10, డిసెంబర్ 2010, శుక్రవారం

అవినీతిని ఎవరు నిర్మూలించాలి?

అవినీతిని ఎవరు నిర్మూలించాలంటే చెప్పడం సులభం. యాంటికరప్షన్‌ బ్యూరో (ఎసిబి) అని చెబుతాం. లేదా ఆయా శాఖలలోని అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యులు కాని అది సాధ్యమేనా!? ఎసిబి, ఇతర పోలీసు, రక్షణ శాఖలన్నీ ఎవరి ఆదీనంలో ఉంటాయి. చట్టసభల చేతిలో ఉంటాయి. అంటే పార్లమెంటు, శాషన సభ , వీటికింద అధికారులు, న్యాయస్థానాలు, పోర్త్‌ ఎస్టేట్‌గా భావించే మీడియా ఇవన్ని అవినీతిని అదుపు చేస్తున్నాయా? చేస్తే ఇంతగా అవినీతి ఎందుకు పెరిగి పోతుంది. పేదోడు పేదోడవుతున్నాడు. ధనవంతుడు ధనవంతుడవుతున్నాడు. మనది ప్రజాస్వామ్య దేశం అంటున్నాం. కాబట్టి ప్రజలు ప్రజాప్రతినధులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని చెబుతున్నాం. కాని నిజాయితీగా ఓటు వేస్తున్నామా? వేయనిస్తున్నారా? అనేది కూడా ప్రశ్నే . ఓట్లను కొంటున్నారు. డబ్బు ఎవ్వడు ఎక్కువ ఖర్చు చేస్తే వాడికి ఓట్లు పడుతున్నాయి. కొన్ని చోట్ల దౌర్జన్యంగా బూత్‌ క్యాప్చర్‌ చేసి ఓట్లు వేసుకుంటున్నారు. ఇలా గెలుపొందిన వారు చట్టసభల్లో ప్రజలగురించి ఎంతవరకు మాట్లాడి న్యాయం చేస్తున్నారు. అస్సలు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా?. పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వారు వారి స్వప్రయోజనాలగురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నారు. అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఐపిఎల్‌ కుంభకోణంలో శశిథరూర్‌, 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం, జలయజ్ఞం, కార్గిల్‌ అమరవీరులకు ఆదర్ష్‌ అపార్టు మెంట్ల నిర్మాణంలో , కర్ణాటక ఆంధ్రసరిహద్దులో ఇనుపఖనిజం కుంభకోణం, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డూరప్ప భూముల కుంభకోణం ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రజలను మోసం చేస్తున్నారు. న్యాయస్థానాలకు తప్పుడు సాక్షాలు చూపి తప్పించుకు తిరుగుతున్నారు. శిక్ష పడేవాళ్లు నూటికో కోటికో ఒకరు ఉంటున్నారు. మీడియాలో కూడా పెట్టుబడిదారులు వచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీడియాలో కూడా కార్పొరేటీకరణ పెరిగింది. ఇందులో కొందరు మాత్రమే నిష్పక్ష పాతంగా ఉన్నారు. ఎవరు ఏంటనేది మనం నిత్యం చూస్తున్నాం. కొన్ని పత్రికలు ప్రజల పక్షాన అన్ని రాస్తారు. కాని కారణం ఎవరు. ఎవరిని శిక్షించాలనేది మాత్రం చెప్పరు. మరి కీలకమైన రాజకీయ పార్టీలు చూస్తే ఈ దేశానికి సోషలిజం తెస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జవహర్‌లాల్‌నెహ్రూ చెప్పారు. కాని ఆపార్టీ పరిస్థితి మనకు అర్థమైంది. కమ్యూనిస్టు పార్టీ ఆపార్టీ సిద్దాంతం మాత్రం బాగుంది. వ్యక్తి ఆస్తి ఉండకూడదు. అందరికీ సమానమే అని చెప్పారు. చైనా, లాటిన్‌ అమెరికా దేశాల్లో కమ్యూ నిస్టు పార్టీ అధికారంలో ఉన్న సంగతి మనకు తెలుసు. రష్యాలో సోషలిజం పడిపోయాక కమ్యూనిస్టుపార్టీలపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయిలో విశ్వాసం రాలేదు. ఆతరువాత మనదేశంలో పెట్టుబడిదారులది పైచేయి కావడం. ప్రజలు కమ్యూనిజం వైపు వెళ్లకుండా జాతుల, మతాల, ప్రాంతాల, కులాల వారీగా విడగొడుతున్నారు. మనం చూస్తున్నాం. బిజెపి మతంపేరుతో వచ్చింది. అధికారం చేతికొచ్చాక జనాన్ని మోసం చేసింది. అభాసుపాలయ్యింది. జనతాదల్‌ వచ్చింది. అదికూడా ముక్కలుగా విడిపోయింది. అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చాక దేశంలో అవినీతి మరింత పెరిగిపోయింది.
మరిప్పుడేం చేయ్యాలి. ప్రధానంగా రాజకీయాలు అంటే సేవాభావంతో ఉండాలి. కమ్యూనిస్టులు మినహా అన్ని పార్టీలు వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు. కోటీశ్వరులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు తమ పూర్తి ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలి. పదవికాలం పూర్తయ్యాక తమ ఆస్తిని వినియోగించుకోవాలి. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులన్నీ పద్దతి ప్రకారం చెల్లించాలి. పేదల శ్రమదోపిడీని అరికట్టాలి. అదే తరహాలో గజిటెడ్‌ ర్యాంకు అధికారులు కూడా తమ ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలి. స్వశ్చంద సంస్థలు, ప్రజలకు సేవచేస్తామని వచ్చేవారందరూ అలానే చేయాలి. అలా ముందుకు వచ్చిన వారందరి కనీస అవసరాలు ప్రభుత్వం తీర్చాలి.. వ్యక్తిగత వ్యాపారాలు చేసేవారంతా ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం పన్నులు చెల్లించాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారి తరుపున ప్రభుత్వమే ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గాని, ఆయన బందువులు గాని ఎలాంటి ప్రచారం, ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రజలు స్వశ్చందంగా ఓటు చేయడానికి కావల్సిన సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి. అవినీతిని అరికట్టేందుకు సులభమవుతుందని నాఅభిప్రాయం.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రభుత్వాన్ని నడిపేదే దగాకోరులు అయినపుడు అదెలా సాధ్యం ? only GOD can save us

panuganti చెప్పారు...

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధ్యమేనా

అజ్ఞాత చెప్పారు...

"నీతి"

Unknown చెప్పారు...

avinnetini parulaku urab contris lo laga bahiranga vuri veyali. kani mana chattallo ni losugulu.. judges avineeti paruluga marutunti enka india nu kapadedi evaru..

panuganti చెప్పారు...

ప్రజలు, పాలకులు అనుకుంటే అవినీతిని అరికట్ట వచ్ఛు.