320" /></a></div><br /><p style="text-align: justify;"><br /></p><p style="text-align: left;"><br />
</p><p style="text-align: left;"><br />
</p><p style="text-align: left;"><br />
</p><p style="text-align: left;"><br />
</p><div class="separator" style="clear: both; text-align: center;"><iframe allowfullscreen='allowfullscreen' webkitallowfullscreen='webkitallowfullscreen' mozallowfullscreen='mozallowfullscreen' width='320' height='266' src='https://www.blogger.com/video.g?token=AD6v5dxMMemmMKaNeCvaz8DNb6P2ru_WmCz5V4IuWATFGDnS9GxhvwuiFrda5PobuOWKlYhLG0IXcdpmb3h2lS86-A' class='b-hbp-video b-uploaded' frameborder='0'></iframe></div><br /><p style="text-align: left;"><br />
</p></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-89741256994317496222023-02-04T00:09:00.002-08:002023-02-06T11:44:55.979-08:00బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం<p> <a href="https://prajasakti.com/Adanis-corrupt-empire-exposed" id="label" rel="bookmark"></a></p><h1></h1>
<p></p><div class="node__meta">
<article class="profile">
</article>
<span>
Feb 04,2023 07:55 </span>
</div>
<p></p>
<div class="social-icons">
<span class="a2a_kit a2a_kit_size_32 addtoany_list" data-a2a-title="బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం" data-a2a-url="https://prajasakti.com/Adanis-corrupt-empire-exposed" style="line-height: 32px;"><div class="a2a_kit a2a_kit_size_32 a2a_default_style social-icon-mobile-wrap" style="right: 0px; top: 150px;"><a class="a2a_button_facebook" href="https://prajasakti.com/#facebook" rel="nofollow noopener" target="_blank"><img src="https://prajasakti.com/themes/custom/drupal8_zymphonies_theme/images/fb.png" /></a><a class="a2a_button_twitter" href="https://prajasakti.com/#twitter" rel="nofollow noopener" target="_blank"><img src="https://prajasakti.com/themes/custom/drupal8_zymphonies_theme/images/twitter.png" /></a><a class="a2a_button_whatsapp" href="https://prajasakti.com/#whatsapp" rel="nofollow noopener" target="_blank"><img src="https://prajasakti.com/themes/custom/drupal8_zymphonies_theme/images/whatsapp.png" /></a><a class="a2a_button_email" href="https://prajasakti.com/#email" rel="nofollow noopener" target="_blank"><img src="https://prajasakti.com/themes/custom/drupal8_zymphonies_theme/images/mail.png" /></a><a class="a2a_button_telegram" href="https://prajasakti.com/#telegram" rel="nofollow noopener" target="_blank"><img src="https://prajasakti.com/themes/custom/drupal8_zymphonies_theme/images/Telegram.png" /></a></div></span>
</div>
<div class="separator" style="clear: both; text-align: center;"><figure style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;">
<img height="184" src="https://prajasakti.com/sites/default/files/2023-02/democracy_0.jpg" width="320" />
</figure></div><div class="cover-image">
</div>
<p class="text-align-justify"><b>ఏళ్ళ
తరబడి, గౌతమ్ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక
తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి. బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు
చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై
పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ
నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరు పై
మీడియాలో, వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ,
వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా
సంస్థలు కానీ స్పందించిన దాఖలాలు లేవు.</b><br /><br /><b> అ</b>మెరికాకు
చెందిన అతి చిన్న మదుపరుల సంస్థ భారతదేశంలోని అతి పెద్ద, శక్తివంతమైన
అదానీ గ్రూప్ను సవాలు చేసి, దాని పునాదులనే కదిలించేేసింది.
హిండెన్బర్గ్ రీసెర్చి అనే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ అదానీ గ్రూపుపై
129 పేజీలతో నివేదిక వెలువరించింది. అదానీ గ్రూపునకు చెందిన ఏడు కంపెనీలతో
సంబంధమున్న 578 అనుబంధ సంస్థల, షెల్ కంపెనీల నిధుల సేకరణ కార్యకలాపాలు,
దేశం వెలుపల సాగించే కార్యకలాపాల గురించి అనేక ఆధారాలను అందులో
పొందుపరిచింది. ఇది 'కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద మోసం'గా హిండెన్
బర్గ్ నివేదిక పేర్కొంది.<br />
నిధులు, బూటకపు కంపెనీల సంక్లిష్టమైన నెట్వర్క్ను ఈ నివేదిక
బయటపెట్టింది. ఈ షెల్ కంపెనీల్లో కొన్ని మారిషస్లో, సైప్రస్లో, యుఎఇలో
వున్నాయి. లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేయడానికి తెలివిగా ఈ
డొల్ల కంపెనీలను ఉపయోగించారు. అధిక రుణాలు, అంతంతమాత్రం ఆస్తులు మాత్రమే
ఉన్న ఈ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉందని, రుణాలను
చెల్లించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పుకునేందుకు లిస్టెడ్ కంపెనీల
ఆస్తి అప్పుల పట్టీ (బ్యాలన్స్ షీట్)లను చూపించారు. వాటికి డబ్బును
మళ్లించడానికి ఈ డొల్ల కంపెనీలను వాడుకున్నారు. అదానీ కంపెనీల విలువను
వాస్తవిక రేటు కన్నా దాదాపు 85శాతం ఎక్కువ చేసి చూపారని ఆ నివేదిక అంచనా
వేసింది. స్టాక్ మార్కెట్లో దారుణమైన అవకతవకలకు పాల్పడుతూ, అకౌంటింగ్లో
పెద్దయెత్తన అక్రమాలకు పాల్పడడం ఇదంతా అదానీ గ్రూపు ఒక పక్కా పథకం ప్రకారం
చేసిన చర్యగా హిండెన్స్బర్గ్ నివేదిక ఆరోపించింది.<br />
హిండెన్బర్గ్ నివేదికను 'భారత్పై ఒక పథకం ప్రకారం జరిగిన దాడి'
అంటూ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. అయితే, తన వాదనను
సమర్ధించుకోవడానికి అది ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. జాతీయవాదం ముసుగులో
తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అది ప్రయత్నించింది. ''భారతదేశ సంస్థల
స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, వృద్ధి కథనం, వడివడిగా అడుగులు వేయాలన్న భారత్
ఆకాంక్షను చూసి సహించలేకనే ఈ రకమైన దాడి'' చేస్తున్నారని గావు కేకలు
పెడుతోంది.<br />
హిండెన్బర్గ్ నివేదిక ప్రభావం వెంటనే కనిపించింది. నివేదిక
వచ్చిన తరువాత వారంలోనే అదానీ గ్రూపు 6,700 కోట్ల డాలర్లను లేదా స్టాక్
మార్కెట్లో దాదాపు రూ.5.6 లక్షల కోట్ల మార్కెట్ పెట్టుబడులను
నష్టపోయింది. గౌతమ్ అదానీ తన సంపదలో 5వేలకోట్ల డాలర్ల మేరకు నష్టపోయారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తిగా వున్న అదానీ ఒక్కసారిగా 15వ
స్థానానికి పడిపోయారు.<br />
అదానీ గ్రూపు సంపదలో చాలా వరకు దేశ సహజ వనరులను అనేక ఏళ్లుగా లూటీ
చేస్తూ, ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడం ద్వారా సమకూర్చుకున్నదే. అందువల్లే
అదానీ గ్రూపు మోసపూరిత లావాదేవీలపై ప్రజలు ఇంతగా ఆందోళన చెందుతున్నారు.
అదానీ గ్రూపు ఓడరేవులు, విమానాశ్రయాలకు సంబంధించి అతిపెద్ద ప్రైవేట్
ఆపరేటర్గా అవతరించింది. ఆహార ధాన్యాల గిడ్డంగుల్లో అతిపెద్దదిగా వుంది,
విద్యుత్ ట్రాన్స్మిషన్లో అయిదోవంతు భాగాన్ని కలిగి ఉంది, సిమెంట్
పరిశ్రమను శాసిస్తుంది.బొగ్గు తవ్వకాల్లో అతిపెద్ద వాటా కలిగి దేశంలోనే
అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్రైవేటు ఉత్పత్తిదారుగా అదానీ గ్రూపు వుంది.
మోడీ ప్రభుత్వ చలవతోనే అదానీ ఇంత వేగంగా ఎదిగాడనేది నిర్వివాదాంశం.<br />
జాతీయ బ్యాంకుల నుండి రుణాలు పొందడం, జీవిత బీమా సంస్థ వంటి
సంస్థల నుండి వచ్చిన పెట్టుబడుల ద్వారా ఆస్తులు, కొనుగోళ్ళలో ఎక్కువ
భాగాన్ని సమకూర్చుకోగలిగింది. అదానీ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడుల
ద్వారానే దాదాపు రూ.80వేల కోట్ల నిధులు వచ్చాయి. బ్యాంకుల నుండి ఈ గ్రూపు
తీసుకున్న అన్ని రుణాల్లో 40శాతం వరకు ఎస్బిఐ నుండే వచ్చాయి. ఇటువంటి
పరిస్థితుల్లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలడం వల్ల ప్రజల
పొదుపు మొత్తాలకు, ప్రభుత్వ నిధులకు ముప్పు వాటిల్లుతోంది.<br />
రూ.20వేల కోట్లను సమీకరించేందుకు అదానీ, బహిరంగంగా షేర్ల
అమ్మకాలను ప్రారంభిస్తున్న సమయంలో సరిగ్గా హిండెన్బర్గ్ నివేదిక
వెలువడింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలినప్పటికీ, అంతిమంగా ఆ
ఆఫర్ పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు
కొందరు తమ సంస్థల తరపున కాకుండా వ్యక్తులుగా ఈ షేర్లను అధిక మొత్తంలో
కొనుగోలు చేయడం వల్లే అవి పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. పెట్టుబడిదారుల
మధ్య వర్గ సంఘీభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణ.
ముకేష్ అంబానీ, సజ్జన్ జిందాల్, సునీల్ మిట్టల్, పంకజ్ పటేల్ వంటి
బడా వ్యాపారవేత్తలు అదానీ కంపెనీ షేర్లను పెద్ద మొత్తంలో కొన్నట్లు
తెలుస్తోంది. అయితే, ఆ మరుసటి రోజునే, అదానీ కంపెనీలు షేర్ల జారీని రద్దు
చేస్తున్నట్లు ప్రకటించాయి. పెట్టుబడిదారులందరికీ ఆ మొత్తాలను తిరిగి
ఇచ్చేస్తామని కూడా చెప్పాయి. రెండు అదానీ ఫ్రంట్ కంపెనీలు మలి విడత
పబ్లిక్ ఆఫర్లో పెట్టుబడులు పెట్టాయన్న ఆరోపణలు రావడంతో అకస్మాత్తుగా ఈ
నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.<br />
అదానీ గ్రూపు అకస్మాత్తుగా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఎదిగిన
తీరు, చాలా వేగంగా విస్తరించిన వైనాన్ని ప్రశ్నించే స్థితే లేకుండా చేశారు.
ఏళ్ళ తరబడి, గౌతమ్ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక
తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి. బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు
చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై
పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ
నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరు పై
మీడియాలో, వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ,
వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా
సంస్థలు కానీ స్పందించిన దాఖలాలు లేవు.<br />
తమ మోసపూరిత లావాదేవీలను ప్రశ్నించే జర్నలిస్టులను
బెదిరించడానికి, అణచివేయడానికి అదానీలు తమ ధన, రాజకీయ బలాన్ని ఉపయోగించారు.
అదానీల ఒప్పందాలకు ప్రశ్నించేలా కథనాలు రాసినా, ప్రసారం చేసినా సహించలేని
స్థితి. ఆ కథనాలను ప్రచురించిన, లేదా ప్రసారం చేసిన వార్తా సంస్థలు,
చానెళ్లపై పరువు నష్టం దావాలను ఒక అస్త్రంగా ప్రయోగించారు. ఉదాహరణకు, అదానీ
ఎల్ఎన్జి టెర్మినల్లో ఇండియన్ ఆయిల్ కంపెనీ, గెయిల్ ఇండియాలు
పెట్టుబడులు ఎందుకు పెట్టాయని ప్రశ్నిస్తూ ఒక వార్తా కథనాన్ని
ప్రచురించినందుకు 2017 నవంబరులో 'ది వైర్' పత్రికపై వంద కోట్లకు పరువు
నష్టం దావా వేశారు. ఇటువంటి పరువు నష్టం కేసులను ఎదుర్కొంటున్న ఇతర
జర్నలిస్టుల్లో పరంజరు గుహ థకుర్తా (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ),
రవి నాయర్ తదితరులున్నారు. ఈ విధంగా కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలని
అదానీ గ్రూపు ప్రయత్నించింది.<br />
స్టాక్ల తారుమారు, మనీ లాండరింగ్, అకౌంటింగ్ మోసాలు, భారతదేశ
అత్యున్నత పారిశ్రామికవేత్త పేరు ప్రతిష్టకు భంగం కలిగిచే కుట్రగా చూపించే
యత్నాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ అదానీ-హిండెన్బర్గ్ అధ్యాయం నుంచి
తీసుకోవాల్సిన అసలు పాఠం మరుగున పడకూడదు.<br />
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన దన్నుతోనే అదానీ భారతదేశంలోనే అత్యంత
సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని చూడకపోతే అదానీ కథ అసంపూర్ణమే అవుతుంది.
2002లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినపుడు అదానీ, మోడీ మధ్య సంబంధాలు
మొదలయ్యాయి. అప్పటి నుండి అదానీ అదృష్టాలన్నీ మోడీ రాజకీయ పంథాతో
పెనవేసుకుని సాగాయి. 2014లో మోడీ ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరంలో రూ.50.4
వేల కోట్లుగా వున్న అదానీ సంపద, 2022 నాటికి వచ్చేసరికి అమాంతంగా అది
రూ.10.30లక్షల కోట్లకు పెరిగిపోయింది. మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడైన
పారిశ్రామికవేత్త అదానీకి ఇక పట్ట పగ్గాల్లేవు. ఏ ప్రభుత్వ నియంత్రణా సంస్థ
కానీ, అధికారి కానీ ఆయనను ప్రశ్నించే సాహసం కానీ, అడ్డుకునే యత్నం కానీ
చేయలేని స్థితి. ప్రభుత్వ అండ చూసుకునే అదానీ గ్రూపు తన వ్యాపార
సామ్రాజ్యాన్ని అంతగా విస్తరించుకోగలిగింది. ఇటీవలి కాలంలో ఆశ్రిత
పెట్టుబడిదారీ విధానానికి ఇదొక అత్యంత దారుణమైన ఉదాహరణ. మోడీ-అదానీ
సంబంధాలు ఈనాడు దేశాన్ని పాలిస్తున్న హిందూత్వ-కార్పొరేట్ శక్తుల పొత్తును
నగంగా బయటపెట్టింది. మోడీ ప్రభుత్వ మద్దతుతో తాను ఈ తుపానును ఎదుర్కోగలనని
అదానీ చాలా ధీమాగా ఉన్నారు. కానీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడాన్ని,
మతోన్మాద-కార్పొరేట్ శక్తులు కుమ్మక్కయి తమ జీవనోపాధిని దెబ్బతీయడాన్ని
స్వయంగా చూస్తున్న ఈ దేశ పౌరులకు మాత్రం ఈ దోపిడీ, అక్రమ సంపాదనలకు గాను
అదానీలను జవాబుదారీ చేయడమనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ఉన్నది.<br />
అందువల్ల, అదానీ గ్రూపునకు సంబంధించిన మొత్తం ఆర్థిక, వ్యాపార
కార్యకలాపాలన్నింటిపైనా నియంత్రణా సంస్థలు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు
దర్యాప్తు జరిపేలా చూసేందుకు కృతనిశ్చయంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా వుంది.
అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ రీసెర్చి సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు
జరిపేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విచారణను
సుప్రీం కోర్టు పర్యవేక్షించాలి.</p>
<b>(పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం)</b>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-57080740812164931122022-12-30T01:56:00.004-08:002022-12-30T02:23:44.268-08:00 సబ్ప్లాన్ అమలులో పాలకుల విఫలం<p></p><p style="text-align: justify;"> సమాజంలో అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల
అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా వ్యయంలో ప్రత్యేక
కేటాయింపుగా వున్న సబ్ప్లాన్ విధానాన్ని కొనసాగించడం అవశ్యం. కేంద్ర
ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసుకొచ్చిన ఈ సబ్ప్లాన్ విధానం నయా
ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర
స్థాయిలో సబ్ప్లాన్ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమం
సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది. అయితే, దాని కాల పరిమితి
పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది. సబ్
ప్లాన్ చట్టాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు
చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం
విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న
ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు
ఉపక్రమించాలి. <br /></p><p style="text-align: justify;">నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో
సబ్ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు
చేసి నీతి ఆయోగ్ను తీసుకురావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక
సబ్ప్లాన్ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం
పెల్లుబకడంతో బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు. కాని,
అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా
మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్న మోడీ సర్కారు
ఎస్సి, ఎస్టిల సంక్షేమానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం
సంఘపరివార్ నైజానికి నిదర్శనం. కాని, కేరళ లోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆ
రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టిల జనాభా శాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని
ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశంలో అలా చేస్తున్న రాష్ట్ర
ప్రభుత్వం ఇంకేదీ లేదు.<br /></p><p style="text-align: justify;"> రాష్ట్రంలో సబ్ప్లాను చట్టం చేయడంతో నిధుల
కేటాయింపు, ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని, 2018 నుండి రాష్ట్ర
బడ్జెట్లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు
యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్ప్లాన్ నిధులు కేటాయించాలి.
ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలు
కేటాయించాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్సి
ఎస్టిల అభివృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేల కోట్లు మాత్రమేననీ మిగతా
12 వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లించారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు.
సబ్ప్లాన్ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలు అంటే దళిత వాడలు,
గిరిజన గూడేలు, తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు
చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ
రీతిలో ఖర్చు చేయడంలేదు. రోడ్లు వేయడానికి, సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్
ప్లాన్ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా
అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్ప్లాన్ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా
తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో
భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు.<br /></p><p style="text-align: justify;">ప్రభుత్వ రంగాన్ని
పాలకులు క్రమంగా కుదించివేయడంతో సామాజిక న్యాయం చతికిలపడుతోంది. ఎస్సి,
ఎస్టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు
రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించవలసిన పరిస్థితి. అణగారిన వర్గాల పట్ల
వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్సి, ఎస్టిల అభివృద్ధికి ప్రత్యేకంగా
నిధులు వెచ్చించేలా సబ్ప్లాన్ చట్టం కొనసాగాల్సిందే. కేటాయింపులు అణగారిన
తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్ప్లాన్
నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై
చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు,
సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల, ప్రగతిశీల
శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక
తప్పదు.
