19, జులై 2015, ఆదివారం

మరో స్వాతంత్య్రోద్యమం సాగాలి


                                                              సోషలిజంతోనే సమస్యు దూరం
                                   సీనియర్‌ కమ్యూనిస్టు, అమరవీరు కుటుంబ సభ్యు సమ్మేళనంలో మధు
             నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యు ప్రజను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు.  2015 జులై 19న ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాులో ‘అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకు కుటుంబ సభ్యు సమ్మేళనం’ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు ఎం.ఇంతియాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్‌ కమ్యూనిస్టు నాయకు, వారి కుటుంబ సభ్యు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 80 ఏళ్లపైబడి ఉన్న సీనియర్‌ నాయకు అనేక మంది ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాను పంచుకున్నారు. పార్టీ నిర్మాణం, ప్రజాసమస్య పరిష్కారం కోసం ఎటువంటి ఇబ్బందు పడ్డారో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, స్వాతంత్య్రోద్యమ కాం నుంచే అనేక మంది కమ్యూనిస్టు నాయకు పోరాటాు చేపట్టారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తరిమెనాగిరెడ్డి, ఐదుక్లు సదాశివన్‌, నీం రాజశేఖర్‌రెడ్డి, వికె.ఆదినారాయణరెడ్డి వంటి ఉద్దండున్నారని చెప్పారు. వారి ఆశయాను, ఆదర్శాను, త్యాగాను మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరాయిదేశ పానకు వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమం సాగిందని చెప్పారు. ఆనాటి సమస్యలే నేటికీ ప్రజను పట్టిపీడిస్తున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్రోద్యమానికి ప్రజను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న కమ్యూనిస్టు పార్టీపై ఉందన్నారు. ఆ దిశగా పయనించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐ సీనియర్‌ నాయకు ఎంవి రమణ, సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకు పెద్దన్న, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్‌, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకు అమర్‌నాథ్‌  పాల్గొన్నారు.
                                                    ఇసుక ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాకివ్వాలి
             ఇసుక ఆదాయంలో 25 శాతాన్ని డ్వాక్రా సంఘాకు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాటను తక్షణం అము చేయాని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. అనంతపురం సిపిఎం జిల్లా కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాకు చేస్తామన్న రుణమాఫీ కూడా అము జరగలేదని చెప్పారు. డ్వాక్రా మహిళ సమస్యపై ఈనె 31న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళను చేపట్టనున్నట్లు వివరించారు. మున్సిపల్‌ కార్మికు సమస్యపై ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాన్న దానిపై సోమవారం విజయవాడలో అఖిపక్ష పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాయసీమ అంతంటా దుర్భిక్ష పరిస్థితులే నెకున్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం తక్షణం అఖిపక్ష సమావేశాన్ని నిర్వహించాని డిమాండ్‌ చేశారు.

12, జులై 2015, ఆదివారం

ఆకలి,దారిద్య్రంలో ఆఫ్రికాను మించిన భారతదేశం..

నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దేశాలలో భారత్‌ ఒకటని నిరంతరం గుర్తు చేస్తుంటారు.అయితే ప్రపంచంలోనే అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతంగా భావిస్తున్నఆఫ్రికాను కూడా మించి భారతదేశంలోని దారిద్య్రం, ఆకలి ఉన్నదనే విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. దేశంలోని దారిద్య్రం అధికారికంగా వర్గీకరించిన 'అతి తక్కువ అభివృద్ధిచెందిన దేశాలను' మించిపోయింది.ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవటం, దాంతో మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కోనుగోలు చేయవలసిరావటం వల్లనే ప్రజల ఆహార వినియోగం తగ్గిందని తెలుసుకోవాలి.ఆహార ధాన్యాల వినియోగం తగ్గితే ఆకలి పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న ఆకలి దారిద్య్రం తీవ్రతకు సంకేతం. విద్య, ఆరోగ్య సేవలను ప్రయివేటీకరించటమే దీనికి కారణం.

2, జులై 2015, గురువారం

రాజకీయ దురహంకారం

  మనం ఏ సంస్కృతిలో జీవి స్తున్నాం? ఏ అహంకారాల ఆభి జాత్యాల జాతరలో కొట్టుకుపోతు న్నాం? మనం చూస్తున్నదంతా నిజ మేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్‌ గేర్‌ లో నడుస్తు న్నామా? రేవంత్‌ మహాశయుడు జైలు నుంచి బెయిల్‌ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమక పడతాం. జైలు నుంచి మన నాయకుల పున రుత్థానం అదో అండపిండ బ్రహ్మాండ మహోత్స వంగా మారిపోయింది.  పునరపి జైలు..పునరపి బెయిలు..ఇది అవినీతి భారత పొలిటికల్‌ స్టయిలు అనుకోవా లేమో. జైలుకెళ్ళే ముందు..బైటకొచ్చిన తర్వాత మీసాలు ఊడిపోయేలా మెలే యడాలు.. తొడలు వాచిపోయేలా కొట్టుకోవడాలు..జబ్బలు బొబ్బలెక్కేలా చరుచుకోవడాలు అన్నీ మన ఘనత వహించిన ప్రజాస్వామ్య ప్రాణచిహ్నా లుగా మారిపోయిన తర్వాత ఇదంతా సహజమే అని సరిపెట్టుకోవాలా? ఎంత సరిపెట్టు కుందామన్నా కొన్ని సందర్భాలు మనసును తవ్వితోడక మానవు. రేవంత్‌ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్ళాడో..ఏ కేసులో ఎలా ఇరుక్కున్నాడో..ఎలా రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డాడో దేశమంతా కళ్ళప్పగించి చూసింది..చెవులప్పగించి విన్నది. ఆ యువ డైనమిక్‌ నేత మీద అభిమానం వున్న వారు  కూడా పాపం ఇరుక్కుపోయాడు.. శిక్ష తప్పదేమో అని పెదవులు విరిచారు. కాని ఇదంతా ప్రత్యర్థుల రాజకీయ కుట్రగా రేవంత్‌, ఆయన అనుయా యులు..ఆయన పార్టీ అగ్ర నేతలు చిత్రీకరించిన కలర్‌ ఫుల్‌ సినిమాలు డ్రామాలు చాలా చూశాం. పోనీ ఇదంతా శత్రపక్షాల పద్మవ్యూహాల ఫలితమే అని అనుకున్నా.. నిర్దోషిగా నిరూపించుకుని బయటపడినప్పుడే రేవంత్‌ గాని అతని సమర్థులు కాని ఇంత పెద్ద ఎత్తున పండగ చేసుకోడానికి హక్కుదారులవుతారు. అప్పుడు ఆయన్ని అభిమన్యుడి కంటె గొప్పవాడిగా అందరూ అభివర్ణిస్తారు. ఇది చాలా సింపుల్‌ లాజిక్కు. చిన్నపిల్లలు  కూడా చేయగల ఆర్గ్యుమెంటు. కాని మన యంగ్‌ డాషింగ్‌ లీడర్‌  ప్రస్తుత పొలిటికల్‌ సినిమాలో తానే హీరో అనుకున్నాడు. తొడకొట్టడం మీసాలు తిప్పడం పొలిటికల్‌ హీరోయిజం అనుకున్నాడు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ఇలాంటి అభినయాలు అనివార్యమని ఆయన అనుకోవచ్చు. కాని ఆయన జైలు నుంచి విడుదలై రావడాన్ని ఆ పార్టీ ఒక మహాసభ ర్యాలీగా నిర్వహించడం..వేలాది కార్యకర్తల సమూహాల సంబరాల నృత్యాల అరుపుల కేరింతల ఈలల గోలల మెగా ఈవెంట్‌ గా జరపడం మాత్రం ఆలోచనాపరులను కలవరపెట్టక మానదు. ఏ విలువల వైపు మనం పయనిస్తున్నాం? రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తిత్వానికి కిరీటాలు తొడుగుతున్నాం? రానున్నతరాలకు ఎలాంటి సందేశాలను అందిస్తున్నాం? ప్రశ్నలు ప్రశ్నలు. అనేకమనేకంగా ప్రశ్నలు. జైల్లోకి ఆరోపణల మీదే వెళతారు. దోషిగా నిరూపించడానికి విచారణ అవసరం. దానికి సమయం పడుతుంది. ఈ లోగా బెయిలివ్వడం చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ. బెయిలు నిర్దోషిత్వానికి ముందు మాట కాదు. ఇది కనీస జ్ఞానం వున్నవారికి కూడా తెలిసిన విషయమే. మరి మన నాయకులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు. నెల్సన్‌ మండేలాలు..మహాత్మా గాంధీలు ఈ కాలం నాయకులకు ఎందులో ఆదర్శంగా నిలుస్తున్నారు? కేవలం వారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు జనం పట్టిన హారతలను అందుకోవడంలోనే ఆ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారా? గతంలో జగన్‌ జైలు నుంచి బెయిలు మీద బయటకొచ్చినప్పుడు కూడా భూనభోంతరాళాలు బద్దలైన సందర్భాలు చూశాం. బహుశా ఒకరి తర్వాత ఒకరు..ఒకరికి మరొకరు ఈ తరం నేతలు వచ్చేతరం నేతలకు గొప్ప పాఠాలుగా నిలుస్తున్నారు కాబోలు.