</p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6093289426582132245.post-78356425789022600882022-03-25T12:21:00.002-07:002022-03-25T12:21:42.408-07:00 ఎఫెక్టివ్ విజువల్స్ స్టోరీ డిఫెక్ట్<p><strong> </strong></p><div class="separator" style="clear: both; text-align: center;"><strong><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcZyiUyAAvueqS8Srl2rohktCNl8DUiTOJ-fl3yHLLAD5XI9rvsOcy0M20nz6AySeMKtUaxmMkJWE4AHJBJS_NySa_y2Pdi6JLTHxasr3fzWB8dqPbk7KrHER7UCLk-WhKnDiICU6s06sqyiWG6e-t9w5NtaHU2ew5abFmgI02mKLz-R2JNjVY9Wc_Ug/s650/RRRR.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="350" data-original-width="650" height="172" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcZyiUyAAvueqS8Srl2rohktCNl8DUiTOJ-fl3yHLLAD5XI9rvsOcy0M20nz6AySeMKtUaxmMkJWE4AHJBJS_NySa_y2Pdi6JLTHxasr3fzWB8dqPbk7KrHER7UCLk-WhKnDiICU6s06sqyiWG6e-t9w5NtaHU2ew5abFmgI02mKLz-R2JNjVY9Wc_Ug/s320/RRRR.jpg" width="320" /></a></strong></div><strong><br />ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ </strong><p></p><strong>విడుదల తేది:</strong> 25-03-2022<br /><strong>నటీనటులు:</strong> ఎన్టిఆర్, రామ్చరణ్, అజరు దేవ్గణ్, శ్రీయ, అలియా భట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, రేస్టీవెన్ సన్, రాహుల్ రామకృష్ణ తదితరులు.<br /><strong>కథ:</strong> కె.విజయేంద్రప్రసాద్<br /><strong>సినిమాటోగ్రఫీ: </strong>కె.కె.సెంథిల్ కుమార్<br /><strong>సంగీతం</strong>: ఎం.ఎం.కీరవాణి<br /><strong>ఎడిటింగ్:</strong> శ్రీకర్ ప్రసాద్<br /><strong>మాటలు</strong>: సాయి మాధవ్ బుర్రా<br /><strong>నిర్మాత: </strong>డీవీవీ దానయ్య<br /><strong>స్క్రీన్ప్లే, దర్శకత్వం:</strong> ఎస్.ఎస్.రాజమౌళి.<br />రాజమౌళి సినిమా అంటేనే భారీతనం. ఆయన విజన్తో ఎన్నో మ్యాజిక్కులు చేస్తుంటారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకెళ్లారు. కొమురం భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. నాలుగేళ్ల క్రితం ఇద్దరు స్టార్ హీరోలతో మొదలైన రోజు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి తరహా టేకింగ్, దేశవ్యాప్తంగా చేసిన ప్రమోషన్ ఈ చిత్రంపై రెట్టింపు అంచనాలు క్రియేట్ చేశాయి. కరోనా విపత్తు, థియేటర్లు, టికెట్ ధరలు పలు రకాల సమస్యలతో విడుదల ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.<br /> <strong> కథ:</strong> విశాఖపట్టణం సమీపానికి చెందిన అల్లూరి సీతారామరాజు ఊరికి ఇచ్చిన మాట కోసం ఢిల్లీలోని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. ఒక లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లిన రామరాజుకు పదోన్నతి పొందాలని పట్టుగా పనిచేస్తాడు. తన మరదలు సీత కోరిక నెరవేరాలంటే రామరాజు లక్ష్యం సాధించాలి. అదెలా జరుగుతుంది? ఇదిలా ఉండగా బ్రిటీష్ గవర్నర్ స్కాట్ అదిలాబాద్ పర్యటనకు వెళ్లి అక్కడి గోండ్ల బిడ్డ మల్లిని ఢిల్లీ తీసుకెళ్లిపోతాడు. ఆ బిడ్డను తల్లి దరికి చేర్చాలని గోండ్ల జాతికి కాపలాగా ఉండే కొమురం భీమ్ ఢిల్లీకి పయనమవుతాడు. బ్రిటీష్ కోటను దాటుకుని మల్లిని తీసుకురావడం కష్టం. ఆ తరుణంలోనే అల్లూరి.. భీమ్కు పరిచయం అవుతాడు. ఇద్దరి మధ్య మైత్రి కుదురుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఇద్దరి లక్ష్యాలు నెరవేరాయా లేదా? అజరు దేవగణ్, శ్రీయ కథేంటి అన్నది తెరపైనే చూడాలి. కథ అంత ఎఫెక్టివ్గా లేదనే చెప్పాలి.<br /><br /><strong> విశ్లేషణ: </strong>అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అయితే వీరిద్దరూ కలిస్తే అన్న కల్పిత కథతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' (రణం.. రౌద్రం.. రుధిరం) చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అనగానే నిడివి, ఇంపార్టెన్స్ ఇలా చాలా లెక్కలు ఉంటాయి. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి అభిమానులు, సినీ ప్రియుల నోట ఇదే మాట వినిపిస్తుంది. నీరు, నిప్పు అంటూ హీరోల పాత్రలను పరిచయం చేశారు. దానికి క్లారిటీ ఇవ్వలేదు. లాఠీఛార్జ్ సన్నివేశంతో రామరాజు పాత్రను, అడవిలో పులితో పొరాటం సన్నివేశాలతో భీమ్ పాత్రను పరిచయం చేశారు. ఇద్దరికీ కావలసినంత ఎలివేషన్ ఇచ్చి.. రెండు పాత్రలను బ్యాలెన్స్ చేశారు రాజమౌళి. ఓ ఆపదలో ఉన్న ఓ కుర్రాడిని కాపాడి వీరిద్దరూ స్నేహితులైన తీరును చూపించారు. కానీ ఆ స్నేహం ఎలా బిల్డప్ అయిందో చూపించలేదు. 'నాటు నాటు' పాటలో మాత్రమే వారిద్దరి మధ్య స్నేహాన్ని భావోద్వేగంగా చూపించారు. రామరాజు పాత్ర ఏంటి? అతను ఏ కారణంతో బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్గా చేరాడు అన్నది బాగానే చెప్పారు. కానీ భీమ్ విషయంలో అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదు. గొడ్ల కాపరి అని చెప్పారు. అతను ఏంటి? ఆ గూడెంలో ఏం చేస్తాడన్నదీ వివరణ లేదు. కేవలం అతని బలం ఏంటో రాజీవ్ కనకాల మాటలతో సరిపెట్టారు. తన గూడెంకి చెందిన పిల్లని రక్షించడానికి ముస్లిం వ్యక్తిగా వెళ్లడం అన్నది కథకు అతికినట్లు లేదు. ఆ తర్వాత రామరాజు పాముకాటుకు గురికావడం.. ఇద్దరి కథలు బయట పెట్టడం.. భీమ్ను అరెస్ట్ చేయడంతో కథ మరో ట్రాక్ ఎక్కింది. ఇంటర్వెల్లో హీరోలిద్దరూ పోటీ పడుతుంటే ఓ వైపు ఉద్వేగం, మరో వైపు బాధ కలుగుతాయి. అజరు దేవగణ్, శ్రీయ తదితరుల పాత్రలతో సెకెండాఫ్ మొదలవుతుంది. 20 నిమిషాలు సాగే ఆ ట్రాక్ కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథ అక్కడే రివీల్ చేయడం కొసమెరుపు. భీమ్కి శిక్ష వేసే సమయంలో 'కొమరం భీముడా' పాటతో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు. భీమ్ని ఉరికంబం ఎక్కించినప్పుడు రామరాజు తప్పించే ప్రయత్నం బాగానే ఉన్నా అంతకుముందు సన్నివేశాలు తేలిపోయాయి. బ్రిటీషర్ల నుంచి తప్పించుకుని మల్లిని తీసుకుని బయటపడ్డ భీమ్కు సీత ఆశ్రయం ఇస్తుంది. అక్కడ రామ్ లక్ష్యం, తన ప్లాష్ప్యాక్ భీమ్కి తెలుస్తుంది. రామ్ని రక్షించుకోవాలని బ్రిటీష్ కారాగారానికి బయలుదేరతాడు. అక్కడే రామ్చరణ్ పోషించిన అల్లూరి గెటప్ రివీల్ అవుతుంది. అయితే క్లైమాక్స్ సింపుల్గా తేల్చేసినట్లు అనిపిస్తుంది. దర్శకుడు ఇంకెదో చేస్తాడు అని అంచనాలు వేసుకున్నవారికి నిరాశ తప్పదు.<br /> ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... రాజమౌళి విజన్కి తగ్గ హీరోలు ఆయనకు దొరకడం సినిమాకు ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా హీరోలిద్దరి పాత్రలను బాగా బ్యాలెన్స్ చేశారు. నటన పరంగా ఇద్దరూ విజృంభించారు. 100 శాతం పాత్రలకు న్యాయం చేశారు. అలియా భట్ పాత్ర చిన్నదే అయినా సినిమాలో మలుపునకు కారణం అవుతుంది. అజరు దేవగణ్ పాత్ర కూడా అంతే! ఆలియా, రామ్ గురించి చెప్పే సన్నివేశం భావోద్వేగానికి లోను చేస్తుంది. బ్రిటీషర్ల విలనిజం అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసిన భావన కలిగించాయి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే రాజమౌళి ఈ సినిమా విషయంలో అంత ఆసక్తి చూపించినట్లు లేరు. ట్రెయిన్ బ్లాస్ట్, తెరపై కనిపించిన జంతువులు సీజీలో తెలిసిపోతున్నాయి. సీజీ వర్క్ రాజమౌళి స్థాయిలో లేదు. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్స్. విజయేంద్రప్రసాద్ అల్లిన కథ, సాయిమాధవ్ బుర్రా డైలాగ్లు ఆకట్టుకున్నాయి. రాజమౌళికి బాగా కలిసొచ్చిన సెంథిల్ ఫొటోగ్రఫీ అదిరింది. సాబుసిరిల్ ఆర్ట్ వర్క్ బావుంది. నిర్మాత ఖర్చు చేసిన ప్రతి రూపాయి కొన్ని సన్నివేశాల్లో క్వాలిటీ రూపంలో కనిపించింది. 'బాహుబలి'తో భాషాబేధం తొలగించిన రాజమౌళి ఈ చిత్రంతో అభిమానుల మధ్య అంతరాలను కూడా తొలగించారని చెప్పొచ్చు.<br />భీమ్, అల్లూరి సీతారామరాజు అనే పేర్లను కేవలం మార్కెటింగ్ ప్రకారం పెట్టినట్లుగా వుంది. కథలో ఆ పేర్లు వున్నా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళకు పైగా అయిన సందర్భంగా ప్రముఖ దినపత్రికలలో రకరకాలుగా ఒక్కో ప్రాంతంలో పోరాట యోధుల గురించి కథలు రాస్తున్నారు. కనీసం అందులో ఒక కథ అయినా తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. కేవలం ఊహాజనితమైన కథ తీసుకుని తనకు తెలిసిన టెక్నికల్ గ్రాఫిక్తో మాయ చేశారు. విజువల్స్ బాగున్నా కథ అంతబాగా కుదరలేదనిపిస్తోంది.<br /> తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. సినిమా బెనిఫిట్షోలో విద్యుత్ అంతరాయంతో అభిమానులు, వీక్షకులు తీవ్ర అక్రోశానికి గురయి విజయవాడలో ఓ సినిమా థియేటర్ను ధ్వంసం చేశారు.panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-8645524286338840232022-03-10T10:19:00.000-08:002022-03-10T10:19:15.009-08:00 పంజాబ్ను ఊడ్చేసిన ఆప్<p></p><div class="separator" style="clear: both; font-weight: bold; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEjyz6SjeDpUZwITtujTZjS23c_I0qlmP8SJsQjDGg9hbG-HuKzBbIr-VMyWFJJp1A_A6rcLH9czLqakPGkKUOGG49ZRWBxbVuU4NT01jCAW7w7LeDVEZzv2CaYAr0ecZenQEYYuQ4c8Vo0hPS8-u0yOHYFyofZ18Lz3AOy75FExP6-yU-3d3too9G__Fg=s600" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="345" data-original-width="600" height="184" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEjyz6SjeDpUZwITtujTZjS23c_I0qlmP8SJsQjDGg9hbG-HuKzBbIr-VMyWFJJp1A_A6rcLH9czLqakPGkKUOGG49ZRWBxbVuU4NT01jCAW7w7LeDVEZzv2CaYAr0ecZenQEYYuQ4c8Vo0hPS8-u0yOHYFyofZ18Lz3AOy75FExP6-yU-3d3too9G__Fg=s320" width="320" /></a></div><br /><br /><b>యుపిలో బిజెపి జోరు -డీలాపడ్డ కాంగ్రెస్</b><p></p><div style="text-align: justify;"> పంజాబ్ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఊడ్చేసింది. మొత్తం 117 స్థానాల్లో 92 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ను చావుదెబ్బ కొట్టింది. దీంతో కాంగ్రెస్ 18 స్థానాలకే పరిమితమైంది. బిఎస్పి,శిరోమణి ఆకాళీదళ్ కూటమి, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్-బిజెపి కూటమి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆకాళీదళ్కు నాలుగు, బిజెపికి రెండు స్థానాలు లభించాయి. గత ఎన్నికల్లో ఆప్ 20 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 92 స్థానాల్లో విజయం సాధించి, 72 స్థానాలను పెంచుకోగలిగింది. గత ఎన్నికల్లో ఆప్ 23.7 శాతం ఓట్లు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం ఓటింగ్ సాధించింది. దాదాపు 19 శాతం ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 18 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏకంగా 59 స్థానాలను కోల్పోయింది. గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 23 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 15 శాతం ఓట్లు కోల్పోయింది. శిరోమణి అకాలీ దళ్ గత ఎన్నికల్లో 15 స్థానాలు గెలవగా, ఈసారి మూడు స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు రాగా, 18.4 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది. మంత్రులు ఓం ప్రకాష్ సోనీ, మన్ప్రీత్ సింగ్ బాదల్, రజియా సుల్తానా, భరత్ భూషన్, విజరు ఇందిర్ సింఘాలా, రణదీప్ సింగ్ నభా, గుర్కీరత్ సింగ్ కోట్లి తదితరులు ఓటమి పాలయ్యారు.<div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEi6FmzEuPGttQBVb8uQair8Z-wyjGE1uWCW9GzzGlhlpjiQ6yCOOOkrtDauW2zKepMNOPBI7xhmp1CDQ7VdHW1BFnO02kiTk2TtPW4Kj8lC7KYYLrY4VsYdMAKG1ApCgW-QxhUE1O5rHZ6h3QsuNBaFBnVx5UD0Zy3G5yNt7IJo5y711ZpHYwNYwefqng=s600" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><b><img border="0" data-original-height="345" data-original-width="600" height="184" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEi6FmzEuPGttQBVb8uQair8Z-wyjGE1uWCW9GzzGlhlpjiQ6yCOOOkrtDauW2zKepMNOPBI7xhmp1CDQ7VdHW1BFnO02kiTk2TtPW4Kj8lC7KYYLrY4VsYdMAKG1ApCgW-QxhUE1O5rHZ6h3QsuNBaFBnVx5UD0Zy3G5yNt7IJo5y711ZpHYwNYwefqng=s320" width="320" /></b></a></div></div><b>ఆప్ విజయం వెనుక..</b><br /> పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం వెనుక పక్కాగా ఎన్నికల వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ ప్రచారాన్ని ప్రారంభించింది. నాణ్యమైన విద్యబోధన జరిగేలా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ప్రచార అస్త్రంగా కేజ్రీవాల్ ప్రయోగించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్, నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి, ఇంటింటికీ గ్యారెంటీ కార్డును నింపేలా ఫారాలిచ్చారు. ఇలా ఆప్ చెబుతున్న విషయాలు సామాన్యుల ఇళ్లకు చేరాయి. నగరాల్లో స్థానికంగా బలంగా ఉన్న దాదాపు 50 మంది ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్టు ఇచ్చారు. దీంతో గ్రామాలతో పాటు నగరాల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించటానికి కారణమైంది.<br /><br />కీలకంగా మారిన మూడు అంశాలు<br />- పంజాబ్లో మార్పును పసిగట్టిన కేజ్రీవాల్.. పార్టీని అక్కడ బలంగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, ప్రజాసమస్యలను కాంగ్రెస్ పట్టించుకోకపోవటం గమనించారు. ఇదే అదనుగా కేజ్రీవాల్ ప్రచార విధానాన్ని మార్చేశారు. మాల్వాలో పెద్ద ప్రభావం కనిపించింది.<br />- ఆప్.. బయటి పార్టీ అనికాంగ్రెస్ ప్రచార అస్త్రంగా వినియోగించింది. దీన్ని తిప్పికొట్టడానికి వివాద రహితుడైన భగవంత్ మాన్ను సిఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు. ఫీడ్బ్యాక్ నుంచి ప్రకటన వరకు, మద్దతుదారులు, ప్రత్యర్థుల వరకూ చర్చ జరిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. ముందుగా ఒక్క అవకాశం ఇవ్వమని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి విమర్శలు రాగానే... ఆ నినాదాన్ని మార్చారు. భగవంత్ మాన్ పేరుతో ఓట్లు అడగటం షురూ చేశారు.<br />- పంజాబ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న 22 రైతు సంఘాల ఐక్య సమాజ్ మోర్చా. రైతు నాయకుడు బల్బీర్ రాజేవాల్ ఆప్తో పొత్తును నిరాకరించారు. ఈలోపు కేజ్రీవాల్ ధైర్యం చేసి 90 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటించారు. మిగతా సీట్లు ఇవ్వటానికి కేజ్రీవాల్ సిద్ధమైనా.. రాజేవాల్ అంగీకరించలేదు. దీంతో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో గెలవటానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.<br /><strong>కాంగ్రెస్ను ముంచిన విభేదాలు</strong><br /> కాంగ్రెస్లో విభేదాలు ఆ పార్టీని పూర్తిగా ముంచివేశాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చడం ప్రతికూలంగా మారింది. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్ని పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో దారుణంగా ఓటమి చవిచూశారు. పంజాబ్ పిసిసి చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమఅత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి పరాజయం చెందారు. అమృత్సర్ పార్లమెంట్ స్థానం నుంచి మూడు సార్లు విజయం సాధించిన సిద్దూ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారంటేనే కాంగ్రెస్ పరిస్థితి అంచనా వేయవచ్చు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆప్ ధాటికి గల్లంతయ్యారు.<br />కొత్త చరిత్ర సృష్టించాం,<br /><strong>పేదల అనుకూల, క్రియాశీల పాలనకు ప్రజల మద్దతు : ప్రధాని నరేంద్ర మోడీ</strong><br /> పార్టీ పేదల అనుకూల, క్రియాశీల పాలనకు ప్రజల నుంచి బలమైన ఆమోదముద్ర లభించింది. ఇది ఉత్సాహం, ఉత్సవాల రోజు. ఈ ఉత్సాహం భారతదేశ ప్రజాస్వామ్యం కోసం. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో విజయం 'జీత్ కా చౌకా' అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ చాలా మంది ప్రధానమంత్రులను ఇచ్చిందని, తొలిసారిగా పూర్తి కాలం పనిచేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని చెప్పారు. సుపరిపాలన మరింత మెరుగ్గా సాగిందన్నారు. గత కొన్నేళ్లుగా పారదర్శకంగా, పేదలకువారి హక్కులను అందజేస్తోందన్నారు. బిజెపి కార్యకర్తలు 24 గంటలూ పనిచేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించారన్నారు. మణిపూర్, ఉత్తరప్రదేశ్, గోవాలలోనూ బిజెపి ఓట్ల శాతం పెరిగిందన్నారు. గోవాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిందని, గోవా ప్రజలు వరుసగా మూడోసారి వారికి సేవ చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు. ''యుపి ప్రజల నుండి నేను పొందిన ప్రేమ. పార్లమెంటు సభ్యునిగా వారణాసి నుంచి నన్ను యుపిగా మార్చారు. ''మై యుపి వాలా,'' అని అన్నారు.<br /><strong>దేశమంతా విస్తరిస్తాం : కేజ్రీవాల్</strong><br /> పంజాబ్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆప్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఆప్ జోరులో అమరీందర్, చన్నీ, సిద్ధూ, సుఖ్బీర్సింగ్, ప్రకాశ్సింగ్, బిక్రమ్సింగ్ కొట్టుకుపోయారు. ఆప్ను దేశమంతా విస్తరిస్తాం. ప్రజలు ఆదరించాలి.<br /><strong>ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం : రాహుల్గాంధీ</strong><br /> ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తాం.<br /><strong>నిరాశ పడొద్దు : శరద్ పవార్</strong><br /> తాజా ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనమంతా కలిసి పనిచేసే సమయం మళ్లీ వస్తుంది. దేశవ్యాప్తంగా బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక వేదికపైకి రావాల్సిన అవసరముంది. తద్వారా బిజెపికి ప్రత్యామ్నాయంగా మారుతాం. అంతర్గత సంక్షోభం కాంగ్రెస్ను దెబ్బతీసింది. కాంగ్రెస్ నిర్ణయాల్ని పంజాబ్ ప్రజలు అంగీకరించలేకపోయారు. యూపీలో అఖిలేశ్ యాదవ్ ఒంటరిగా పోరాడారు. బిజెపికి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని శివసేన-ఎన్సిపి-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రభావం చూపవు.<br /><strong>కొత్త చరిత్ర సృష్టించాం : యోగి ఆదిత్యనాథ్</strong><br /> ఉత్తరప్రదేశ్లో బిజెపి కొత్త చరిత్ర సృష్టించింది. ప్రధానిమోడీ నాయకత్వంలో బిజెపి అద్భుతమైన విజయం అందుకుంది. అభివృద్ధి చూసే రెండోసారి అధికారం ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాబోతోంది. పార్టీలో ప్రతి ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కింది.<br /><strong>ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా : పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ</strong><br /> ఇది ప్రజా తీర్పు. ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నాం. ఆప్కు అభినందనలు'' అని చెప్పారు. అమృత్సర్ తూర్పు నుంచి పోటీపడిన సిద్ధూ ఓటమి చెందారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పరిస్థితి మరీ దారుణం. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ఓటమిపై స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్టు చెప్పారు.<br /><strong>నాలుగు రాష్ట్రాల్లో ఎందుకిలాంటి ఫలితాలు వచ్చాయి?</strong><br /> రైతులను , కార్మికులను, మధ్య తరగతి ప్రజలను ఇంతగా ఇబ్బంది పెట్టిన బిజెపిని నాలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఆదరించారు?. నిత్యావసర ధరలు పెంచింది. లౌకిక వాదానికి తూట్లు పొడిచింది. మనువాదాన్ని ప్రజలపై బలంగా రుద్దేందుకు ప్రయత్నించింది. రుద్దుతోంది. విద్య, వైద్య రంగాలలో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మరెన్నో పాపాలు చేసింది. అయినా ఎందుకు బిజెపికి ప్రజలు సానుకూలంగా మారారు. హిందూత్వ నినాదం పని చేసిందా?...కాంగ్రెస్, బిఎస్పి, ఇతర రాజకీయ పార్టీలన్నీ ఎందుకు చతికిల పడ్డాయి. భవిష్యత్తులో నయినా కాంగ్రెస్ ఇతర పార్టీలను కలుపుకుని పోవాలనే గుణపాఠం నేర్చుకోవాలి. వామపక్ష , ఇతర ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా ఉండాలి. దేశంలో లౌకిక వాదుల బలం పెరగాలి.panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-13988625910260593512022-02-17T11:31:00.003-08:002022-02-17T11:31:39.197-08:00 పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు కన్నమూత<div style="font-family: inherit;"><div class="" dir="auto" style="font-family: inherit;"><div class="ecm0bbzt hv4rvrfc ihqw7lf3 dati1w0a" data-ad-comet-preview="message" data-ad-preview="message" id="jsc_c_q5" style="font-family: inherit; padding: 4px 16px 16px;"><div class="j83agx80 cbu4d94t ew0dbk1b irj2b8pg" style="display: flex; flex-direction: column; font-family: inherit; margin-bottom: -5px; margin-top: -5px;"><div class="qzhwtbm6 knvmm38d" style="font-family: inherit; margin-bottom: 5px; margin-top: 5px;"><span class="d2edcug0 hpfvmrgz qv66sw1b c1et5uql lr9zc1uh a8c37x1j fe6kdd0r mau55g9w c8b282yb keod5gw0 nxhoafnm aigsh9s9 d3f4x2em iv3no6db jq4qci2q a3bd9o3v b1v8xokw oo9gr5id hzawbc8m" dir="auto" style="color: var(--primary-text); display: block; font-family: inherit; font-size: 0.9375rem; line-height: 1.3333; max-width: 100%; min-width: 0px; overflow-wrap: break-word; word-break: break-word;"><div class="kvgmc6g5 cxmmr5t8 oygrvhab hcukyx3x c1et5uql ii04i59q" style="font-family: inherit; margin: 0px; overflow-wrap: break-word; white-space: pre-wrap;"><table cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="float: left;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhuFrwL9UL-d9aDFI-_o-X7buAx6ic85pO7LsnT4kk2w83dvC0Fk1sPReRJKdQH7kJfgbKtW5X3bG-MV_fWTV_rgETDjGb21fIsyqGD0ig4u8ziVPaoEMYO2C_VS2vB3eg4TmwgbXrlVIyAwccKcPprv1Yzs-FTRuyZjHIfHblcQpxQC7LEnYmuNiOXxQ=s1600" imageanchor="1" style="clear: left; margin-bottom: 1em; margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="1600" data-original-width="1071" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhuFrwL9UL-d9aDFI-_o-X7buAx6ic85pO7LsnT4kk2w83dvC0Fk1sPReRJKdQH7kJfgbKtW5X3bG-MV_fWTV_rgETDjGb21fIsyqGD0ig4u8ziVPaoEMYO2C_VS2vB3eg4TmwgbXrlVIyAwccKcPprv1Yzs-FTRuyZjHIfHblcQpxQC7LEnYmuNiOXxQ=s320" width="214" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;"></td></tr></tbody></table><br /><div dir="auto" style="font-family: inherit; text-align: justify;"><br /></div></div></span></div></div></div></div></div><div><div class="stjgntxs ni8dbmo4 l82x9zwi uo3d90p7 h905i5nu monazrh9" data-visualcompletion="ignore-dynamic" style="border-radius: 0px 0px 8px 8px; overflow: hidden;"><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సాహితీ వటవృక్షం</strong></div></strong><span style="font-family: inherit;"><div style="text-align: justify;"><span style="font-family: inherit;">ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నమూశారు. 2022 ఫిబ్రవరి 17న గురువారం పెనుకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. మధ్యామ్నం 3 గంటల సమయంలో గుండెపోటుకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకులుగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగు పద్యానికి, అవధానానికి, వర్తమానకాలంలో ప్రసిద్ధుడైన ఆశావాది ఎన్నో వందల అవధానాలు దేశవ్యాప్తంగా చేశారు. అంతేగాక అనేక గ్రంధాలు దాదాపు 60 దాకా రాశారు. ఆయన కవిగా, వక్తగా, రచయితగా, సాహితీ కార్యకర్తగా, విద్యావేత్తగా ప్రముఖ అవధానిగా అనంత సాహితీ వనంలో ఏపుగా పెరిగిన పెద్ద సాహితీ వటవక్షంగా నిలిచారు. ఆయన సాహిత్య ప్రయాణంలో 'పద్మశ్రీ' సైతం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వివిధ ఉద్యోగాల్లో వారు స్థిరపడ్డారు. పెనుకొండ పట్టణంలో శుక్రవారం 18-02-2022న ప్రకాశరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.</span></div></span><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">తెలుగు పద్యానికి వన్నె తెచ్చిన డాక్టర్ ఆశావాది</strong></div></strong><span style="font-family: inherit;"><div style="text-align: justify;"><span style="font-family: inherit;"> తెలుగు రాష్టాల్లోని సాహిత్య రంగంలో పద్యానికి, అవధానానికి వన్నెతెచ్చిన డాక్టర్ ఆశావాది ప్రకాశరావు 1944వ సంవత్సరం ఆగస్టు 2న అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కొరివిపల్లి గ్రామంలో కుళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు జన్మించారు. అష్టావధానంలో ఆశావాది దిట్ట. ఎన్నో అవధానాలు చేసిన ఆశావాది తన అనుభవాల్ని అక్షరబద్ధం చేసి అనేక రచనలు చేశారు. వీటిలో అవధానదీపిక, అవధాన కౌముది, అవధానకళాతోరణము, అవధాన వసంతం మొదలైనవి ఉన్నాయి. ఇవిగాక వరదరాజు శతకం, పార్వతీశతకం, మెరుపు తీగలు వంటి కావ్యాలు కూడా ఉన్నాయి. ఆశావాది పద్యరచనతో పాటు ఆధునిక వచన కవితలో ఆర్కెస్ట్రా, అంతరంగ తరంగాలు మొదలైన కావ్యాలు రచించారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలు కలిగిన డాక్టర్ ఆశావాది విద్యార్థి దశలోనే అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేత 'బాలకవి'గా ప్రశంసలు పొందారు. 55 సంవత్సరాలుగా రచనా వ్యాసంగం, సాహిత్యంలో ప్రయాణం సాగించారు. 35 సంవత్సరాలు విద్యారంగంలో ఉపాధ్యాయుడు, అధ్యాపకుడిగా విశేష కషి చేశారు. ప్రకాశరావు 171 అవధానాలు చేసి, 60కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఆశావాది సాహిత్యకషిని గురించి వివిధ కవులు ఆయన పేరిట 24 పుస్తకాలు రచించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని మహోన్నత శిఖరాలకు చేర్చిన మేరుపర్వతం ఆశావాది ప్రకాశరావు. ఆయన రచనలపై ఐదారుగురు పిహెచ్డిలు చేశారు. ఆయనకు రెండు తెలుగు రాష్టాల్లో శిష్యులున్నారు. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన అష్టావధానాలు చేశారు.</span></div></span><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">పురస్కారాలు, సత్కారాలు</strong></div></strong><span style="font-family: inherit;"><div style="text-align: justify;"><span style="font-family: inherit;"> ఆశావాది సాహిత్య రంగంలో ఎన్నో సత్కారాలు పొందాడు. 1976లో దళితుల్లో ప్రథమ అవధానిగా 'తెలుగు వెలుగు' పురస్కారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి అందుకున్నారు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయం 'రాష్ట్రకవి'గా సత్కరించింది. 1994లో ఉగాది పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2000 సంవత్సరంలో డిలిట్ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించింది. 2005లో హరిజన సేవాసంఘం ద్వారా గాంధేయ వాద పురస్కారం పొందాడు. అధికార భాషాసంఘం నుండి 'భాషాభిజ్ఞు' పురస్కారాన్ని పొందారు. ఆశావాది జీవితంలో అపూర్వఘట్టం పూర్వం అల్లసాని పెద్దనలా 'స్వర్ణగండ పెండేర సన్మానం' పొందడం. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆయన తన సాహితీ ప్రజ్ఞకు గుర్తుగా ఈ సన్మానాన్ని పొందడం విశేషం. ఆశావాది తెలుగు సాహితీ క్షేత్రంలో సాహితీ వారసత్వంగా ఎన్నో తెలుగు విత్తనాలు వేసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆయన స్వయంగా 'రాయలకళాగోష్టి' సంస్థ స్థాపించి దానికి కార్యదర్శిగా పనిచేశారు. 'ఆంధ్ర పద్య కవితాసదస్సు' రాష్ట్ర కార్యదర్శిగా పది సంవత్సరాల పాటు 1993 నుండి పనిచేసి ఎంతోమంది సాహిత్య కారులును వెలుగులోకి తెచ్చారు. 'ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ' సభ్యునిగా కూడా పనిచేశారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.</span></div></span><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">ఇతర విశేషాలు</strong></div></strong><span style="font-family: inherit;"><div style="text-align: justify;"><span style="font-family: inherit;"> ప్రథమ సంవత్సరం డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే (1962) అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణతో 'బాలకవి'గా ఆశీర్వదప్రాప్తి అందుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కర్నాటక ఉన్నత పాఠశాలల తెలుగు పాఠ్యాంశ రచయిత. అనేక పత్రికలలో వీరి కవితలు, వ్యాసాలు ముద్రితమయ్యాయి. వీరి సాహిత్యవికాసంపై 2 రోజులపాటు యుజిసి నిధులతో కర్నూలులోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ సదస్సు జరిగింది. పలు సాహితీ సాంస్కతిక సంస్థలు 13 రకాల బిరుదులతో సత్కరించింది. సహ సాహితీవేత్తల గ్రంథాలు 14 దాకా అంకిత స్వీకారం పొందారు. ఆయన 7 జాతీయసదస్సులకు పరిశోధనపత్రాలు సమర్పించారు. వందకు పైగా ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలున్నాయి. దేశవ్యాప్తంగా 171 అష్టావధాన ప్రదర్శనలు చేశారు. భువనవిజయాది సాహితీరూపకాలతో కవుల పాత్రను పోషించారు. సామాజిక నాటకాలకు దర్శకత్వం వహించారు. శ్రీశైలజ్యోతి ( అనంతపురం ), గౌతమప్రభ ( గుత్తి ), జాగతి ( హైదరాబాదు ), పద్యవారధి ( రాజమండ్రి ) పత్రిక సంపాదకమండలిలో స్థానం పొందారు. గహగ్రంథాలయాల స్థాపనకు కషి చేశారు. పరిశోధక విద్యార్థులకు సహకారం అందించారు. ముద్రిత స్వీయరచనలను పలుగ్రంథాలయాలకు, సాహిత్య సంస్థలకు ఉచితముగా పంపిణీ చేశారు. శ్రీకష్ణదేవరాయలు , పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు , డా క్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్టాపనలకు కషి చేశారు. స్వీయ ఆధ్వర్య సాహిత్యసంస్థల ద్వారా 40 కి పైగా ప్రచురణలు, అజ్ఞాత కవులకు, యువసాహితీవేత్తలకు అండగా నిలిచి ప్రోత్సాహం అందిచారు. 2010 నుండి ఆశావాది సాహితీకుటుంబ పక్షాన సంప్రదాయకవులకు ఆధునిక రచయితలకు, సంఘసేవకులకు, ఆధ్యాత్మికప్రచారకులకు, ప్రతిసంవత్సరం ఆత్మీయపురస్కారాల ప్రదానం చేశారు. పలువురు గవర్నర్లు , కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జస్టిస్లు , ఐఎఎస్, ఐపిఎస్, వైస్ఛాన్సిలర్ల చేతుల మీదుగా సత్కారాలు పొందారు.</span></div></span><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">సబ్కలెక్టర్ నివాళి : </strong><span style="font-family: inherit;">గుండెపోటులో మతిచెందిన ఆశావాది ప్రకాష్రావు మతదేహానికి సబ్కలెక్టర్ నవీన్ నివాళి అర్పించారు. ఆశావాది భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.</span></div></strong><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">అనంతపురం : </strong><span style="font-family: inherit;">ప్రముఖ అవధాని, ఉపన్యాసకులు, బహు గ్రంథకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టరు ఆశావాది ప్రకాశరావు నిర్యాణం సాహిత్యలోకానికి తీరని లోటు అని కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డాక్టరు అప్పిరెడ్డి హరినాథరెడ్డి అన్నారు. ఆశావాది ప్రకాశరావు మతికి తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు టివి.రెడ్డి, అవధానం నాగరాజారావు, కార్యదర్శులు కాప ఓబిరెడ్డి, అల్తాఫ్ నివాళులర్పించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్ సంతాపం తెలిపారు.</span></div></strong><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">నేత్రదానం</strong></div></strong><span style="font-family: inherit;"><div style="text-align: justify;"><span style="font-family: inherit;"> ఆశావాది ప్రకాష్రావు చివరి కోరికను గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను సాయి ట్రస్టుకు దానం చేశారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి చెందిన ఆప్తమాలిక్ అసిస్టెంట్ రాఘవేంద్ర ఆయన నేత్రాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు.</span></div></span><strong style="font-family: inherit;"><div style="text-align: justify;"><strong style="font-family: inherit;">ఆశావాది లేని లోటు తీర్చలేనిది : డాక్టర్ ఎన్.శాంతమ్మ</strong></div></strong><span style="font-family: inherit;"><div style="text-align: justify;"><span style="font-family: inherit;"> ఒక మహోన్న త సాహితీ వటవృక్షం ఆకస్మికంగా కూలిపోయిందని ఆయన లేని లోటు సాహితీ లోకానికి తీర్చలేనిదని రచయిత్రి డాక్టర్ ఎన్.శాంతమ్మ అన్నారు. ఎందరో రెక్కలు రాని సాహితీ విహంగాలకు గూడునిచ్చి, నీడనిచ్చి, రెక్కలు తొడిగి ఎగిరేటట్లు చేసిన మహోన్నత ఆచార్యుడాయన అన్నారు. డాక్టర్ ఆశావాది ప్రకాశరావు తనకు సాహితీ సేవలు చేసేందుకు స్ఫూర్తినిచ్చారన్నారు. తెలుగు సాహిత్యంలో తెలియని ఎన్నో విషయాలను బోధించి సందేహాలను తీర్చిన గురువులాయన తన ప్రతి రచనా పుస్తకరూపానికి రావడానికి ప్రధాన కారకులు. నాకు దైవమిచ్చిన సోదరులు. పరమ సౌజన్య మూర్తి. మంచితనానికి, మానవత్వానికి ప్రతీక ఆశావాది. ఆయన ఆకస్మిక మరణం మా అందరికీ పెను విషాదాన్ని మిగిల్చింది. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్ధిస్తున్నాను.</span></div></span><div style="text-align: justify;"><br /></div><div style="text-align: justify;"><br /></div><div style="font-family: inherit;"><div class="cwj9ozl2 tvmbv18p" style="color: #1c1e21; font-family: "Segoe UI Historic", "Segoe UI", Helvetica, Arial, sans-serif; font-size: 12px; margin-bottom: 4px;"></div></div></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-69617135492608253182021-11-10T10:43:00.002-08:002021-11-10T10:43:29.824-08:00 పద్మశ్రీ అందుకున్న డాక్టర్ ఆశావాది ప్రకాశరావు<p style="text-align: justify;"><strong></strong></p><div class="separator" style="clear: both; text-align: center;"><strong><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjadOtB3_lC2WI80_X0X8un3XkvM8SdyRPP8iyyK8fEqUrlCCmGTeEEL0yv2R8yZSFR217fEqJ4AQvdTZVtaG6HTWiCdgeiXsruwYFwY2oeyafNBl0sGE4Y8jZ80dXkJBAWG0PXFLCGQg71/s1889/H20211109103813.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1605" data-original-width="1889" height="272" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjadOtB3_lC2WI80_X0X8un3XkvM8SdyRPP8iyyK8fEqUrlCCmGTeEEL0yv2R8yZSFR217fEqJ4AQvdTZVtaG6HTWiCdgeiXsruwYFwY2oeyafNBl0sGE4Y8jZ80dXkJBAWG0PXFLCGQg71/s320/H20211109103813.jpg" width="320" /></a></strong></div><strong>ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: </strong><span style="font-weight: bold;">అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ అవధాని డాక్టర్ అశావాది ప్రకాశరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా మంగళవారం (09-11-2021) ఈ అవార్డును ఆయన స్వీకరించారు. సాహిత్యం, విద్య విభాగంలో ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన ప్రకాష్ రావు 1944 ఆగస్టు 2న కుల్లాయమ్మ, పకీరప్ప దంపతులకు జన్మించారు. ఆయన ఎస్ఎస్ఎల్సీ నుంచి ఎంఏ తెలుగు వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేశారు.</span><p></p><strong><div style="text-align: justify;"><strong> రచనలు : </strong>రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 150కి పైగా అవధానాలు చేశారు. పుష్పాంజలి, లోకలిలా సూక్తం, మెరుపు తీగలు, దీవన సేసలు, రామకథ కలశం, పార్వతి శతకం, ఆత్మతత్వ ప్రబోధం, అవధాన చాటువులు, అవధాన కౌముది, వివేక పునీత నివేదిత వంటి పద్య రచనలు చేశారు. రాప్తాటి పరిచయ పారిజాతం, దోమావధాని, సాహితీ కుంజర మూర్తిమత్వం, ప్రసార కిరణాలు, సమారాధన, భాగవత సౌరభం, సువర్ణ గోపురం, ప్రహ్లాద చరిత్ర ఎర్రన్న, పోతనల తులనాత్మక పరిశీలన వంటి విమర్శ రచనలు చేశారు. నిరోష్ఠ్య శతకం, భర్తృహరి, వైరాగ్యసతి వంటి వ్యాఖ్య రచనలు చేశారు. చల్లపిల్లరాయ చరిత్రం వంటి పరిష్కరణలు ఆర్కెస్ట్రా, నడిచే పద్యం నండూరి వంటి సంకలనాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలు కలిపి మొత్తం 57 రచనలు వెలువరించారు.</div></strong><strong><div style="text-align: justify;"><strong> గుర్తింపు : </strong>ప్రకాష్రావు అవధాన రంగంలో చేసిన కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సన్మానించింది. స్వర్ణ గండపెండేర, రజిత హస్తకంకణ, కనకాభిషేక, రజత కిరీటం వంటి సత్కారాలను పొందారు. ఆయన అవధాన ప్రతిభను, సాహిత్య కృషిని మెచ్చి అవధాన కిశోర, అవధాన కోకిల, అవధాన ఆచార్య, శారదా తనయ, అపర జాషువా వంటి బిరుదులతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి కవికోకిల జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2020లో మహాకవి డాక్టర్ గడియారం వెంకటేశ శాస్త్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.</div></strong>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-86557046224214345352021-08-08T11:32:00.000-07:002021-08-08T11:32:14.696-07:00 బహుజనులు పాలకులుగా మారాలి<p style="text-align: justify;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOFGi4zcEDxkffOgkBBkMiYvV-KLgWM3cIBr-N6M072YXjUbvkaPDlU3fyn5XcAvHHlxQ4HwD4ZUPIbqqymhJzmLroMgzuzEGZGZGiZ-JV_RGITTJ_WO-HkKLZPkBrjLU17p2VAP4gpjHo/s1701/bsp_0+web.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="978" data-original-width="1701" height="184" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOFGi4zcEDxkffOgkBBkMiYvV-KLgWM3cIBr-N6M072YXjUbvkaPDlU3fyn5XcAvHHlxQ4HwD4ZUPIbqqymhJzmLroMgzuzEGZGZGiZ-JV_RGITTJ_WO-HkKLZPkBrjLU17p2VAP4gpjHo/s320/bsp_0+web.jpg" width="320" /></a></div><br /><p></p><h3 style="text-align: justify;">నల్గొండ 'రాజ్యాధికార సంకల్ప సభ' లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్<br />రాంజీ గౌతమ్ సమక్షంలో బిఎస్పిలో చేరిక<br /></h3><div style="text-align: justify;"> నల్గొండ: బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకొనే దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బిఎస్పి జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్కుమార్ బిఎస్పిలో చేరారు. అనంతరం ప్రవీణ్కుమార్ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా రాంజీ గౌతమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని వారి కోసమే తాను ఉద్యోగాన్ని వదులుకున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని.. కేవలం పాలకులే ఉంటారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. సిఎంకు దళితులపై ప్రేమ ఉంటే ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. 'పేదలకు వైద్యం, విద్య, ఉపాధి, నైపుణ్యం కావాలి, గురుకుల పాఠశాలల ద్వారా కేవలం నాలుగు లక్షల మందికే విద్య అందుతోంది. 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారు. పేదలు చదివే యూనివర్సిటీల్లో 3 నుంచి 4 ఏళ్లుగా నియామకాలు లేవు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుల కోసం తాపత్రయపడుతున్నారు. మరి ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ ఎందుకు పెట్టలేదు? ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా?' అని ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. <div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZRcUuFn2P-paiJ2LiUqbjIp2m_AKy009vP4whsbKa7L3MISSsbvDMZJXlKqCgxAO4eMQkOv4cTw8eFuwog_IqA35jUi9oYxKhpv9-Z2Z9YwZtmZS2MnucNIXshquLw6WwsFkGdGOnDKDf/s1701/web+rsp.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="978" data-original-width="1701" height="184" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZRcUuFn2P-paiJ2LiUqbjIp2m_AKy009vP4whsbKa7L3MISSsbvDMZJXlKqCgxAO4eMQkOv4cTw8eFuwog_IqA35jUi9oYxKhpv9-Z2Z9YwZtmZS2MnucNIXshquLw6WwsFkGdGOnDKDf/s320/web+rsp.jpg" width="320" /></a></div><br /></div><strong><div style="text-align: justify;"><strong>బహుజనులకు సూటిప్రశ్న</strong></div></strong><div style="text-align: justify;"> కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. 'రాజ్యాధికార సంకల్ప సభ'లో ఆయన బహుజన సమాజంలో మనం బానిసలం కాదు పాలకులమని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ జన సునామీని ఎవరూ ఆపలేరని చెప్పారు. సీఎం కెసిఆర్ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారెందుకు? అని ప్రశ్నించారు. ఆ డబ్బులు.. గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసి.. ఆదివాసీ బిడ్డలు అడవుల్లో నుంచి తేనె సేకరించి సంపాదించిన డబ్బులేనని తెలిపారు. ''మీకు మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులు అమ్మి డబ్బులు ఖర్చు చేయండి. మా కష్టార్జితాన్ని మేమే నిర్ణయించుకునేలా చేయండి. తమ కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మరి ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు? అని ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో మరో పార్టీ క్రియాశీలకంగా మారనుందనే చెప్పాలి. ఇప్పటికే వైఎస్ షర్మిల తన పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.</div><div style="text-align: justify;">బిఎస్పి జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్కుమార్ బిఎస్పిలో చేరిక</div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-69043010113133610942021-07-19T12:17:00.002-07:002021-07-19T12:24:32.699-07:00ఆ ఐపిఎస్ దారెటు?