         ఇలాంటి దుర్మార్గమైన సంప్రదాయాలకు ప్రజలను క్రమక్రమంగా మన నాయకులు అలవాటు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. తిమ్మిని బమ్మి..బమ్మిని తిమ్మి చేయడమే పాలిటిక్స్‌ అని నూరిపోస్తున్నారు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యంలో ఒక విడదీయరాని సత్యమని చాటి చెప్తున్నారు. అది ఏ స్థాయిలో ఎలా జరిగినా అంగీకారమే అని  ప్రజలూ నాయకులూ అంతా ఒక ఒప్పందానికి వచ్చినట్టు తేల్చిపారేస్తున్నారు. చట్టాలుంటాయి..న్యాయస్థానాలుంటాయి..తప్పు తప్పు అంటాయి..కాని ఇదిగో ఇలా చేయకుంటే రాజకీయాల్లో బతికి బట్టకట్టడం సాధ్యం కాదని మాత్రం నాయకులు నొక్కివక్కాణిస్తున్నారు. అదే సబబు కాబోలని..మరో మార్గం లేదని అందరూ తలొంచుకుని ఒప్పుకునే దౌర్భాగ్యపరిస్థితిని తీసుకొస్తున్నారు.  ఈ నీతిలో   పాలకవర్గ పార్టీలన్నీ ఒక్క గీత కూడా దాటకుండా ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి ఉదంతం మనకు బోధపరుస్తున్న విషయాలు చాలా వున్నాయి.  ఎందులో తగ్గినా అహంకారం..ఆభిజాత్యంలో మాత్రం ఒక్క ఇంచి కూడా తొణక్కూడదనేది బూర్జువాపార్టీల నాయకులు పాటిస్తున్న ధర్మసూత్రంగా అర్థమవుతోంది. రేవంత్‌ రెడ్డి నామినేటెడ్‌ ఎమ్మెల్యేకి డబ్బులిస్తూ పట్టుబడినట్టు బయటపడిన వీడియోలో కొన్ని విషయాలు పెద్దగా చర్చకు రాలేదు. తెలంగాణలో రెడ్డి కులం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందులో ముఖ్యమైనవి. భవిష్యత్తులో తెలంగాణలో తమ పార్టీకే అవకాశాలున్నాయని..అలా జరిగితే తమ కులం ప్రతినిధిగా తానే ఏకైక నాయకుడనని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తనకే ఎక్కువగా వున్నాయని ఆయన చెప్పినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇదే నిజమైతే మన నాయకుల్లో పైకి కనపడని  కులాహంకారం ఎంత గడ్డ కట్టుకుని వుందో మనకు తెలియజెప్పి ఆ వీడియో పుణ్యం కట్టుకుందని అనుకోవాలి.
             వీరి హావభావాలు..గర్వాతిశయాలు, చేసింది తప్పో ఒప్పో సంబంధం లేకుండా తాము చెప్పిందే వేదమని, చేసిందే న్యాయమని దబాయించే లక్షణాలు అన్నీ ఏ భూస్వామ్య యుగావశేషాలో మనం ఊహించుకోగలం. జైలుకు పోవడం..బెయిలుపై రావడం అంతా ఒక ఘనకార్యంగా మనల్ని అంగీకరించమని మనల్ని బలవంతం చేయడంలో ఆ అహంభావమే కనిపిస్తుంది. బహిరంగంగా నేరం చేస్తూ పట్టుబడినా రాజకీయాల్లో రాజకీయాలే వుంటాయి కాని  నేరాలంటూ వుండవని మనల్ని ఒప్పుకుని తీరాలని మీసాలు మెలేస్తున్నారు. మరి అది ఏ  ఆభిజాత్యానికి సంకేతంగా భావించాలి? ఆఖరికి హీరో అంటే ఇలా వుంటాడని..డైనమిక్‌ అంటే ఇలా మాట్లాడతాడని..భావి మహానేత అంటే ఇలా వ్యవహరిస్తాడని ఒక కంక్లూజన్‌కి రావడం తప్పదని తీర్మానించేయడం వెనక కూడా ఇదే భావజాలం తొణికసలాడుతోంది. కరడుగట్టిన కులాహంకారానికి ఇది శిఖరప్రాయమైన ఉదాహరణగా గుర్తించాలి. దేశంలో రాజకీయాలు ఛివరకు ఏ మలుపు తీసుకుంటున్నాయో అర్థం చేసుకోవాలి. లాలూ ప్రసాద్‌ లు కావచ్చు. పప్పూ యాదవ్‌ లు కావచ్చు..జగన్‌ లు కావచ్చు..రేవంత్‌ లు కావచ్చు  ఎవరైనా సరే బెయిలొస్తే చాలు వాడు హీరోనే అన్న సందేశాలు స్థిరపడుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఎదిగేంత వరకూ వారి పట్ల ప్రజలకు విశ్వాసం ప్రబలి దేశం పునాదులు కదిలి ఒక నవీన యుగ మహోదయం జరిగే వరకూ ఇలాంటివి ఇంకెన్నిచూడాలో మరి. చూద్దాం. ఉదయం కోసం చీకటి రాత్రిని మోయాల్సిందే కదా.
                                                                                  ` డా. ప్రసాదమూర్తి