<p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiU2diXs7ebMQvN8YqHK5S1Qx4u0eyL5KP2WlTRRpp9olwkl2Q9Xj4frVjoDKvZyM0PTbcNMTmGQxYEWFITrSFTUwZDXxqFOKbo9u3zziL05hLy_yRUYnLOQItAQ4Y-ZpjYQSjKbP8Atlt7/s640/pravven-19.jpg" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="384" data-original-width="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiU2diXs7ebMQvN8YqHK5S1Qx4u0eyL5KP2WlTRRpp9olwkl2Q9Xj4frVjoDKvZyM0PTbcNMTmGQxYEWFITrSFTUwZDXxqFOKbo9u3zziL05hLy_yRUYnLOQItAQ4Y-ZpjYQSjKbP8Atlt7/s320/pravven-19.jpg" width="320" /></a></div><br /><b>ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ</b><br /><div style="text-align: justify;"> సీనియర్ ఐపిఎస్ అధికారి, TELANGANA STATE అడిషనల్ డిజిపి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తును సోమవారం (19-07-2021) ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి సోమేష్కుమార్కు, కేంద్ర ప్రభుత్వానికి ఇ-మెయిల్ ద్వారా పంపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా 2013 నుంచి సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన తీసుకున్న నిర్ణయం అధికార వర్గాల్లోనూ, రాజకీయ వర్గాలోనూ చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయాలవలన మంచి ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ గురుకులాలను అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. ఆయన మాటలో ముక్కుసూటితనం, స్పస్టత, ఉద్యోగంపట్ల అంకిత భావం ఉంటుంది. నాలక్ష్యం ఇది అని దానిని సాధించేందుకు ప్రయత్నించే వారు చాలా అరుదు. అలాంటి కోవకు చెందిన వారిలో ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఒకరు. ఆయనతో మాట్లాడితే సామాజిక అసమానతలకు శత్రువులెవరు, మిత్రులెవరనేది అట్టే తేలిపోతుంది. సామాజిక అణచివేతకు గురయిన సామాన్యులను అభివృద్ధివైపు నడిపించాలనే ఆయన తపన అర్థమౌతుంది. ఆయన మాటల్లో చేతల్లో ఒకటే ఉండటం వలన ఆయనకు కొందరు శత్రువులు కూడా ఏర్పడ్డారు. ఆయన డైనమిజం, ధైర్యం ముందు నిలబడలేకపోయారు. గురుకుల విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించారు. ఆంగ్లభాష ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకు పాలకుల పూర్తిస్థాయి ప్రోత్సాహం కూడా తీసుకున్నారు. స్వేరోస్ నెట్వర్క్ ఏర్పాటు చేసి సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని లక్షల మంది పూర్వ విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయన అంబేద్కర్, జ్యోతిరావుఫూలే ఆశయాల సాధనకు కృషి, పట్టుదలతో ఉన్నారు. ఆ నేపథ్యంతో ఆయన బిఎస్పిలో చేరుతారా? లేక అదేతరహాలో కొత్తపార్టీ పెడుతారా అని చర్చ నడుస్తోంది. మరోపక్క ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఈమధ్య తగ్గిపోయిందని కూడా మరోచర్చ నడుస్తోంది. గురుకుల విద్యాలయాలకు కావల్సిన నిధులు కేటాయించక పోవడం, బకాయిలు పేరుకుపోయాయని అనుకుంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళీ విఆర్ఎస్ తీసుకోగా, ఇప్పుడు మరో దళిత ఐపిఎస్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.</div> అట్టడుగు వర్గాలకు ఇంతకన్న మంచి సేవ చేయడానికే తాను ఉద్యోగ విరమణ చేశానని ఎంతటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకులాలు సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని కూడా ఒక హెచ్చరిక చేసినట్లు ఆయన రాజీనామాలో పేర్కొన్నట్లు అర్థమౌతుంది. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని అత్యంత అనుచరుల దారా తెలుస్తోంది. ఆయన ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతారనేది త్వరలో తేటతెల్లం కావచ్చు. రాజకీయాల్లోకి వస్తారా అంటే రాకూడదని లేదుగదా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ అనడం వాస్తవం లేదని స్పస్టత ఇచ్చారు.<br /><p></p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-67029192176598428512021-07-10T02:42:00.001-07:002021-07-10T02:42:02.078-07:00పంపిణీకి నిజంగానే భూమి లేదా?<p style="text-align: justify;"> <b style="box-sizing: border-box; color: blue; font-family: Jyothi_ie, Jyothi;">1973 భూ గరిష్ఠ పరిమితి చట్టంలోని అంశాలను తాజా పరిస్థితులలో పునఃసమీక్షించాలి. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే జరిపి, మాగాణి, మెట్ట భూములను వర్గీకరించాలి. ఆ చట్టం ప్రకారం భూ గరిష్ఠ పరిమితులకు అనుగుణంగా మిగులు భూములను నిర్ధారించి వాటిని భూ వసతి లేని పేదలకు పంచాలి. ముఖ్యంగా వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించిన గ్రామీణ కుటుంబాలకు భూ పంపిణీలో ప్రాధాన్యమివ్వాలి.</b></p><div class="vdo_collapsible" id="v-andhrajyothy-1" style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin-left: 0px; width: 660.656px;"><vdo id="parentDiv1" style="box-sizing: border-box; display: block; overflow: auto hidden; scroll-behavior: smooth;"><vdo class="vdo_collapsible" id="unitDivWrapper-1" style="animation-direction: normal; box-sizing: border-box; display: block; height: 0px; transition: height 0.6s linear 0s;"><div class="vdo_content" id="_vdo_ads_player_ai_3836" style="box-sizing: border-box; margin: 0px auto 0px 0px; position: relative; width: 0px; z-index: 111;"><img class="cross" id="vdo_ai_cross" src="https://a.vdo.ai/core/assets/img/cross.svg" style="border-radius: 50% !important; border: none !important; box-shadow: none !important; box-sizing: border-box; cursor: pointer !important; display: inherit; filter: none !important; height: 17px !important; margin: 0px !important; object-fit: cover; padding: 0px !important; position: absolute !important; right: -1px !important; text-align: justify; top: -1px !important; width: 17px !important; z-index: 2147483647 !important;" /></div></vdo></vdo></div><div id="v-andhrajyothy-0" style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin-left: 0px; width: 660.656px;"><vdo id="parentDiv0" style="box-sizing: border-box; display: block; overflow: auto hidden; scroll-behavior: smooth;"><vdo id="unitDivWrapper-0" style="animation-direction: normal; box-sizing: border-box; display: block; height: 0px; transition: height 0.6s linear 0s;"></vdo></vdo></div><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">తెలంగాణలో ఇవాళ్టికీ ‘భూమి సమస్య’ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో లక్షలాది కుటుంబాలు ఈనాటికీ ఒక్క సెంటు భూమి కూడా లేకుండా ఉన్నాయి. వ్యవసాయేతర వృత్తులలో వున్న వారి చేతుల్లోకి పెద్ద ఎత్తున భూమి వెళ్ళిపోతున్నది. ఒక వైపు కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది. మరోవైపు వందల ఎకరాలను కొనుగోలు చేస్తున్న నయా జమీందారులూ పెరుగుతున్నారు. చాలా మంది అడిగే ప్రశ్న: భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయాలంటే భూమి ఎక్కడ ఉంది? నిజంగా భూమి ఎక్కడ ఉందంటే... పెద్ద విస్తీర్ణంలో నయా జమీందారుల చేతుల్లో ఉంది; 1973 భూ సంస్కరణల చట్టం అమలు చేయకపోవడం వల్ల భూ గరిష్ఠ పరిమితులకు మించి, భూమి పెద్ద రైతుల చేతుల్లో ఉంది; భూములను ఆస్తిగా కొనుగోలు చేస్తున్న వ్యవసాయేతర వృత్తుల వారి చేతుల్లో ఉంది; సాగు యోగ్యమైన భూమి ‘పడావు’ భూముల రూపంలో ఉంది; రాష్ట్ర ప్రజల గృహ నిర్మాణ అవసరాలకు మించి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేత, వ్యవసాయేతర భూమిగా మార్చబడి ఆస్తి విలువ కలిగిన ప్లాట్లుగా విభజించబడి ఉంది. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">ఈ అవగాహనతో, పరిశీలించకపోవడం వల్ల పంచేందుకు భూమి లేదనే భావం అందరిలో స్థిరపడింది. ఈ కారణం చేతే అణచివేతకు గురవుతున్న వర్గాల ప్రజల కోసం ఆవిర్భవించిన దళిత, వెనుకబడిన వర్గాల సంఘాలు కూడా భూమి సమస్యపై పెద్దగా మాట్లాడడం లేదు. దళిత బహుజన ఫ్రంట్ (డి.బి.ఎఫ్) లాంటి ఒకటి, రెండు సంఘాలు తప్ప, గ్రామీణ పేద కుటుంబాలకు భూమి దక్కాలనే డిమాండ్ను బలంగా ముందుకు తేవడం లేదు. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">అమెరికా, యూరప్తో భారతదేశాన్ని పోలుస్తూ మన దేశం కూడా అనివార్యంగా నగరాలు, పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి దిశగా పయనిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రజలు, గ్రామాల్లో ఉండకుండా ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు అవుతారుగనుక భూ సంస్కరణలను అమలు చేయాలనే డిమాండ్కు ఇక కాలం చెల్లినట్టేనని వారు వాదిస్తున్నారు. నిజంగానే గత 60 సంవత్సరాలలో తెలంగాణ జనాభా పొందికలో వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. అయినా ఇప్పటికీ పారిశ్రామిక, సేవారంగాలు కల్పించిన ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పుడు, పారిశ్రామిక, సేవారంగాలన్నీ మూతపడితే, తిరిగి పేదలను కడుపులో పెట్టుకున్నది గ్రామీణ ప్రాంతమే. అన్నం పెట్టింది గ్రామీణ ఉపాధి హామీ పథకమే. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">1973 భూ సంస్కరణల చట్టం వచ్చిననాటి కంటే, ఇప్పుడు రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు బాగా పెరిగాయి. రైతులు స్వయంగా తవ్వుకున్న బోరుబావుల ద్వారానే కాకుండా, ప్రభుత్వం నిర్మించిన చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతుల పొలాలకు నీరు వస్తున్నది. ఒకప్పటి మెట్ట భూములు, మాగాణి భూములుగా మారుతున్నాయి. అయినా ఇంతకాలం అగచాట్లు పడిన గ్రామీణ ప్రజలు తమ భూములను కోల్పోతున్నారు. వ్యవసాయంతో ఏ మాత్రమూ సంబంధం లేని వారు వచ్చి ఆ భూములను పెద్ద ఎత్తున కొంటున్నారు.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">ఈ ‘నయా’ భూ యజమానుల భూములను నీళ్ళు తడపబోతున్నాయి. ఆయా గ్రామాలలో కూలీలు, కూలీలు గానే మిగిలిపోయారు. లేదా వలసపోయారు. వీళ్ళలో కొంతమంది కౌలు రైతులుగా మారినా, పెరిగిన నీటి పారుదల సౌకర్యాల వలన, కౌలు ధరలు బాగా పెరిగాయి. కౌలు ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. వీరికి రైతులుగా గుర్తింపు లేక, ఏ సహాయమూ అందడం లేదు. ఈ పరిస్థితులలో 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని అమలు చేయకపోతే, పెరిగిన నీటిపారుదల సౌకర్యాల వల్ల భూమి లేని గ్రామీణ పేదలకు చేకూరే ప్రయోజనమేమీ ఉండదు. మిగులు భూములు తేల్చి, పంపిణీ చేయకుండా, కేవలం భూ కొనుగోలు పథకాల ద్వారా భూమి అందించాలని చూడడం, ఆచరణలో అసాధ్యం. భూముల రేట్లు పెరుగుతున్న దశలో, చాలా జిల్లాలలో ఈ పథకం కింద భూములు కొనడమే మానేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">1973 భూ గరిష్ఠ పరిమితి చట్టంలోని అంశాలను కూడా తాజా పరిస్థితులలో పునఃసమీక్షించాలి. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే జరిపి, మాగాణి, మెట్ట భూములను వర్గీకరించాలి. 1973 చట్టం ప్రకారం భూ గరిష్ఠ పరిమితులకు అనుగుణంగా మిగులు భూములను తేల్చాలి. ఆ మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలి. ముఖ్యంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందామనుకుంటున్న గ్రామీణ కుటుంబాలకు భూ పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలి. పేద కుటుంబాలకు భూ పంపిణీ సమయంలో స్టాండర్డ్ హోల్డింగ్ ఎంత ఉండాలనేది తిరిగి నూతన మార్గదర్శకాలు జారీ చేయాలి. భూ పంపిణీకి ఇప్పటి వరకూ 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట ప్రాతిపదికగా ఉంది. ఒక కుటుంబం గౌరవంగా జీవించడానికి ఇది ఒక ఆర్థిక కమతంగా సరిపోతుందా అన్నది సమీక్షించాలి. 1973 చట్టంలో ఒక స్టాండర్డ్ హోల్డింగ్గా ఒక కుటుంబానికి మాగాణి భూమి 18 ఎకరాలు, మెట్ట భూమి 54 ఎకరాలు గరిష్ఠంగా నిర్ణయించారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వాలు భూమి పంపిణీకి పెట్టుకున్న ప్రాతిపదికతో పోల్చినపుడు ఇవి మాగాణి విషయంలో 7.5 రెట్లు, మెట్ట భూమి విషయంలో సుమారు 11 రెట్లు ఎక్కువ. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">1973 చట్టాన్ని పట్టించుకోకుండా, అమలు చేయడానికి ప్రయత్నించకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 1 ద్వారా ‘భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి కొనుగోలు పథకం’ ప్రవేశపెట్టింది. ఈ జీవో ప్రకారం నీటిపారుదల సౌకర్యం ఉండి, సాగుయోగ్యమైన భూమి కొని ఇవ్వాలని నిర్దేశించింది. ఎకరానికి గరిష్ఠంగా 7 లక్షల రూపాయల ధర కూడా నిర్ణయించింది. 1973 చట్టం నిర్దేశించిన భూ గరిష్ఠ పరిమితి ప్రమాణాలకు, తాజాగా భూ పంపిణీకి పెట్టుకున్న ప్రమాణాలకు మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలి. ఒక ఆర్థిక కమతాన్ని తాజాగా ప్రామాణీకరించాలి. గతంలో 1973 చట్టం వర్తించకుండా ఇచ్చిన మినహాయింపులను కూడా ఇప్పుడు పునఃసమీక్షించాలి. భూమి ఒక సహజవనరు కాబట్టి, దాని కేంద్రీకరణను నియంత్రించాలి. అత్యధికుల జీవనోపాధి వనరు భూమే కాబట్టి, ‘సమగ్ర భూ వినియోగ విధానం’ రూపొందించాలి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రాజెక్టుకు అవసరమైన భూమి సేకరణను తప్ప, ఈ చట్టంలో ఇచ్చిన మిగిలిన అన్ని మినహాయింపులను రద్దు చేయాలి. ‘భూ బ్యాంకు’గా ప్రభుత్వాల ఆధీనంలో ఉండే భూ విస్తీర్ణాలను కూడా, భూ వినియోగ విధాన ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించుకుని మిగులు భూమిని విడుదల చేయాలి. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">గత 47 సంవత్సరాలలో పారిశ్రామిక, సేవా రంగాలలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని వివిధ పారిశ్రామిక ప్రాంతాలకు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు, ప్రజలకు సేవలు అందిస్తాయనే పేరున వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై కూడా పునఃసమీక్ష జరపాలి. ఇప్పటికీ, వినియోగంలో లేని భూములను, భూ వినియోగ విధాన పరిమితులకు మించి ఉన్న భూములను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోవాలి. పడావు భూములను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెడితే మరిన్ని సాగు యోగ్యమైన భూములు అందుబాటులోకి వస్తాయి. ఎగుమతి ప్రధాన లక్ష్యంతో వాణిజ్య పంటల పొందికను రూపొందించకుండా, రాష్ట్ర ప్రజల అవసరాలు ప్రాతిపదికగా పంటల ప్రణాళిక రూపొందించగలిగితే, సాగు భూముల వినియోగం న్యాయబద్ధంగా ఉంటుంది. అప్పుడే ఇతర జీవనోపాధుల ఏర్పాటుకు భూమి అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయేతర అవసరాలకు భూమి మళ్ళించాలనుకుంటే కూడా భూ వినియోగ విధానం అవసరమే. పట్టణ, నగర ప్రాంతాల భూ గరిష్ఠపరిమితిని కూడా ఫునఃసమీక్షించాలి. పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తున్నప్పుడు ఒక్కో కుటుంబానికి 40 చదరపు గజాలు ప్రాతిపదికగా ఉంటున్నది. ఈ విషయంలో భూ గరిష్ఠ పరిమితికీ, పంపిణీకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఇక్కడ కూడా పరిష్కరించాలి.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;">పేదల గృహనిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వం చేతుల్లో భూమి ఉండడంలో తప్పులేదు. అయితే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అవసరాలకు మించి ఖాళీ స్థలాలను పెద్ద ఎత్తున కలిగి ఉండడంపై పరిమితి విధించాలి. రియల్ ఎస్టేట్ పేరుతో లక్షలాది ఎకరాల సాగు భూములను సేకరించడాన్ని నిషేధించాలి. పెరుగుతున్న జనాభా, గృహ అవసరాలు, పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుంటూనే సాగు భూములు దుర్వినియోగం కాకుండా నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న భూ ఖండాలను వ్యవసాయ వినియోగంలోకి తేవాలి. రియల్ ఎస్టేట్ పేరిట పడావు పెట్టే భూములపై కూడా పన్ను విధించాలి. నేరుగా వ్యవసాయం చేయకుండా ఇతర వృత్తులలో ఉన్న వ్యక్తుల వృత్తిపరమైన ఆదాయంతో పాటు, పరిమితికి మించిన వ్యవసాయ ఆదాయాన్ని, కౌలు ఆదాయాన్ని కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి. ‘భూమిని సరుకుగా సంపదగా చూస్తే పెట్టుబడి దారులకు లాభం, భూమిని జీవనోపాధి వనరుగా చూస్తే గ్రామీణ పేదలకు ప్రయోజనం’ అన్న సత్యం అవిస్మరణీయమైనది.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important; text-align: justify;"><b style="box-sizing: border-box;">-కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక)</b></p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-63748590691114870042021-06-25T11:22:00.003-07:002021-06-25T11:22:49.440-07:00<p> </p><div class="taxonomy" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px;"><a href="https://prajasakti.com/caiikatai-raaajayam-daisagaaa-maoodaii-paaalana" id="label" rel="bookmark" style="background-color: transparent; box-sizing: border-box; color: #078d92; text-decoration-line: none;"><h1 style="box-sizing: border-box; color: #0059b5; font-family: inherit; font-size: 1.8em; font-weight: 500; line-height: 1.1; margin: 10px 0px;">చీకటి రాజ్యం దిశగా మోడీ పాలన</h1></a></div><div class="node__meta" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px;"><article about="/user/5" class="profile" style="box-sizing: border-box;" typeof="schema:Person"></article><br /></div><div class="social-icons" style="background-color: white; box-sizing: border-box; color: #333333; display: inline-block; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px;"><span class="a2a_kit a2a_kit_size_32 addtoany_list" data-a2a-title="చీకటి రాజ్యం దిశగా మోడీ పాలన" data-a2a-url="http://prajasakti.com/caiikatai-raaajayam-daisagaaa-maoodaii-paaalana" style="box-sizing: border-box; display: inline; line-height: 32px; outline: 0px; touch-action: manipulation;"><div class="a2a_kit a2a_kit_size_32 a2a_default_style social-icon-mobile-wrap" style="box-sizing: border-box; outline: 0px; right: 0px; top: 150px; touch-action: manipulation;"></div></span></div><span style="background-color: white; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px;"></span><div class="cover-image" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px;"><figure style="box-sizing: border-box; margin: 0px;"><img src="https://prajasakti.com/sites/default/files/2021-06/modi%20palana_0.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle; width: 525.994px;" /></figure></div><div class="body" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 18px; margin-top: 15px;"><div property="schema:text" style="box-sizing: border-box;"><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">మోడీ పాలన నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెస్తోంది. నాడది 21 నెలలు కాగా నేడు ఏడేళ్ల నుండి నిరంకుశ పాలన కొనసాగుతోంది. 2015 లోనే మోడీ చర్యలను గమనించిన అద్వానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరల ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తదని చెప్పలేమని పరోక్షంగా హెచ్చరించారు.ఎమర్జెన్సీకి మందు ఇందిరా గాంధీ కనీసం కంటితుడుపుగానైనా ఫ్యూడల్ వ్యతిరేక చర్యలను చేపట్టారు. కాని నేడు మోడీ అదే ఫ్యూడల్ పాలనను పునరుద్ధరించడానికి, వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయడానికి పూనుకున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే హతమారుస్తున్నారు. దానిపై తిరుగుబాటే నేటి రైతాంగ ఉద్యమం.</span><br style="box-sizing: border-box;" /> <span style="box-sizing: border-box; font-weight: 700;">జూ</span>న్ 26వ తేదీ అనేక విధాలా విశిష్టత కలిగి ఉంది. సరిగ్గా 46 సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన చీకటి దినం. అలాగే ఏడు నెలల క్రితం ఇదే రోజు నవంబరు 26వ తేది రైతాంగ ఉద్యమం ఢిల్లీ ముట్టడి ఆరంభమైన రోజు కూడా. ఆ రీత్యా ఈసారి జూన్ 26 నిరసన దినంగా పాటించాలని 500 సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఐక్య కార్మిక సంఘాల వేదిక (సిటియు) కూడా సంఘీభావం ప్రకటించింది. యువజన, విద్యార్థి, మహిళా, సామాజిక సంఘాలు కూడా దీనితో గొంతు కలిపాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఎమర్జెన్సీ నాటి పరిణామాలను కూడా గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> ఆర్థిక సంక్షోభం నుండి ఎమర్జెన్సీ వరకు</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>1971 పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరాగాంధీ సుడిగాలి వేగంతో విజయం సాధించింది. పేద ప్రజలు కోటి ఆశలతో ఆమెకు నీరాజనాలు పలికారు. రెండు సంవత్సరాలు గడవక ముందే ధరలు ఆకాశానికంటాయి. నిరుద్యోగం పెరిగింది. గుజరాత్, బీహార్ లలో విద్యార్థులు రోడ్డున పడ్డారు. జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో సంపూర్ణ విప్లవం పేరిట యువతరం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మధ్యతరగతి ప్రభుత్వోద్యోగులు డి.ఏ పెంపుదల కోసం సమ్మె సైరన్ మోగించారు. రైల్వే కార్మికులు చరిత్రలో మొదటిసారి రైళ్లను పూర్తిగా స్తంభింపచేశారు. కార్మికులపై పైశాచిక నిర్బంధకాండ సాగింది. ఇదే సమయంలో జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వం చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. రాజీనామా చేసి పదవి నుండి తప్పుకోడానికి బదులుగా దేశాన్ని నిరంకుశంగా హస్తగతం చేసుకున్నారు. జూన్ 25 అర్ధరాత్రి అంటే 26వ తేది తెల్లవారేసరికల్లా ప్రతిపక్ష నాయకులంతా జైళ్లకు పంపబడ్డారు. పౌరహక్కులు రద్దు చేయబడ్డాయి. పత్రికలపై సెన్సారుషిప్ విధించారు. దానికి నిరసనగా కొన్ని పత్రికలు సంపాదకీయం రాయకుండా ఆ స్థలాన్ని ఖాళీగా వదిలేశాయి. సభలు, సమావేశాలు నిషేధించారు. ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రధాని పదవిని ఐదు నుండి ఆరేళ్లకు పొడిగించారు. ప్రశ్నించిన వారిని విదేశీ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా ముద్ర వేసి మీసా, నాసా వంటి నిర్బంధ చట్టాల కింద జైళ్లలో తోశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రచయితలు, చిత్రకారులపై కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వాన్ని విమర్శించే సినిమాలను కూడా నిషేధించారు.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> సిపియం, ప్రజా ఉద్యమాలపై నిర్బంధం</span><br style="box-sizing: border-box;" /> సిపిఐ(యం) నాయకత్వాన్ని పై నుండి కింది వరకు అరెస్టు చేశారు. అప్పటికే బెంగాల్లో సిపియం మీద అర్ధ ఫాసిస్టు బీభత్సకాండ సాగుతోంది. నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి సుందరయ్య సహా అనేక మంది నాయకులు అజ్ఞాతవాసం లోకి వెళ్లిపోయారు. సిపియం నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. అనేక మందిని చిత్రహింసల పాల్జేశారు. నేడు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్ నాడు యువ ఎమ్మెల్యే. అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ పద్ధతులలో ఒళ్లంతా కుళ్లబొడిచారు. రక్తపు మరకలతోనే ఆయన అసెంబ్లీకొచ్చి ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడారు. రాజన్ అనే యువకుడ్ని ఎన్కౌంటర్లో కాల్చి పారేయడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. మన ఉమ్మడి రాష్ట్రం లోనూ 300 మంది అమాయకుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపారేశారు. నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చర్యలపై తర్వాత భార్గవ కమిషన్ విచారణ కూడా జరిగింది. విద్యార్థి నాయకులను కూడా నిర్బంధించారు. వామపక్ష విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ...వారికి లక్ష్యంగా మారింది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత నియమించిన 'షా కమిషన్' నివేదికతో అనేక వాస్తవాలు వెలుగు లోకి వచ్చాయి.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> ఎమర్జెన్సీలో ఆర్.యస్.యస్ పాత్ర</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>నక్సలైట్ పార్టీలతోపాటు ఆర్.యస్.యస్, జమాయితే వంటి సంస్థలను కూడా నిషేధించారు. ఎబివిపి నాయకులను కూడా అరెస్టు చేశారు. ఖంగుతిన్న ఆర్.యస్.యస్ నాయకత్వం 1976 నవంబరులో ఇందిరాగాంధీకి 'డాక్యుమెంటు ఆఫ్ సరెండర్' పత్రాన్ని సమర్పించుకొని తమ నాయకులందరినీ విడుదల చేయాలన్న షరతుపై క్షమాపణ కోరింది. ఆర్.యస్.యస్ నాయకుడు రణడే రహస్యంగా ఇందిరాగాంధీతో మంతనాలు జరిపారు. ఇందిరాగాంధీ తనయుడు సంజరు గాంధీతో రాజీ పడ్డారు. చర్చలకు సహకరించిన రణడేకు ప్రభుత్వం పదవినిచ్చి సత్కరించింది. నాటి ఎబివిపి నాయకులు అరుణ్ జైట్లీ లాంటి వారు చివర వరకు జైల్లోనే ఉన్న బల్బీర్ పుంజ్, ప్రభు చావ్లా వంటి వారు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని సమర్ధిస్తూ ప్రకటన చేశారు. ఈ వాస్తవాలను తర్వాత ఆర్.యస్.యస్ కు చెందిన సుబ్రమణ్యస్వామి బహిరంగంగా వెల్లడించారు. అత్యధిక మంది బిజెపి, ఆర్.యస్.యస్. నాయకులు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి ద్రోహం చేసినట్లు 2000 సంవత్సరం 'హిందూ' పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> ప్రజల ఆగ్రహానికి గురైన ఇందిర</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>ప్రజల మద్దతు వుందన్న ఇంటెలిజెన్సు రిపోర్టుతో 21 నెలల తర్వాత 1977 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మినహా దేశమంతా ఆమెను, ఆమె పార్టీని ఘోరంగా ఓడించారు. జయప్రకాశ్ సారథ్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదో చారిత్రాత్మక ప్రజా తీర్పు. దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయి.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> నేడు ఆచరణలో అప్రకటిత ఎమర్జెన్సీ</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>మోడీ పాలన నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెస్తోంది. నాడది 21 నెలలు కాగా నేడు ఏడేళ్ల నుండి నిరంకుశ పాలన కొనసాగుతోంది. 2015 లోనే మోడీ చర్యలను గమనించిన అద్వానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరల ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తదని చెప్పలేమని పరోక్షంగా హెచ్చరించారు. గుజరాత్లో మోడీ మారణకాండ, ప్రధాని కావడానికి పార్టీనే అణచివేసిన విధానం అద్వానీకి గుర్తొచ్చి ఉండొచ్చు. నాడు గుజరాత్లో మోడీ పాపాన్ని బలపరచిన అద్వానీ నేడు అనుభవిస్తున్నారు. ఎమర్జెన్సీకి మందు ఇందిరా గాంధీ కనీసం కంటితుడుపుగానైనా ఫ్యూడల్ వ్యతిరేక చర్యలను చేపట్టారు. కాని నేడు మోడీ అదే ఫ్యూడల్ పాలనను పునరుద్ధరించడానికి, వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయడానికి పూనుకున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే హతమారుస్తున్నారు. దానిపై తిరుగుబాటే నేటి రైతాంగ ఉద్యమం. చరిత్రలో ఇది మరొక సువర్ణాధ్యాయం.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> రైతాంగ పోరాటంపై తప్పుడు ప్రచారం</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>ఏడు మాసాలుగా లక్షలాది మంది రైతులు దేశం నలుమూలల నుండి ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నప్పటికీ...కేవలం అదానీ, అంబానీల లాభాపేక్ష కోసం నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. రైతు ఉద్యమకారులపై రేప్ కేసులు బనాయించి, అభాండాలు మోపి ఉద్యమాన్ని బలహీనపరచాలని కొత్త ఎత్తుగడ పన్నారు. బిజెపి టెక్నో సేన ఉద్యమకారులపై ట్రోలింగు చేస్తోంది. హర్యానాలో లాఠీచార్జి చేశారు. అయినా ఇంకా వేలాదిగా ప్రతిరోజూ ఢిల్లీకి రైతులు తరలి వస్తూనే ఉన్నారు. మోడీ సర్కారు చర్చలకు సిద్ధమంటూనే చట్టాన్ని వెనక్కి తీసుకునేది లేదని మొండికేస్తున్నది. పట్టువదలని విక్రమార్కునిలా రైతులు పోరాడుతూనే ఉన్నారు. ఒకచేత నాగలి, మరో చేత తిరుగుబాటు జెండా పట్టుకొని అటు వ్యవసాయం చేస్తూ దేశానికి తిండి గింజలు పండిస్తూ మరోవైపు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం, గిట్టుబాటు ధరల చట్టం కోసం పోరాడుతున్నారు.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> కొనసాగుతున్న ఆర్థిక నియంతృత్వం</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>ఇప్పటికే దేశంలో ఆర్థిక నియంతృత్వం అమలవుతోంది. పెద్ద నోట్ల రద్దు మొదలు కొని జిఎస్టి వరకు ఈ కోవలోవే. తాజాగా ధరల పెంపుదల తోడైంది. నిరుద్యోగం కనీవినీ ఎరుగని విధంగా పెరుగుతోంది. కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. బాధితులకు పైసా విదల్చడం లేదు. విద్య, వైద్య రంగాలలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాషాయీకరణ విధానాలు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. కార్మిక హక్కుల చట్టాలను రద్దు చేసి, వారిని అణచివేయడానికి లేబర్ కోడ్లను తెచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా సిఎఎ, ఎన్.ఆర్.సి చట్టాలను తెచ్చింది. రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తూ ఒకే దేశం ఒకే చట్టం అంటూ అధికారాన్ని కేంద్రీకరిస్తున్నారు.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> ప్రజా ఉద్యమాలతోనే నిరంకుశత్వానికి చెక్</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"> </span>ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో నిస్పృహకు గురైన మోడీ, షాల ద్వయం మరిన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు, నిరంకుశ విధానాలకు తెర లేపుతున్నారు. అత్యవసర పరిస్థితి విధించకుండానే పౌరహక్కులు కాలరాయబడుతున్నాయి. రాజ్యాంగ విధ్వంసం, రాజ్యాంగ సంస్థలను నియంత్రించడం, ప్రశ్నించినవారిని ఉపా వంటి అక్రమ కేసుల్లో నిర్బంధించడం సర్వసాధారణమైంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉగ్రవాదానికి, ప్రజా ఉద్యమాలకు మధ్య విభజన గీత గీసింది. మోడీ దాడిని అడ్డుకొని రానున్న ప్రమాదాన్ని నివారించగలిగేది ప్రజా చైతన్యం, ఐక్యత, ప్రజాతంత్ర ఉద్యమాలు మాత్రమే.<br style="box-sizing: border-box;" /> </p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">/ వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు /<br style="box-sizing: border-box;" />వి. శ్రీనివాసరావు</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;"><img alt="వి. శ్రీనివాసరావు" data-entity-type="file" data-entity-uuid="193ff0c1-74ce-45d2-941e-5861487599df" height="141" src="https://prajasakti.com/sites/default/files/inline-images/srinivas.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="112" /></span></p></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-85901700754207325012021-05-16T10:12:00.004-07:002021-05-16T10:16:46.178-07:00 అభ్యుదయ కవి అదృష్టదీపక్ కన్నుమూత<p><img src="https://prajasakti.com/sites/default/files/2021-05/adrustadeepak%20kavi_0.jpg" style="background-color: white; border: 0px; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px; height: auto; max-width: 100%; vertical-align: middle; width: 428.2px;" /></p><div class="body" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 18px; margin-top: 15px;"><div property="schema:text" style="box-sizing: border-box;"><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">కాకినాడ (తూర్పు గోదావరి) :</span> అభ్యుదయ కవి, సినీ గీత రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అదృష్టదీపక్ (71) కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిజాన్ని నిర్భయంగా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి ఆయన. సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లోనూ అదృష్టదీపక్ ప్రవేశించారు. కేవలం సాహిత్యంలో ప్రవేశించడమే కాదు-వచన కవిత రాసినా, ఉద్యమ గీతం రాసినా, సినిమా పాట రాసినా, విమర్శ రాసినా, వ్యాసం రాసినా తనదైన ముద్ర బలంగా కొట్టాడుకవిగా, కధకుడిగా, విమర్శకుడిగా, వక్తగా, అధ్యాపకుడిగా, నాటక న్యాయనిర్ణేతగా ఆయన పేరుగాంచారు. రాష్ట్ర ప్రభుత్వం అదృష్టదీపక్ కు ఉత్తమ అధ్యాపక అవార్డునిచ్చి సత్కరించింది. సినిమా రంగం 'కళాసాగర్' అవార్డు ఇచ్చి ప్రశంసలు కురిపించింది. సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటీ భారతం చిత్రంలో రచించిన గేయానికి ఆయన నంది అవార్డు పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబంలోనుండి..</span><br style="box-sizing: border-box;" />అదృష్టదీపక్ జనవరి 18 వ తేదీన 1950 లో తూర్పు గోదావరి రామచంద్రపురంలో జన్మించారు. వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబం నుంచి వచ్చిన అదఅష్టదీపక్ విద్యార్థి దశనుంచీ చేసిన కఅషి ఫలితంగా వీరి కవితలు, పాటలు, కథలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు ఆంధ్రదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ ప్రచురించాయి. విశాలాంధ్ర, స్వాతి, వికాసం, మొదలగు పత్రికలూ, సంస్థలూ నిర్వహించిన పోటీలలో ఉత్తమ కవిగానూ, ఉత్తమ కథారచయితగానూ బహుమతులు పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">ప్రచురిత గ్రంథాలు :</span><br style="box-sizing: border-box;" />1. కోకిలమ్మ పదాలు (1972) 2. అగ్ని (1974)<br style="box-sizing: border-box;" />3. సమర శంఖం(1977) 4. ప్రాణం (1978)<br style="box-sizing: border-box;" />5. అడవి (2008) 6. దీపకరాగం (2008)<br style="box-sizing: border-box;" />7. ఆశయాల పందిరిలో (2010) 8. శ్రీశ్రీ ఒక తీరని దాహం (2010)<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />ఇవికాక అనేక ప్రసిద్ధ సంకలనాలలో వీరి రచనలు చోటుచేసుకున్నాయి. బెర్ట్రోల్డ్ బ్రెహ్ట్ పాబ్లో నెరూడాల కొన్ని కవితలను తెలుగులోకి అనువదించారు. 'ఉదయం' దినపత్రికలో ఒక సంవత్సరం ప్రతి ఆదివారం 'పదసంపద'శీర్షిక నిర్వహించారు. విజయవాడనుంచి వెలువడుతున్న 'చినుకు' మాసపత్రికలో మూడేళ్ళపాటు 'దీపకరాగం' శీర్షిక నిర్వహించారు. ప్రస్తుతం 'సాక్షి' దినపత్రిక ఆదివారం అనుబంధం 'ఫన్ డే'లో ప్రారంభ సంచికనుంచీ 'పదశోధన'శీర్షిక నిర్వహిస్తున్నారు. ఎన్నో నాటక కళాపరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ కేరక్టర్ నటుడు వంటి అవార్డులు పొందారు. గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రముఖ నాటక కళాపరిషత్తులలో న్యాయనిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ లు అదఅష్టదీపక్ కథలూ, కవితలూ, కార్యక్రమాలూ ఎన్నోసార్లు ప్రసారం చేశాయి. కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్ హిందీలోకి అనువదించారు. 1980లో మాదాల రంగారావుద్వారా 'యువతరం కదిలింది' చిత్రంలో 'ఆశయాల పందిరిలో'గీతరచనతో సినిమా రంగ ప్రవేశం చేశారు.<br style="box-sizing: border-box;" /> ఇంకా విప్లవశంఖం, నవోదయం, నేటిభారతం, దేశంలో దొంగలుపడ్డారు, ప్రజాస్వామ్యం, నవభారతం, భారతనారి, ఎర్రమందారం, అన్న, మా ఆయన బంగారం, దేవాలయం, వందేమాతరం. అర్ధరాత్రి స్వతంత్రం, కంచుకాగడా, జైత్రయాత్ర, స్వరాజ్యం, బదిలీ, సగటుమనిషి, నవయుగం, వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో గీతరచన చేశారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">అదృష్టదీపక్ కఅషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులూ, రివార్డులూ లభించాయి.</span></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;">1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా 'నేటిభారతం' చిత్రంలో 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో 'కళాసాగర్' అవార్డు (1984) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />2. 2003 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్నారు<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి 'కళానిధి' అవార్డు, సాహితీ పురస్కారం (2004) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం<br style="box-sizing: border-box;" />ఉగాది పురస్కారం (2005) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్.<br style="box-sizing: border-box;" />కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా 2006 లో నియామకమయ్యారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం (2008) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />9. అభ్యుదయ రచయితల సంఘం, విశాఖ శాఖ అధ్వర్యంలో టర్నర్ చౌల్ట్రీలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో 'పురిపండా సాహితీ<br style="box-sizing: border-box;" />పురస్కారం' (2009) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />10. కాకినాడ, అల్లూరి సీతారామరాజు కళావేదిక రజతోత్సవాలలో 'అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారం' (2010) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />11. విజయవాడ, ఎక్స్ - రే అధ్వర్యంలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో 'శ్రీశ్రీ సాహితీ పురస్కారం' (2010) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />12. గుంటూరు జిల్లా, అరసం అధ్వర్యంలో 'కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం' (2010) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />13. హైదరాబాదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే 'సఅజనాత్మక సాహిత్యం' లో 'కీర్తి పురస్కారం' (2010) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />14. 'కవిరాజు త్రిపురనేని రామస్వామి - నార్ల వెంకటేశ్వర రావు' 'వారసత్వ సెక్యులర్ అవార్డు' (2011) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />15. విశాఖపట్నం, కళాభారతి ఆడిటోరియంలో జాలాది కల్చరల్ ట్రస్ట్ వారిచే 'జాలాది సాహితీ పురస్కారం' (2012) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />16. కొత్తపేటలో నన్నయ విశ్వవిద్యాలయం వైస్ - చాన్సలర్ శ్రీ జార్జి విక్టర్ ద్వారా 'శ్రీనాథ రత్నశిల్పి వుడయార్ కళాపురస్కారం'(2012) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />17. కాకినాడ సూర్యకళామందిరంలో రాష్ట్ర మంత్రి శ్రీ తోట నరసింహం ద్వారా 'తెలుగు నాటకరంగ దినోత్సవ పురస్కారం' (2013) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">అవార్డులూ రివార్డులూ :</span><br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా 'నేటిభారతం' చిత్రంలో 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో 'కళాసాగర్' అవార్డు (1984)ను దీపక్ అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />2. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003) పొందారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి 'కళానిధి' అవార్డు మరియు సాహితీ పురస్కారం (2004) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం, ఉగాది పురస్కారం (2004) అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004) ను అందుకున్నారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006) అయ్యారు.<br style="box-sizing: border-box;" /><br style="box-sizing: border-box;" />8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008) పొందారు. కఅత్తివెంటిపేర్రాజు పంతులు జాతీయ పాఠశాల శతాబ్ది ఉత్సవాలలో దీపక్ సన్మానించబడ్డారు. కొత్తపేటలో శ్రీనాథరత్నశిల్పివుడయార్ కళాపురస్కారాన్ని అదృష్టదీపక్ అందుకున్నారు.</p></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-51692131547344419392021-04-30T10:24:00.000-07:002021-04-30T10:24:18.094-07:00 కార్మిక హక్కులపై పెట్టుబడి దాడిని వ్యతిరేకిద్దాం<p><img src="https://prajasakti.com/sites/default/files/2021-04/citu%20mayday%20pranalika_0.jpg" style="background-color: white; border: 0px; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px; height: auto; max-width: 100%; vertical-align: middle; width: 428.2px;" /></p><div class="body" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 18px; margin-top: 15px;"><div property="schema:text" style="box-sizing: border-box;"><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">ఈ మేడే రోజున దేశంలోని, ప్రపంచం అన్ని మూలల్లోని కార్మికులు, శ్రమజీవులందరూ :అందరికీ ఉచితంగా టీకా మందులివ్వాలని, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ఐక్యంగా డిమాండ్ చేయండి. జీవనోపాధి మీద, కార్మికులు, శ్రమ జీవులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద పెట్టుబడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడండి. ప్రజా ప్రత్యామ్నాయం కోసం ఐక్యంగా పోరాడండి. కార్మిక వర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా ఓడించండి.</span><br style="box-sizing: border-box;" /> పెట్టుబడిదారీ వ్యవస్థ అనాగరికమైన, క్రూరమైన రూపాన్ని...2019 చివరి నుండి అది కొనసాగిస్తున్న విధ్వంసాన్ని...కరోనా బట్టబయలు చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినా, అత్యధిక ప్రజల కనీస అవసరాలను, ప్రాణాలను అది కాపాడలేకపోయింది. ఈ వ్యవస్థలో ఆరోగ్యం ప్రాథమిక హక్కు కాదు. అది కొన్న వారికి మాత్రమే లభిస్తుంది. ఆరోగ్యం, విద్య, నివాసం, ఆహారం పేదలకు మరింతగా అందుబాటులో లేకుండా పోతోంది. కరోనా సమయంలో పేదల సంఖ్య పెరిగింది. లక్షల మంది తమ ఉపాధి కోల్పోయారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న వారికే ఆరోగ్యం అందుబాటులో ఉంచినందువలన ధనిక దేశమైన అమెరికా వేలాది కరోనా చావులను నివారించ లేకపోయింది. మన పాలకులు ఇటువంటి వారి సాహచర్యంలో ఉన్నారు.<br style="box-sizing: border-box;" /> ఈరోజున కొద్ది సంఖ్యలో ఉన్న సంపన్న దేశాలు కరోనా టీకాలను నియంత్రిస్తూ వాటిని అనేక పేద దేశాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడి కంటె ప్రజలకే ప్రాధాన్యత నిచ్చే సోషలిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని కరోనా మహమ్మారి అనుభవం ఎత్తి చూపింది. సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ, తక్షణ ప్రభుత్వ జోక్యంతో సోషలిస్టు దేశాలలో కరోనా నియంత్రించబడింది. దాంతో మరణాలు నామమాత్రంగా ఉన్నాయి. చైనా, వియత్నాం, ఉత్తర కొరియా దేశాలు దీనికి సాక్షీభూతంగా ఉన్నాయి. చైనా, వియత్నాం దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టాయి కూడా.<br style="box-sizing: border-box;" /> ఫిబ్రవరి 2021 కల్లా చివరి 9 కోట్ల 89 లక్షల మంది గ్రామీణ ప్రజలను పేదరికం నుండి బయట పడేయటంలో చైనా పూర్తి విజయాన్ని సాధించింది. కరోనా దీర్ఘకాలిక ప్రభావం వలన 2030 కల్లా ప్రపంచంలోని 21 కోట్ల మంది ప్రజలు అదనంగా అత్యంత పేదరికం లోకి పోతారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన నేటి పరిస్థితుల్లో చైనా సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం విధించిన అమానవీయమైన ఆటంకాలు, ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ క్యూబా తన వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను కరోనా కట్టడికి ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాలకే కాకుండా యూరప్ లోని ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు (మొత్తం 51 దేశాలకు) పంపింది. ప్రపంచానికి నిస్వార్ధ ఆరోగ్య సేవలు అందిస్తున్న క్యూబన్ డాక్టర్లకు నోబెల్ బహుమతి ప్రదానం చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.<br style="box-sizing: border-box;" /> ప్రజల జీవనోపాధిని, వారి మనుగడను ప్రమాదంలోకి నెడుతూ కరోనా అవకాశాన్ని బిజెపి ప్రభుత్వం ఉపయోగించుకుని భూస్వాములు, పెట్టుబడిదారీ వర్గాల లాభాల దాహాన్ని తీర్చేందుకు తన నూతన సరళీకరణ విధానాలను దూకుడుగా అమలు చేయటాన్ని సిఐటియు గర్హిస్తున్నది. ఓటింగ్ నిర్వహించాలని అడిగిన యం.పి లను సస్పెండ్ చేసి మూడు వ్యవసాయ బిల్లులను పాస్ చేసింది. పార్లమెంట్లో ప్రతిపక్షం లేని సమయంలో లేబరు కోడ్లను పాస్ చేసింది. స్వావలంబన (ఆత్మ నిర్భర్) అనే మోసపూరిత నినాదం మాటున ప్రభుత్వ రంగ హోల్సేల్ ప్రైవేటీకరణకు ముందుకు పోతోంది. మొత్తం భారత దేశాన్ని, దాని సంపదయిన ప్రకృతి వనరులు, ప్రభుత్వ రంగాన్ని మరియు సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతోంది. 19వ శతాబ్దం నాటి వలస దోపిడీ తరహా పరిస్థితుల లోకి దేశాన్ని, ప్రజలను నెడుతోంది.<br style="box-sizing: border-box;" /> సరళీకరణ విధానాల అమలు కాలంలో దేశంలోని మూడు భారీ టీకా మందుల ఉత్పత్తి కర్మాగారాలు మూతపడటంతో వాటి ఉత్పత్తి ఇపుడు ప్రైవేటు కంపెనీల చేతిలోకి పోయింది. భారత ప్రభుత్వం కూడా వాటి దగ్గర కొనాల్సి వస్తోంది. ఒకప్పుడు టీకా ఉత్పత్తిలో ముందు పీఠిన ఉన్న దేశం ఇపుడు తీవ్రమైన కరోనా టీకాల కొరతను ఎదుర్కొంటోంది. వాటి ఉత్పత్తిని పెంచి అందరికీ అందుబాటులోకి తేవటంలో ప్రభుత్వం విఫలమైంది.<br style="box-sizing: border-box;" /> సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించటానికి, ఎటువంటి ఆటంకాలు లేని దోపిడీ కోసం లేబర్ కోడ్లను బిజెపి ప్రభుత్వం పాస్ చేసింది. చట్టాలను అతిక్రమించే యజమానుల చర్యలను లేబర్ కోడ్లు ఇపుడు చట్టబద్ధం చేశాయి. మరో పక్క హక్కుల కోసం కార్మికులు చేసే ఉమ్మడి కార్యాచరణను నేరంగా పరిగణించాయి. సార్వత్రికమైన, మేడేకు ప్రతి రూపంగా ఉన్న 8 గంటల పని నీరుగార్చబడింది. కార్మిక హక్కులకు సంబంధించి వలస కార్మికుల జాతీయ విధాన ముసాయిదాలో ఎటువంటి ప్రస్తావన లేదు. రెండో దశ కరోనా దేశాన్ని నాశనం చేస్తున్నది. మరోసారి లాక్డౌన్లు వస్తాయనే భయంతో వేలాది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెనుదిరుగుతున్నారు.<br style="box-sizing: border-box;" /> వినాశకరమైన పెట్టుబడిదారీ సరళీకరణ విధానాల వలన ఆర్థిక వ్యవస్థలో ఉపాధిని కల్పించే సామర్ధ్యం దెబ్బతిని భారతదేశంతో సహా ప్రపంచమంతటా నిరుద్యోగం విజృంభిస్తోంది. అయితే, కరోనా సమయంలో భారత బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగినట్లు ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది.<br style="box-sizing: border-box;" /> సామాన్య ప్రజలు తమ డబ్బును దాచుకునే ప్రభుత్వరంగ బ్యాంకులు, తమకు కష్టకాలంలో రక్షణగా నిలిచే ప్రభుత్వరంగ ఇన్సూరెన్సు కంపెనీలు బడా కార్పొరేట్లకు అప్పజెప్పబడుతున్నాయి. రక్షణ, రైల్వేలు, కమ్యూనికేషన్లు, పౌరవిమానయానం, ఓడరేవులు, విద్యుత్తు, ఉక్కు, గనులు విదేశీ గుత్త సంస్థలతో సహా ప్రయివేటు కార్పొరేట్లకు ఇవ్వబడుతున్నాయి. ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలతో సహా మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రైవేటీకరణకు లక్ష్యంగా చేయబడింది. పరిశ్రమలు, సర్వీసులే గాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు తలుపులు బార్లా తెరిచింది. చిన్న రైతుల చేతిలో ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్లు స్వాధీనం చేసుకునేందుకు మూడు వ్యవసాయ చట్టాలు ఉద్దేశించబడ్డాయి. మద్దతు ధరలను, ధాన్య సేకరణను ఉపసంహరించి రైతులను అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులకు బలిచేసే విధంగా కార్పొరేట్ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ కూలిపోవటానికి దారి తీస్తుంది. ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం తెస్తుంది. అత్యధిక రైతులు తమ భూముల నుండి తొలగించబడతారు.<br style="box-sizing: border-box;" /> కార్మిక, రైతు, ప్రజా, జాతి వ్యతిరేక బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న కార్మికులు, రైతులు ఇతర శ్రమ జీవులందరినీ సిఐటియు అభినందిస్తున్నది. దేశవ్యాప్తంగా కార్మికులు వారి పోరాటంలో భాగస్వాములు కావటం సిఐటియు కి గర్వకారణం.<br style="box-sizing: border-box;" /> బడా పెట్టుబడిదారులు, వారి ప్రతినిధుల దాడి నుండి తమ హక్కులు, పని పరిస్థితుల పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మిక వర్గాన్ని సిఐటియు అభినందిస్తోంది. లాక్డౌన్ సమయంలో తమ ఇంటి నుండి నిరసన తెలియజేసిన కార్మికవర్గం తమ పోరాటాన్ని పెంచుకుంటూ పోయి 26 నవంబర్ సమ్మెను విజయవంతం చేసింది. ఈ నిరసనలకు చొరవ చేసినందుకు సిఐటియు గర్విస్తోంది. భారీగా స్పందించిన కార్మికులను అభినందిస్తున్నది. బొగ్గు, ఉక్కు, బ్యాంకు, బీమా, ప్రైవేటు సంఘటిత రంగం, స్కీము వర్కర్లు, ఉద్యోగులు మరియు లక్షలాది మంది అన్ని రంగాల కార్మికులు పోరాట బాటలో ఉన్నారు.<br style="box-sizing: border-box;" /> దేశ సంపదను ఉత్పత్తి చేస్తున్న కార్మికులు, రైతుల మధ్య సంఘీభావం పెరుగుతుండటం గొప్ప ప్రాముఖ్యత కలిగిన అంశం. అటువంటి సంఘీభావాన్ని, ఐక్యతను అభివృద్ధి చేసేందుకు సిఐటియు సదా కృషి చేస్తున్నది. కరోనా కాలంలో తమ కోర్కెలపైన కార్మికులు, రైతులు తమ పోరాటాలను తీవ్రం చేయటమేగాక, పరస్పరం ఒకరి పోరాటాలలో మరొకరు పాల్గొన్నారు. ఇటువంటి కార్మిక కర్షక ఐక్య పోరాటాలు విశాల ప్రజానీకంతో ఉన్నత స్థాయిలో జరిగితే సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగానే గాక పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పోరాటాలను పురోగమింపజేసే చారిత్రక అవకాశం వస్తుందని సిఐటియు నమ్ముతుంది.<br style="box-sizing: border-box;" /> తన విధానాలకు వ్యతిరేకతను, నిరసనను తప్పుడు పద్ధతులతో బిజెపి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేయటాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక హక్కులు, పార్లమెంటరీ ప్రమాణాలు ఉల్లంఘించబడుతున్నాయి. తన చర్యలకు నిరసన తెలిపే, తన విధానాలను వ్యతిరేకించే వారిని భయపెట్టటానికి, బెదిరించటానికి, జైలుకు పంపటానికి బిజెపి ప్రభుత్వం తన అధీనంలోని ఆర్థిక నేరాలను విచారించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి), ఆదాయ పన్ను, సిబిఐ, ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తున్నది. వందలాది మంది విద్యార్ధులు, మహిళలు, జర్నలిస్టులు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు, మానవ, పౌర హక్కుల కార్యకర్తలు ఈ చట్టాల కింద అరెస్టయి బెయిలు లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు.<br style="box-sizing: border-box;" /> నిరంతరాయంగా వస్తున్న పెట్టుబడిదారీ సంక్షోభానికి స్పందనగా పాలకవర్గాలు ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్ని కేంద్రీకృతం చేస్తున్నాయి. నిరంకుశ పోకడలలో భాగంగా ప్రజాస్వామిక విభాగాలను ధ్వంసం చేస్తున్నాయి. సమాఖ్య నిర్మాణంలో భాగంగా ఉన్న రాష్ట్రాల హక్కులు హరింపబడుతున్నాయి.<br style="box-sizing: border-box;" /> తమ ప్రయోజనాలను కాపాడటంలో వ్యవస్థ వైఫల్యాన్ని దేశంలోని, ప్రపంచంలోని కార్మికులు గుర్తిస్తున్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వ లక్షణం ప్రజలకు క్రమేపీ అర్ధమవుతోంది. ఈ అవగాహన మరింత విస్తృతం కావాలి. కేంద్రంలో వస్తున్న వరుస ప్రభుత్వాల విధానాలకు తమ రోజువారీ సమస్యలకు ఉన్న లింకు ప్రజా బాహుళ్యం అర్ధం చేసుకునేలా చైతన్యపరచాలి. వారి మిత్రులెవరో, శత్రువులెవరో గుర్తించేలా సహాయపడాలి. తమ శత్రువులపై తమ మిత్రులతో కలిసి ఐక్యంగా పోరాడేలా వారిని సమీకరించాలి.<br style="box-sizing: border-box;" /> ప్రజల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, సామాజిక సామరస్య వాతావరణం మీద, మొత్తం జాతీయ సమగ్రత మీద పూర్తి స్థాయిలో దాడి జరుగుతోంది. ఈ దాడులను తిప్పికొట్టాల్సిన కార్మికవర్గం, తన వ్యక్తీకరణలన్నిటిలోనూ సమగ్రమైన అవగాహనతో వ్యవహరించాలి. కార్మికులు, ప్రజల హక్కులు, వారి జీవనోపాధి పరిరక్షణ కోసం, ప్రజాస్వామిక వ్యవస్థ మరియు విలువలు, దేశ ఆర్థిక వ్యవస్థ మరియు వనరులు, వీటన్నింటిని మించి ప్రజల ఐక్యతను కాపాడుకోవటం కోసం కార్మికవర్గం ప్రజలతో కలిసి ఐక్యంగా పోరాడాలి.<br style="box-sizing: border-box;" /> దీని కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అంతర్గత దోపిడీ గుణాన్ని బహిర్గతం చేసేందుకు నిరంతరం, నికరంగా ప్రయత్నించాలి. ఆ వ్యవస్థ అమానవీయ కుయుక్తులను, వాటిని ప్రోత్సహించే రాజకీయాలను బట్ట బయలు చేయాలి. ఈ మేడే రోజున ఈ కర్తవ్యాన్ని చేపడదామని ప్రతిజ్ఞ చేద్దాం.<br style="box-sizing: border-box;" /> ఈ మేడే రోజున దేశంలోని, ప్రపంచం అన్ని మూలల్లోని కార్మికులు, శ్రమజీవులందరూ: అందరికీ ఉచితంగా టీకా మందులివ్వాలని, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ఐక్యంగా డిమాండ్ చేయండి. జీవనోపాధి మీద, కార్మికులు, శ్రమ జీవులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద పెట్టుబడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడండి. ప్రజా ప్రత్యామ్నాయం కోసం ఐక్యంగా పోరాడండి. కార్మిక వర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా ఓడించండి. మే డే వర్థిల్లాలి.</p></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-68200806735734775202021-04-28T11:08:00.000-07:002021-04-28T11:08:14.837-07:00భారత్లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!<p> <img src="https://prajasakti.com/sites/default/files/2021-04/kumbamela%201%20copy_0.jpg" style="background-color: white; border: 0px; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px; height: auto; max-width: 100%; vertical-align: middle; width: 428.2px;" /></p><div class="body" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 18px; margin-top: 15px;"><div property="schema:text" style="box-sizing: border-box;"><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">న్యూఢిల్లీ :</span> గత ఏడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది. దీంతో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దశల వారీగా లాక్డౌన్కు విముక్తి కలిగించగా..కేసులు పెరుగుతూ వచ్చినప్పటికీ..అనంతరం తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వాలు, ప్రజలు 'హమ్మయ్య' అనుకున్నారు. జనవరిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేయడంతో... ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్లతో భయాందోళనలను మొదలయ్యాయి. అయితే టీకాలు అందుబాటులోకి వచ్చేయడంతో.. వాటి వల్ల భారత్కు వచ్చే ప్రమాదమేమీ లేదని, అప్పటికే వచ్చిన వ్యాక్సిన్లు వాటిపై కూడా పనిచేస్తాయని వైద్య సిబ్బంది, అంటు వ్యాధి నిపుణులు అనుకున్నారు. వెంటిలేటర్ల డిమాండ్ ఉండకపోవచ్చునని, సెకండ్ వేవ్ను తప్పించుకున్నట్లేనని కొందరు నిపుణులు ఫిబ్రవరిలో ఓ అంచనాకు వచ్చేశారు.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><img alt="భారత్లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!" data-entity-type="file" data-entity-uuid="cda8a1e7-1e47-4c6f-9026-200b73cdf8a9" height="519" src="https://prajasakti.com/sites/default/files/inline-images/corona_0.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="779" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">వద్దన్నా...వదిలేస్తానా....</span><br style="box-sizing: border-box;" />మార్చి చివరి నుండి కరోనా కేసులు కొది కొద్ద్దిగా పెరగడం మొదలయింది. మహమ్మారి బలం పుంజుకుని విజృంభించింది. దీంతో దేశంలో కరోనా సెకండ్ వేవ్లో వెళ్లిందని కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్లో ఊహించనిరీతిలో మహమ్మారి జడలు విప్పింది. కేసులు విపరీతంగా పెరిగాయి. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. పలువురు మృత్యువాత పడ్డారు. శ్మశాన వాటికల వద్ద మృతదేహాలు బారులు తీరిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతటి విపత్తుకు మోడీ సర్కార్ వైఫల్యమే కారణమని పలువురు విమర్శించారు.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><img alt="భారత్లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!" data-entity-type="file" data-entity-uuid="6ce352cc-f357-4e8b-8a47-610de4f45a94" height="442" src="https://prajasakti.com/sites/default/files/inline-images/3_13.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="768" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">ఇంత ఘోరమైన పరిస్థితులు ఇందుకేనా..?</span><br style="box-sizing: border-box;" />తగ్గినట్లే తగ్గి కరోనా ఉప్పెనలా ఎగిసి పడటాన్ని బహుశా నిపుణులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గింది. రోజువారీ కేసుల నమోదులో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంతో సమానంగా భారత్లో నమోదయ్యాయి. జనాభా రీత్యా న్యూయార్క్కు భారత్ 50 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే భారత్లో కేసులు తక్కువగా ఉండడానికి ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి కారణమని అంటువ్యాధి నిపుణులు భావించారు. ఏప్రిల్లో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రపంచంలో మరే ఇతర దేశంలో నమోదవ్వనన్ని కేసులు భారత్లో వెలుగుచూడటంతో...ఈ దేశం కేంద్ర బిందువుగా మారిపోయింది. కేసుల నమోదులో భారత్ తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటోంది. లక్ష నుండి మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు వెలుగుచూడటంతో...రోగ నిరోధక శక్తిపై తాము వేసుకున్న అంచనా తప్పని నిపుణులు భావించారు. కాగా, గతంలో వచ్చిన వైరస్ పేదలపై అధిక ప్రభావం చూపించగా ఈ ఉప్పెన కొంత స్తోమతుపరులను దెబ్బ తీసిందని కొందరి భావన.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><img alt="భారత్లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!" data-entity-type="file" data-entity-uuid="d9985a14-fd8f-4a73-82b5-aecdd6307c85" height="447" src="https://prajasakti.com/sites/default/files/inline-images/962545-pm-modi_0.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="777" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">మోడీ ర్యాలీలు, కుంభమేళా కొంప ముంచాయ్</span><br style="box-sizing: border-box;" />ఈ స్థాయిలో కరోనా వ్యాప్తికి పెద్ద పెద్ద ప్రజా సమూహాలు ప్రధాన పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. దానికి ఉదాహరణ...ప్రధాని మోడీ ప్రసంగ ర్యాలీలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలపై ఫోకస్ చేశారు. దీంతో ప్రజలు వేలల్లో హాజరుకావడం మొదలు పెట్టారు. అంతేకాకుండా మహా కుంభ మేళా వంటి వాటికి భక్తులను ఆహ్వానించారు. ఇవి కరోనా కేసులు విజృంభించడానికి కారణమయ్యాయి. దీనిపై ప్రిన్స్టన్ యూనివర్శిటీ అంటువ్యాధి నిపుణులు రమణ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..కోవిడ్-19పై భారత్ విజయం సాధించిందని బహిరంగంగా గొప్పలు చెప్పుకున్నారని, అయితే పరిస్థితి మరోలా ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు రిలాక్స్ అయ్యారని, ఈ ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక అన్ని కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. పెద్దగా గుమిగూడటం, ప్రయాణాలు, ఘనంగా వివాహాలు నిర్వహించడం మొదలు పెట్టారని తెలిపారు. ఇది కూడా మహమ్మారి కట్టలు తెంచుకోవడానికి కారణమైందన్నారు.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><img alt="భారత్లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!" data-entity-type="file" data-entity-uuid="e5251bc7-3e23-410c-8fb4-7d48e8c64eb6" height="436" src="https://prajasakti.com/sites/default/files/inline-images/4_9.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="758" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">కొత్త వేరియంట్లు పరిస్థితులను దిగజార్చాయా..?</span><br style="box-sizing: border-box;" />బ్రెజిల్, యుకె, దక్షిణాఫిక్రా వంటి దేశాలకు చెందిన వైరస్ల వల్ల దేశంలో ఈ పరిస్థితులకు దారితీశాయా అనే అంశంపై ఇంక స్పష్టత రాలేదు. అయితే శాస్త్రవేత్తలు ఇవి కూడా కారణం కావచ్చునని అంగీకరిస్తున్నారు. యుకెలో మొదట గుర్తించిన బి.1.1.7 వైరస్ ఇప్పుడు..పంజాబ్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలెక్కువని అధ్యయనంలో తేలింది. మరో వేరియంట్ బి.1.617 మహారాష్ట్రలో విజృంభిస్తోంది. దీన్నే డబుల్ మ్యూటెంట్ వైరస్గా పిలుస్తారు. అయితే ఇతర వేరియంట్ల కన్నా..ఇది వేగంగా వ్యాప్తి చెందగలదన్న నివేదికలు ఏమీ లేవు. అదేవిధంగా బ్రెజిల్, దక్షిణాఫిక్రాలో బయటపడ్డ వేరియంట్లు కూడా భారత్లో చక్కర్లు కొట్టాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">కేసులు పెరుగుతుంటే...కేంద్రం ఏం చేసిందంటే..?</span><br style="box-sizing: border-box;" />కేసులు పెరుగుతుండటంతో వివిధ రాష్ట్రాలు మినీ లాక్డౌన్ బాట పట్టాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత మొదలైంది. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడిన చందంగా ఆక్సిజన్ కొరత తోడయ్యింది. దీంతో దేశంలో మృత్యుఘోష మొదలైంది. ఇవన్నీ కేంద్రం దృష్టికి వెళ్లగా...ప్రభుత్వం వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భావించి..మే 1 నుండి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. లాక్డౌన్ చివరి ఆప్షన్గా మాత్రమే ఉండాలని హితవు పలికారు. పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను కేంద్రం నడిపేందుకు సిద్ధమైంది. వీటన్నింటితో పాటు కరోనా కట్టడి చేయడంతో మోడీ సర్కార్ వైఫల్యం చెందిందంటూ సోషల్ మీడియా వేదికగా గొంతెత్తిన వారి పోస్టులను తొలగించాలని ట్విట్టర్ను ఆదేశించింది. ఇది మరో పెద్ద వివాదానికి దారి తీసింది.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><img alt="center" data-entity-type="file" data-entity-uuid="ed130e13-4458-4b95-917a-218239fc0501" height="443" src="https://prajasakti.com/sites/default/files/inline-images/5_7.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="771" /></p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">ప్రాణవాయువు కొరత ఏర్పడటానికి కారణాలు?</span><br style="box-sizing: border-box;" />దేశంలో గతంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం చాలా తక్కువ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్లో 90 శాతం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రులకు తరలివెళ్లాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సీనియర్ ఆరోగ్యాధికారి రాజేష్ భూషణ్ ఓ ఛానల్కిచ్చిన ఇంటర్య్యూలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లు లేనందున..ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడ్డాయి. అయితే ఇందులో కూడా ఓ సమస్య ఏర్పడింది. ఓ ఆక్సిజన్ ట్యాంక్ నింపేందుకు రెండు గంటల సమయం పట్టడం, ట్యాంకర్లు గంటకు 25 మైళ్ల వేగంతో..అది కూడా పగటిపూట మాత్రమే ప్రయాణించడం ప్రాణవాయువు సమస్య మరింత రెట్టింపైంది. రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రులకు ఇదొక తలనొప్పిగా మారింది. కాగా, కేంద్రం ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్ల ప్రణాళికను గత అక్టోబర్లో ప్రకటించింది. 166 నిర్మిస్తామని హమీనిచ్చిన.... ఈ ఆరు నెలల్లో నిర్మించింది కేవలం 33 మాత్రమే. ఇప్పుడు దీని కొరత రావడంతో మరో 551 ప్లాంట్లను నిర్మిస్తామని తాజాగా ప్రధాని మోడీ హామీనిచ్చారు. వాస్తవానికి ఈ ప్రకటన చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయితే చిన్నపాటి ఆక్సిజన్ ప్లాంట్లను నడుపుతున్నవారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటామని...తమకు ఆర్థిక సాయం అందించాలని అడుగుతున్నా....మోడీ ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదు.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><img alt="center" data-entity-type="file" data-entity-uuid="7df35c84-b297-4134-81e3-d0680a591d7a" height="440" src="https://prajasakti.com/sites/default/files/inline-images/earth-globe-isolated-world-map-icon-color-hemisphere-earth-illustration_118339-491.jpg" style="border: 0px; box-sizing: border-box; height: auto; max-width: 100%; vertical-align: middle;" width="765" /><br style="box-sizing: border-box;" /><span style="box-sizing: border-box; font-weight: 700;">ఆపన్న హస్తం అందిస్తోన్న ప్రపంచ దేశాలు</span><br style="box-sizing: border-box;" />భారత్ కరోనా కల్లోల్లంలో కొట్టుమిట్టాడుతుంటే..ఇతర దేశాలు ఆపన్న హస్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. సింగపూర్, జర్మనీ, యుకె... ఆక్సిజన్ సంబంధిత సామాగ్రిని పంపాయి. ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా వంటివి వైద్య సాయాన్ని అందిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ సాయం అందిస్తామని చెప్పాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు ఆక్సిజన్, ఇతర మందులకు అందించేందుకు సహకరిస్తామని తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ..భారత్కు అదనపు ఆరోగ్య సిబ్బంది, సామాగ్రిని పంపుతామని తెలిపారు. కాగా, భారత్కు సాయం చేయాలని ఒత్తిడి పెరగంతో అమెరికా కూడా సాయం చేస్తామని చెప్పింది. కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడిసరుకును అందిస్తామని హామీనిచ్చింది.</p></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-57359746334043949492021-03-30T05:13:00.001-07:002021-03-30T05:13:09.942-07:00బ్యాంకుల కొత్త మార్పులకు సిద్ధమవ్వండి<div class="separator"><p style="font-family: EenaduU; margin-left: 1em; margin-right: 1em; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1a.jpg" style="border: 0px; height: 400px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 600px;" /></p></div><center style="font-family: EenaduU;"><br /></center><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px;"><span style="color: #0000cc;"><strong><em>ఏప్రిల్ 1... కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీ. కంపెనీలకు, ఉద్యోగులకు.. అంతెందుకు ప్రభుత్వాలకూ ఇది ‘పద్దు’పొడుపు తేదీ. ఈ తేదీ నుంచే చాలా మార్పులు.. చేర్పులు చోటు చేసుకుంటుంటాయి. బడ్జెట్లో ప్రకటించే అనేక ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేది ఈ తారీఖు నుంచే. ఈసారి కార్లు, బైక్లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. అలాగే విమాన ప్రయాణంపైనా కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇలాంటివి చాలానే ఉన్నాయ్.. అవేంటంటే..</em></strong></span></p></blockquote><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em>ఈ బ్యాంకుల చెక్కు బుక్లు పనిచేయవు</em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1b.jpg" style="border: 0px; height: 210px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 300px;" /></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px;"><strong>ఆం</strong>ధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్.. ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయా.. ఈ బ్యాంకులకు చెందిన పాస్ పుస్తకాలు, చెక్కు బుక్కులు ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. ఎందుకంటే.. ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. విలీనమైన బ్యాంకులకు చెందిన చెక్ పుస్తకాలను ఖాతాదారులు తీసుకోవాల్సి ఉంటుంది. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో; ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో; కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్లు యూనియన్ బ్యాంక్లో; ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ విలీనం అయిన సంగతి తెలిసిందే.</p></blockquote><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em>బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్</em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1c.jpg" style="border: 0px; height: 208px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 300px;" /></em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px;"><strong>ఆ</strong>దాయ పన్ను రిటర్ను(ఐటీఆర్)లు దాఖలు చేయకపోతే బ్యాంకు డిపాజిట్లపై మూలం వద్ద పన్ను మినహాయింపు(టీడీఎస్) రెట్టింపు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్నుల దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత రెండేళ్లలో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ ఉన్నవారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదా 5 శాతం (ఏది ఎక్కువైతే అది పద్ధతిలో)ను వసూలు చేస్తారు.</p></blockquote><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em>ఈపీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ చేస్తున్నారా?</em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1d.jpg" style="border: 0px; height: 214px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 300px;" /></em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px;">ఏప్రిల్ 1, 2021 నుంచి ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను నుంచి తప్పించుకోలేవు. ఎలాగంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే(బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం) ఎక్కువ ఈపీఎఫ్లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు. కాగా, తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు. అయితే ఈ పీఎఫ్ జమల్లో కంపెనీ వాటా ఉండకూడదు. ప్రైవేటు ఉద్యోగులు వడ్డీపై పన్ను పడకూడదనుకుంటే ఈపీఎఫ్, వీపీఎఫ్ కలిపి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకే జమ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంస్థ (ప్రభుత్వం) నుంచి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి రూ.5 లక్షల వరకు వీళ్లు జమ చేసుకున్నా.. వడ్డీపై పన్ను పడదు.</p></blockquote><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em>కంపెనీలు క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే</em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1e.jpg" style="border: 0px; height: 214px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 300px;" /></em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px;"><strong>కం</strong>పెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతే కాదు.. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్/పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులనూ ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది.</p></blockquote><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em>కార్లు, బైక్లు, ఏసీలు ధరలు ప్రియం</em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1f1.jpg" style="border: 0px; height: 121px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 300px;" /></em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px;"><strong>కొ</strong>త్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు, బైక్ల ధరలు ప్రియం కానున్నాయి. జనవరిలోనూ కంపెనీలు రేట్లు పెంచాయి. అంతర్జాతీయ సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని చెబుతున్నాయి. టీవీలు, ఏసీలు సైతం రూ.3,000-4,000 వరకు పెరగనున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు ప్రియం కానున్నాయి. ఏసీ ధరలు రూ.1500-2000 వరకు పెరగవచ్చు.</p></blockquote><blockquote style="background: rgb(245, 245, 245); border-left: 3.5pt solid rgb(204, 18, 24); font-family: EenaduU; margin: 1em 20px; padding: 9px 7px 8px !important;"><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em>విమానం ఎక్కుతున్నారా?</em></strong></span></p><p style="margin-bottom: 0px; margin-left: 5px !important; margin-right: 5px !important; margin-top: 0px; padding: 5px 0px; text-align: center;"><span style="color: red;"><strong><em><img alt="" src="https://assets.eenadu.net/article_img/29BU-br1g.jpg" style="border: 0px; height: 156px; margin-bottom: 7px; max-width: 100%; vertical-align: middle; width: 300px;" /></em></strong></span></p></blockquote><p><strong style="background-color: whitesmoke; font-family: EenaduU;">ఏ</strong><span style="background-color: whitesmoke; font-family: EenaduU;">ప్రిల్ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్) పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులపై ఏఎస్ఎఫ్ను పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున; అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ఈ రేటును విధించనున్నారు. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు; డిప్లొమాటిక్ పాస్పోర్టులున్నవారు.. తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు వర్తించదు.</span> </p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-57844304999022627172021-02-26T09:18:00.010-08:002021-02-26T09:18:55.208-08:00సోషల్, డిజిటల్ మీడియాకు.. లక్ష్మణ రేఖలు<p> <b style="box-sizing: border-box; color: red; font-family: Jyothi_ie, Jyothi;">మూడంచెల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటుకు సూచన</b></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><b style="box-sizing: border-box; color: red;">నగ్న, మార్ఫింగ్ చిత్రాలను 24 గంటల్లో తొలగించాలి</b></p><div class="separator" style="clear: both; text-align: center;"><b style="box-sizing: border-box; color: red;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinTvKsKFZFjGcxq0rCouXzXaK7YNeJD6hxKDCg2mMFu6KBhhbR9SbW28EvyCpFVRBiOQESedRytMyUlrWh9YAlDcWQKdqjcQ2Cgj5KgF-jh9amE539d4ImOupqg9brAQLPLDr9va2Opvt6/s673/social-25.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="414" data-original-width="673" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinTvKsKFZFjGcxq0rCouXzXaK7YNeJD6hxKDCg2mMFu6KBhhbR9SbW28EvyCpFVRBiOQESedRytMyUlrWh9YAlDcWQKdqjcQ2Cgj5KgF-jh9amE539d4ImOupqg9brAQLPLDr9va2Opvt6/s320/social-25.JPG" width="320" /></a></b></div><b style="box-sizing: border-box; color: red;"><br /></b><p></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><b style="box-sizing: border-box; color: red;">దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలను మొదటగా పోస్ట్ చేసిన వారిని గుర్తించాలి</b></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><b style="box-sizing: border-box; color: red;">15 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాలి..</b></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><b style="box-sizing: border-box; color: red;">డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లకూ నిబంధనలు</b></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><b style="box-sizing: border-box; color: red;"><br style="box-sizing: border-box;" /></b></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><b style="box-sizing: border-box; color: red;">న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25:</b> సామాజిక మాధ్యమాలను కట్టడి చేసే కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కొత్త నియమావళి ప్రకారం.. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే వ్యాఖ్యలను 24 గంటల్లో తొలగించడంతో పాటు.. వాటిని మొదటిగా చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాల్సిన బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే. అలాగే, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీలను నియంత్రించే నిబంధనలను కూడా కేంద్రం రూపొందించింది. డిజిటల్ మీడియాలో పారదర్శకత, జవాబుదారీ తనం లోపించడం.. వినియోగదారుల హక్కులపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సంబంధిత వర్గాలన్నింటితో చర్చలు జరిపి ఈ నియమావళిని రూపొందించినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ‘‘సోషల్ మీడియా సంస్థలు భారత దేశంలో వ్యాపారం చేయడాన్ని, లాభాలు ఆర్జించడాన్ని స్వాగతిస్తాం.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;">కానీ, ఆయా సంస్థలు రాజ్యాంగాన్ని, మన దేశ చట్టాలను గౌరవించాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు.. సాధారణ వినియోగదారులకు తమ సృజనాత్మకతను ప్రదర్శించుకునే, ప్రశ్నించే, తమ అభిప్రాయాలను పంచుకునే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను విమర్శించే అవకాశాన్ని వారికిచ్చాయి. అయితే, ఈ క్రమంలో ఆయా ప్లాట్ఫామ్ల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే. సోషల్ మీడియాను వాడుకునే సాధారణ వినియోగదారులకు ఈ కొత్త నిబంధనలు సాధికారతనిస్తాయి. వారి ఫిర్యాదులను పట్టించుకుని సకాలంలో పరిష్కరించే ఒక వ్యవస్థను రూపొందిస్తాయి.’’ అని పేర్కొన్నారు. ఇక.. ‘‘వదంతులను ప్రచారం చేసే హక్కు డిజిటల్ మీడియా వెబ్సైట్లకు లేదు. మీడియాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. కానీ.. కొన్ని సహేతుకమైన పరిమితులతో’’ అని జావడేకర్ వ్యాఖ్యానించారు.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><span style="background-color: yellow; color: red; font-weight: bold;">రెండు రకాలు..</span></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> కొత్త నియమావళి ప్రకారం కేంద్రం సామాజిక మాధ్యమాలను.. వాటి వినియోగదారుల సంఖ్య ఆధారంగా రెండు రకాలుగా విభజించింది. తక్కువ వినియోగదారులున్న వాటిని సాధారణ సామాజిక మాధ్యమాలుగా, ఎక్కువ వినియోగదారులున్నవాటిని ప్రముఖ సామాజిక మాధ్యమాలుగా పరిగణిస్తామని పేర్కొంది. రెండు రకాల మాధ్యమాలూ నిబంధనలను పాటించాలి. ప్రముఖ సామాజిక మాధ్యమాలు అదనంగా మరిన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రెండు రకాల మాధ్యమాలూ పాటించాల్సిన నిబంధనలు..</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> అన్ని రకాల సామాజిక మాధ్యమాలూ తమతమ ప్లాట్ఫామ్లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో జాగరూకతతో ఉండాలి. ఐటీ చట్టం ప్రకారం సామాజిక మాధ్యమాలకు కొన్ని ‘సేఫ్ హార్బర్ ప్రొవిజన్లు’ ఉంటాయి. అంటే.. ఆయా ప్లాట్ఫామ్లపై వినియోగదారులు చేసే పోస్టుల బాధ్యత సోషల్ మీడియా సంస్థలకు ఉండదు. ఇక నుంచి అలా కుదరదు. జాగ్రత్తగా ఉండకపోతే సేఫ్ హార్బర్ ప్రొవిజన్ వాటికి వర్తించదు.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి. ఆ అధికారి పేరు, వివరాలు అందుబాటులో ఉంచాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి. 15 రోజుల్లోగా పరిష్కరించాలి. సోషల్ మీడియా వినియోగదారుల.. ముఖ్యంగా మహిళా యూజర్ల ఆన్లైన్ భద్రతను, గౌరవాన్ని కాపాడాలి. ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లోగా వారిని ఇబ్బంది పెట్టే కంటెంట్ను, వారి రహస్య అవయవాలను బహిర్గతం చేసే చిత్రాలు, శృంగారంలో పాల్గొనే దృశ్యాలు, మార్ఫింగ్ చిత్రాలు ఉంటే తొలగించాలి. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><span style="background-color: yellow; color: red; font-weight: bold;">‘అదనపు’ జాగ్రత్తలు..</span></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> కేంద్రం విభజించిన ప్రకారం ‘ప్రముఖ సామాజిక మాధ్యమాల’కు మరికొన్ని అదనపు బాధ్యతలు ఇవి..</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;">సోషల్ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం ‘చీఫ్ కంప్లయన్స్ అధికారి’ని నియమించాలి. పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ‘నోడల్ కాంటాక్ట్ పర్సన్’ను నియమించాలి. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలి. వీరంతా భారత్లో నివసించేవారై ఉండాలి. అందుకున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతోపాటు.. ఫిర్యాదులు రాకముందే తొలగించిన కంటెంట్ తాలూకూ వివరాలతో ప్రతి నెలా సవివరమైన నివేదికను సామాజిక మాధ్యమాలు ప్రచురించాలి.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు సంబంధించిన.. విదేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసే.. అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన.. కంటెంట్ను ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశించిన 24 గంటల్లో తొలగించాలి. వాటిని సామాజిక మాధ్యమాల్లో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాలి. ఇది మెసేజింగ్ రూపంలో సేవలు అందించే ప్రముఖ సామాజిక మాధ్యమాలకు ముఖ్యం గా వర్తిస్తుంది (అంటే.. వాట్సాప్ వంటివాటికి. నిజానికి వాట్సాప్ సామాజిక మాధ్యమం కాదు. మెసేజింగ్ యాప్ మాత్రమే. కానీ, వాట్సాప్ ద్వారా దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిబంధన పెట్టారు).</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> దర్యాప్తు సంస్థల నుంచి లిఖితపూర్వక అభ్యర్థన వస్తే.. వారు అడిగిన సమాచారాన్ని 72 గంటల్లోగా సమర్పించాలి. ఆ రికార్డులను దర్యాప్తు నిమిత్తం 180 రోజులు దాచి ఉంచాలి. ప్రముఖ సామాజిక సంస్థలు భారతదేశంలో తమ కార్యాలయం చిరునామాను వెబ్సైట్లో, యాప్లో తప్పనిసరిగా ఇవ్వాలి.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> తమ ఖాతాలను ధ్రువీకరించడానికి సిద్ధమయ్యే వారికోసం ‘వాలంటరీ యూజర్ వెరిఫికేషన్ మెకానిజమ్’ను రూపొందించాలి. వినియోగదారులు చేసిన పోస్టును తొలగించే ముందు.. వారి వాదన చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అయినప్పటికీ ఆ సమాచారాన్ని తొలగించాలనుకుంటే ఆ విషయాన్ని వారికి ముందు గా తెలపాలి. దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే.. విదేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసే అంశాలకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలంటూ కోర్టు ఆదేశించినప్పుడు.. ప్రభుత్వ వ్యవస్థలు కోరినప్పుడు అలాంటి నిషేధిత సమాచారాన్ని తొలగించాలి. సామాజిక మాధ్యమాలకు సంబంధించిన నిబంధనలు గెజెట్లో ప్రచురితమైనప్పటి నుంచి అమల్లోకి వస్తాయి. ప్రముఖ సామాజిక మాధ్యమాలు అదనంగా పాటించాల్సిన నిబంధనలు గెజెట్లో ప్రచురితమైన 3 నెలల తర్వాత అమల్లోకి వస్తాయి.</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"><span style="background-color: yellow; color: red; font-weight: bold;">డిజిటల్ మీడియా నిబంధనలు..</span></p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్ల నియంత్రణకు రూపొందించిన ఎథిక్స్ కోడ్ ప్రకారం..</p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;">ఓటీటీ ప్లాట్ఫామ్లు తాము ప్రసారం చేసే కంటెంట్ను వయసు ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజించాలి. అవి.. అన్ని వయసులవారూ చూడదగ్గవి (యు), ఏడేళ్లు, అంతకుమించి వయసున్నవారు చూడగలిగే యూఏ 7+ చిత్రాలు, యూఏ 13+, యూఏ 16+, పెద్దలే చూడాల్సిన ఏ కేటగిరీ. ఇంట్లో పిల్లలు చూడకుండా చేసే పేరెంటల్ లాక్ను, వయసు ధ్రువీకరించుకునే విధానాలను అందుబాటులోకి తేవాలి. </p><p style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; margin: 0px !important;"> ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ పబ్లిషర్లు (వివిధ సోర్సుల నుంచి సేకరించిన సమాచారానికి తమదైన వ్యాఖ్యానాన్ని జోడించి తమ యూట్యూబ్ చానల్ ద్వారానో, ఫేస్బుక్ ఖాతా ద్వారానో ఆన్లైన్లో పబ్లిష్ చేసేవారు) ఆ కంటెంట్ ఏ విభాగంలోకి వస్తుందో ముందే తెలపాలి. నిర్ణీత వయసులవారు మాత్రమే వాటిని చూడాలనే సూచన ముందుగానే చేయాలి. డిజిటల్ మీడియా పబ్లిషర్లు.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను పాటించాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. </p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-88101083426771818982021-02-26T09:10:00.000-08:002021-02-26T09:10:03.305-08:00 అలమటిస్తున్న 4 వేల మంది విద్యార్థులు<div style="text-align: left;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFprtdoc9oVgScZ6kR8YwOYYqiWVqFJWxe2hr9fFry8fYUam1rOsK0ZPl3Rlt3AG-TQgdq8iphWRIgLupMslgy-DbZgAcyrW2Q3nKb4ga2nKtM-JwpjjXAZkf7DeJlN6kFjS5g40lBByIO/s650/vishakha-25.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="463" data-original-width="650" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFprtdoc9oVgScZ6kR8YwOYYqiWVqFJWxe2hr9fFry8fYUam1rOsK0ZPl3Rlt3AG-TQgdq8iphWRIgLupMslgy-DbZgAcyrW2Q3nKb4ga2nKtM-JwpjjXAZkf7DeJlN6kFjS5g40lBByIO/s320/vishakha-25.JPG" width="320" /></a></div> <b style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi;">విశాఖపట్నం:</b><span style="font-family: Jyothi_ie, Jyothi;"> </span><span style="font-family: Jyothi_ie, Jyothi;">ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం దగ్గర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ కోసం వచ్చి చీకట్లో విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. భోజనం వసతి లేకపోవడంతో 4 వేల మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. </span><span style="font-family: Jyothi_ie, Jyothi;">పసి పిల్లలను తీసుకుని పలువురు విద్యార్థునులు కౌన్సిలింగ్కు వచ్చారు. ఇప్పటి వరకు సుమారు 500 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి తాగునీరు కూడా అందించని అధికారులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేసేవారు ముగ్గురే ఉన్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.<br /></span></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-61667573780762302032021-01-28T08:39:00.002-08:002021-01-28T08:39:27.844-08:00PADMASRI DR.ASHAVADI PRAKASHA RAO<p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyJnQMx6cHgNVlJoX9a2HxvOeHVNY4Cs61BblQkaJWP0SnwON6wPMuBIxqMXjLVoBu9sMREN3spJw5rg2QJ7XBtEZbgTQw4ReHExjDBF6ouVOJtCWC4mjcd-Fe03KotyzSnrbuzCCauiyj/s778/ashavadi-2021%253D28.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="677" data-original-width="778" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyJnQMx6cHgNVlJoX9a2HxvOeHVNY4Cs61BblQkaJWP0SnwON6wPMuBIxqMXjLVoBu9sMREN3spJw5rg2QJ7XBtEZbgTQw4ReHExjDBF6ouVOJtCWC4mjcd-Fe03KotyzSnrbuzCCauiyj/s320/ashavadi-2021%253D28.JPG" width="320" /></a></div><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg3DvKNIYkAp9Cw9T8kdn8BsCV0UrAxb-44e0HQQMmzhCn3KEzPYh4lqwDmmuBewOBr6fVtjWAPYw5C3aNVyx6p7u6AK8t-4BMLQaBcnIMTAJ_xstNe9b1E3cEtM_pbakaQ-k-pthdUqj2m/s1037/ashsvadi-2021.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1021" data-original-width="1037" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg3DvKNIYkAp9Cw9T8kdn8BsCV0UrAxb-44e0HQQMmzhCn3KEzPYh4lqwDmmuBewOBr6fVtjWAPYw5C3aNVyx6p7u6AK8t-4BMLQaBcnIMTAJ_xstNe9b1E3cEtM_pbakaQ-k-pthdUqj2m/s320/ashsvadi-2021.JPG" width="320" /></a></div><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgumUGnc76vEa3ggzVhyYrsKI4nXguMZVJ2QLGwoMZy-eKhGFiLp15H0vrtwjXW6WkHgZc1kuXs2UQCKebfim6E0W_nPjQ3Z3Smh3zzz-6VwkP712WL5U0l1b341UM3rjFgyWcnBr7GFW1s/s1194/ashavadi+abn-2021.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="943" data-original-width="1194" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgumUGnc76vEa3ggzVhyYrsKI4nXguMZVJ2QLGwoMZy-eKhGFiLp15H0vrtwjXW6WkHgZc1kuXs2UQCKebfim6E0W_nPjQ3Z3Smh3zzz-6VwkP712WL5U0l1b341UM3rjFgyWcnBr7GFW1s/s320/ashavadi+abn-2021.JPG" width="320" /></a></div><br /> <p></p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-19864575340378580742021-01-13T09:57:00.004-08:002021-01-13T09:57:49.977-08:00 ఎపి లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం అవాస్తవం : డిజిపి గౌతం సవాంగ్<div class="separator"><p style="margin-left: 1em; margin-right: 1em;"><img src="https://www.prajasakti.com/sites/default/files/2021-01/dgp%20copy_0.jpg" style="background-color: white; border: 0px; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px; height: auto; max-width: 100%; vertical-align: middle; width: 428.2px;" /></p></div><div class="body" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 18px; margin-top: 15px;"><div property="schema:text" style="box-sizing: border-box;"><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">అమరావతి :</span> ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అని ఎపి డిజిపి గౌతం సవాంగ్ ఐపిఎస్ స్పష్టం చేశారు. బుధవారం గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఎపి లో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలుపరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గత సెప్టెంబరు 5 వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను ఎపి లోని అన్ని ఆలయాలకు కల్పిస్తున్నామని డిజిపి గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతోపాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను, ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. గత సంవత్సరం (2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని డిజిపి ప్రకటించారు.</p><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"> కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. అలా ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నామని డిజిపి తెలిపారు. ఎపి రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతోపాటు సిట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంఒ అఫెండర్స్ ను ఇప్పటికే గుర్తించామని, వారందరినీ జియో మ్యాపింగ్ తో అనుసంధానం చేశామని చెప్పారు. వీరిపై నిరంతర నిఘాను కొనసాగించడంతోపాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్ ను ఓపెన్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎపి లో దేవాలయాలకు, పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రతను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కల్పిస్తోందని స్పష్టం చేశారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిజిపి కోరారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్ 100 కి, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని డిజిపి గౌతం సవాంగ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉంటుందని డిజిపి పేర్కొన్నారు.</p></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com32tag:blogger.com,1999:blog-6093289426582132245.post-63614676013579190362021-01-13T09:51:00.000-08:002021-01-13T09:51:06.172-08:00 మోడీ విధానాలు .. ప్రజాస్వామ్యానికి ముప్పు : జర్నలిస్ట్ పి. సాయినాథ్<div class="separator"><p style="margin-left: 1em; margin-right: 1em;"><img src="https://www.prajasakti.com/sites/default/files/2021-01/P%20Sainath_0_1.jpg" style="background-color: white; border: 0px; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 14px; height: auto; max-width: 100%; vertical-align: middle; width: 428.2px;" /></p></div><div class="body" style="background-color: white; box-sizing: border-box; color: #333333; font-family: Ramabhadra, Mallanna, sans-serif; font-size: 18px; margin-top: 15px;"><div property="schema:text" style="box-sizing: border-box;"><p class="text-align-justify" style="box-sizing: border-box; font-family: "Open Sans", sans-serif; font-size: 16px; line-height: 28px; margin: 5px 0px 10px; text-align: justify;"><span style="box-sizing: border-box; font-weight: 700;">చంఢీఘర్ :</span> ఒక్కో రంగాన్ని దశలవారీగా ధ్వసం చేసే మోడీ ప్రభుత్వ విధానంతో.. ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, రైతుల పోరాటం .. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధానంగా ఉధ్భవించిందని ప్రముఖ జర్నలిస్ట్ పి. సాయినాథ్ అన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీని అభినందించారు. ఈ ఉద్యమంతో దేశంలోని రైతులు తాము కోల్పోయిన ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. చంఢఘీర్లో రైతుల తిరుగుబాటుపై ఆయన ప్రసంగిస్తూ..రిపబ్లిక్ డే రోజున రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీ చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఇది ప్రజల పరేడ్ అని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలన్న మోడీ ప్రభుత్వ ప్రతి వ్యూహాన్ని ధైర్యంగా తిప్పి కొట్టారని అన్నారు. కార్పోరేట్ మీడియా, పోలీసుల దాడి ఇలా ప్రతి వ్యూహాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. ప్రధాని దూకుడుగా దాడి చేస్తున్నారని, ఒకదాని తర్వాత మరోకటి రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని అన్నారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రాంతీయ, మత, కులాల పరంగా విభజనలు సృష్టించడం (ఖలిస్తానీయులని), పోలీసులను ప్రయోగించడం, ఇందులో కొందరు మేథావులు కూడా పాల్గొన్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో ప్రయాణిస్తోందని అన్నారు. వలస పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలకు ఇప్పుడు రైతులు చేపడుతున్న ఉద్యమానికి చాలా పోలీకలు ఉన్నాయని, చరిత్ర విద్యార్థిని గనుక తాను స్పష్టం చేయగలుగుతున్నానని అన్నారు. అప్పుడు కూడా చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే అశాభావంతో ఉన్నానని అన్నారు. గత మూడేళ్లలో దేశంలోని మధ్యతరగతి ప్రజలు రైతుల పట్ల సానుభూతి చూపుతున్నారని, గతంలో అలా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా కార్పోరేట్ మీడియా తీరును కూడా ఎండగట్టారు. దేశంలోని అతిపెద్ద కార్పోరేట్ మీడియాలకు ఈ చట్టాలతో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని, దీంతో మీడియాలో అధిక భాగం వారి యజమానుల ప్రయోజనాలకు విరుద్ధమైన వైఖరిని తీసుకోలేరని అన్నారు.</p></div></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-26134595151735021742020-11-07T11:06:00.002-08:002020-11-07T11:06:18.360-08:00అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్<p><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWGuVVtkZPzx0F2uCgHG0wv_3P9TstqEzkZJ3aE9uOvPno9xo_KXLS1-sru53745k62WVLAgRY4eYL1baLieBo4bzf3TWc3xfgqKaNvbI8zhovNpq4PuDs1xObVKWNS08ZWDk7Qg6XzNv6/s650/Joe-Biden_1.jpg" imageanchor="1" style="clear: left; display: inline !important; float: left; margin-bottom: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" data-original-height="400" data-original-width="650" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWGuVVtkZPzx0F2uCgHG0wv_3P9TstqEzkZJ3aE9uOvPno9xo_KXLS1-sru53745k62WVLAgRY4eYL1baLieBo4bzf3TWc3xfgqKaNvbI8zhovNpq4PuDs1xObVKWNS08ZWDk7Qg6XzNv6/s320/Joe-Biden_1.jpg" width="320" /></a> <br /><br /><span style="background-color: white; color: #333333; font-family: Calibri, Mandali, Gautami, Pothana, sans-serif; font-size: 18px; text-align: justify;">అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి</span><span style="background-color: white; color: #333333; font-family: Calibri, Mandali, Gautami, Pothana, sans-serif; font-size: 18px; text-align: justify;"> </span><a href="https://www.sakshi.com/tags/joe-biden" style="background-attachment: initial; background-clip: initial; background-image: initial; background-origin: initial; background-position: 0px 0px; background-repeat: initial; background-size: initial; box-sizing: border-box; color: #333333; font-family: Calibri, Mandali, Gautami, Pothana, sans-serif; font-size: 18px; outline: 0px; text-align: justify; text-decoration-line: none; transition: text-shadow 0.5s ease-in-out 0s;" target="_blank"><span style="box-sizing: border-box; color: #3498db;"><span style="box-sizing: border-box; font-weight: 700;">జో బైడెన్</span></span></a><span style="background-color: white; color: #333333; font-family: Calibri, Mandali, Gautami, Pothana, sans-serif; font-size: 18px; text-align: justify;"> </span><span style="background-color: white; color: #333333; font-family: Calibri, Mandali, Gautami, Pothana, sans-serif; font-size: 18px; text-align: justify;">గెలుపొందారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అక్కడ జో బైడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. జో బైడెన్ కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారీటికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ దాటేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. </span><span style="background-color: white; color: #333333; font-family: Calibri, Mandali, Gautami, Pothana, sans-serif; font-size: 18px; text-align: justify;">కాగా నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. కాగా అమెరికాకు ఎన్నికైన తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.</span></p>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6093289426582132245.post-37879205915663638542020-11-07T10:46:00.000-08:002020-11-07T10:46:18.105-08:00మధ్యతరగతి జో ముచ్చటగా మూడోస్సారి..<p> <b style="box-sizing: border-box; color: blue;">అధ్యక్ష పదవికి గతంలోనూ బైడెన్ యత్నాలు </b><b style="box-sizing: border-box; color: blue;">1987లో, 2008లో నిలబడేందుకు సిద్ధం </b><b style="box-sizing: border-box; color: blue;">పార్టీలో మద్దతు కూడగట్టలేక ఉపసంహరణ</b></p><ul style="box-sizing: border-box; list-style: none; margin: 0px; padding: 0px;"><li style="box-sizing: border-box; list-style-image: initial; list-style-position: initial; list-style-type: circle !important; margin-bottom: 10px !important; margin-left: 30px !important; margin-right: 0px; margin-top: 0px; padding: 0px;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiADf1WDPXjxcSnadsUgP4rTAmxoccplnlev92xrrF0HMdJmALsQLmILtxnb6eRDijyXThGeSU8XHLtlNC_Ds7dZtHsWybIOrbCApKqk5G19OsrvEQDNg1zONKqH9WQEr00Qgh95I26lvrM/s650/biden-07.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="589" data-original-width="650" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiADf1WDPXjxcSnadsUgP4rTAmxoccplnlev92xrrF0HMdJmALsQLmILtxnb6eRDijyXThGeSU8XHLtlNC_Ds7dZtHsWybIOrbCApKqk5G19OsrvEQDNg1zONKqH9WQEr00Qgh95I26lvrM/s320/biden-07.jpg" width="320" /></a></div><b style="box-sizing: border-box; color: blue;">మూడో ప్రయత్నంలో దక్కిన అభ్యర్థిత్వం</b></li></ul><p style="box-sizing: border-box; margin: 0px !important;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; margin: 0px !important;">జోబైడెన్ (77).. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో సై అంటే సై అన్నట్టుగా ఢీకొని, గెలుపు దిశగా దూసుకుపోతున్న బలమైన ప్రత్యర్థి. 2016లో హిల్లరీ క్లింటన్ ఇచ్చిన పోటీ కంటే బలమైన పోటీతో బెంబేలెత్తించిన బైడెన్ను అమెరికా రాజకీయాల్లో ముద్దుగా ‘మిడిల్ క్లాస్ జో’ అని పిలుచుకుంటారు. బరాక్ ఒబామా బృందంలో సభ్యుడిగా, ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి మాత్రమే మనలో చాలా మందికి తెలుసు. కానీ.. జో బైడెన్ మూడున్నర దశాబ్దాల కల అధ్యక్ష పదవి. ఈ పదవిని అధిష్ఠించేందుకు ఆయన 1988లో ప్రయత్నించారు. కానీ, పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మళ్లీ 2008లో కూడా ప్రయత్నించారు. అప్పుడూ ఒబామా, హిల్లరీ కరిష్మా ముందు తేలిపోయారు. ముచ్చటగా మూడోసారి.. అంటే ఇప్పుడు మాత్రం డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి నామినేట్ కావడంలో విజయం సాధించారు. 1942 నవంబరు 20న.. పెన్సిల్వేనియాలోని స్ర్కాన్టన్లో బైడెన్ జన్మించారు. బైడెన్ చిన్నప్పుడే ఆయన కుటుంబం డెలవెర్లో స్థిరపడింది. నిజానికి వారిది సంపన్న కుటుంబమేగానీ.. బైడెన్ పుట్టే సమయానికి ఆయన తండ్రి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. దీంతో చాలాకాలంపాటు బైడెన్ కుటుంబం పేదరికంలో గడిపింది. తర్వాత కొద్దిగా కోలుకుని మధ్యతరగతి జీవనం గడిపింది. బైడెన్లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికం. ఈ క్రమంలోనే స్కూల్ లీడర్గా వ్యవహరించారు. 1965లో చరిత్ర, రాజనీతి శాస్త్రంలో బీఏ చేశారు. బైడెన్కు మొదట్లో నత్తి ఉండేది. కానీ, అద్దం ముందు నుంచి కవితలు చదవడం ద్వారా ప్రయత్నపూర్వకంగా దానిపై ఆయన విజయం సాధించారు. <br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; margin: 0px !important;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; margin: 0px !important;">1966లో ఆయనకు తొలిసారి వివాహమైంది. ఆయన మొదటి భార్య నీలియా హంటర్. వారికి ముగ్గురు పిల్లలు. 1968లో బైడెన్ న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఒక న్యాయసంస్థలో పనిచేశారు. అప్పట్లో ఆయనకు డెలవేర్ గవర్నర్ అయిన డెమొక్రాటిక్ నాయకుడి విధానాలపై ఆగ్రహం ఉండేది. రిపబ్లికన్ అభ్యర్థి భావాలు నచ్చేవి. అయితే, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రిచర్డ్ నిక్సన్ అంటే ఇష్టం ఉండేది కాదు. 1969లో ఆయన.. డెమొక్రాటిక్ పార్టీలో చురుగ్గా వ్యవహరించే ఒక వ్యక్తి నిర్వహించే న్యాయసంస్థలో పనిచేశారు. అక్కడ ఉండగానే ఆయన తన భావాలు మార్చుకొని డెమొక్రాట్గా తన పేరు నమోదు చేసుకున్నారు. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తొలుత స్థానిక కౌంటీ కౌన్సిల్కు ఎన్నికైన బైడెన్.. 1972లో జూనియర్ సెనెటర్గా ఎన్నికయ్యారు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులు ఇంటింటికీ తిరగి కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. ఆయన ప్రత్యర్థి భారీగా ప్రచారం చేశారు. అయినా బైడెనే గెలిచారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది ఆయన భార్య, ఏడాది వయసున్న కుమార్తె ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమారులిద్దరూ ఆస్పత్రిలో ఉండగా.. సెనెట్ సభ్యుడుగా బైడెన్ ఆస్పత్రిలోనే ప్రమాణ స్వీకారం చేశారు.</p><p style="box-sizing: border-box; margin: 0px !important;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; margin: 0px !important;">1977లో ఆయన జిల్ ట్రేసీ జాకబ్స్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. 30 ఏళ్ల వయసుకే సెనెటర్గా ఎన్నికైన బైడెన్ చురుగ్గా పనిచేయడంతో టైమ్ మేగజైన్ 1974లో ఆయన్ను ‘200 ఫేసెస్ ఫర్ ద ఫ్యూచర్’లో ఒకరిగా పేర్కొంది. సెనెటర్గా ఆయన వినియోగదారుల హక్కులు, పర్యావరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించారు. సెనెట్కు సంబంధించిన పలు కమిటీలకు నాయకత్వం వహించారు.రాజకీయంగా ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ వచ్చారు. 1988 ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఆశపడినా.. ఆయన ప్రచార బృందం చేసిన కొన్ని తప్పుల వలన, ఆయన గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల అభ్యర్థిత్వం దక్కలేదు. మళ్లీ 2007లో కూడా ప్రయత్నించి 2008 జనవరిలో ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ ఏడాది డెమొక్రాట్ అభ్యర్థిగా నామినేట్ అయిన ఒబామా.. బైడెన్ సమర్థతను గుర్తించి, ఆయనను పిలిచి మరీ ఉపాధ్యక్షుడిగా చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఒబామా తీసుకున్న పలు నిర్ణయాల్లో బైడెన్ కీలకపాత్ర పోషించారు. </p><p style="box-sizing: border-box; margin: 0px !important;"><br style="box-sizing: border-box;" /></p><p style="box-sizing: border-box; margin: 0px !important;"><span style="box-sizing: border-box; color: red; font-weight: bold;">బైడెన్.. హిలాల్ ఇ పాకిస్థాన్</span></p><p style="box-sizing: border-box; margin: 0px !important;">ప్రచార సమయంలో ట్రంప్తో వాగ్యుద్ధం జరుగుతున్నప్పుడు బైడెన్ ‘ఇన్షా అల్లా’ అని వ్యాఖ్యానించడంతో ప్రపంచమంతా ఒక్కసారి ఆయన వైపు చూసింది. ట్రంప్ పన్నుల చెల్లింపు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆ రికార్డులన్నీ ఎప్పుడు చూపిస్తారంటూ వ్యంగ్యంగా ఆయన ఆ మాట అన్నారు. అసలే ఇస్లామోఫోబియాతో భయపడే చాలా మంది అమెరికన్లు ఆ వ్యాఖ్యతో సందేహంలో పడ్డారు. ఇన్షా అల్లా అంటే అర్థం ఏమిటో గూగుల్లో వెతికారు. అయితే.. చాలామందికి తెలియని విషయమేంటంటే 2008లో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ బైడెన్కు హిలాల్ ఇ పాకిస్థాన్’ అవార్డును ప్రకటించారు. ఆ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అది. రిపబ్లికన్ సెనెటర్ రిచర్డ్ లుగర్తో కలిపి సంయుక్తంగా ఆ పురస్కారాన్ని ఇచ్చారు. వారిద్దరూ కలిసి పాకిస్థాన్కు సైనికేతర వినియోగం నిమిత్తం 150కోట్ల డాలర్ల సాయం అందించే ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం. <br style="box-sizing: border-box;" /></p><br /><div style="box-sizing: border-box;"><br style="background-color: white; box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; font-size: 24px;" /></div>panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.com0