20, నవంబర్ 2015, శుక్రవారం

నితీష్‌కుమార్‌ ప్రమాణస్వీకారం

            
             నితీష్‌ కేబినెట్‌లో మంత్రిలుగా ప్రమాణం చేసిన లాలు పెద్దకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రమాణస్వీకార సమయంలో కొన్ని పదాలు సరిగ్గాపలకలేక పోయారు. అపేక్షితను ఉపేక్షితగా పలికారు. దీంతో గవర్నర్‌ రామ్‌నాథ్‌  లాలు తనయుడితో రెండోసారి ప్రమాణం చేయించారు. రెండోసారికూడా తేజ్‌ ప్రతాప్‌ మళ్లీ తప్పుగా చదివారు. లాభం లేదనుకుని మూడోసారి మాత్రం చెప్పకుండా గవర్నర్‌ ప్రమాణస్వీకారం ముగించారు. 

                                               పార్టీ వారీగా మంత్రి పదవులు పొందినవారు
జెడియు: రాజీవ్‌ రంజన్‌సింగ్‌ లాలెన్‌, బిజెందర్‌ప్రసాద్‌ యాదవ్‌, శ్రవన్‌కుమార్‌, జయ్‌కుమార్‌ సింగ్‌, మహేశ్వర్‌హజారి, కృష్ణనందన్‌ప్రసాద్‌వర్మ, సంతోష్‌నిరా, ఖుర్షిద్‌నందన్‌ ఫిరోజ్‌ అహ్మద్‌, శైలేష్‌కుమార్‌, కుమారిమంజువర్మ, మదన్‌సాహ్ని, కపిల్దేవ్‌కామత్‌
ఆర్‌జెడి: తేజశ్వియాదవ్‌, తేజ్‌ప్రతాప్‌యాదవ్‌, అబ్దుల్‌బారి సిద్ధిఖ్‌, అబ్ధుల్‌గఫూర్‌,  విజయ్‌ప్రకాశ్‌,  చంద్రికారాజ్‌, అలోక్‌కుమార్‌మెహతా, రామ్‌విచార్‌రాయ్‌, శోచందర్‌రామ్‌, మునేశ్వర్‌చౌదరి, చంద్రశేఖర్‌, అనితాదేవి,
కాంగ్రెస్‌ : అశోక్‌చౌదరి, మదన్‌మోహన్‌జా, అబ్దుల్‌జలీల్‌ మస్తాన్‌, అవదేశ్‌కుమార్‌ సింగ్‌.

  అంగరంగవైభవంగా బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. 2015 నవంబర్‌ 20న శుక్రవారం బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీమైదానంలో నితీష్‌కుమార్‌ సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మహోత్సవానికి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ,  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తొమ్మిది రాష్ట్రా ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్‌ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో  జెడియు 12, ఆర్‌జెడి 12, కాంగ్రెస్‌ నలుగురికి మంత్రి పదవులు దక్కాయి.  ఎన్నికల్లో మహాకూటమి మొత్తం 243 అసెంబ్లీస్థానాల్లో 178 శాసనసభస్థానాలను సొంతం చేసుకుంది. అందులో ఆర్‌జెడి 80, జెడియు 71, కాంగ్రెస్‌ 27 సీట్లు గెలుచుకున్నాయి.

10, నవంబర్ 2015, మంగళవారం

అంబేద్కర్‌ దార్శనికత పై చర్చించాలి

                                                             
   సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌
                        న్యూఢల్లీి : ఈ నె 26 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మొదటి రెండు రోజును అంటే 26, 27 తేదీలను డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ 125వ జయంతిని పాటించేందుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు  మీడియా వార్తలు తెలుపుతున్నాయి. కానీ ఈ రెండు రోజును పూర్తి చేయని ఎజెండాలను పూర్తి చేయడానికి, సామాజిక న్యాయంపై అంబేద్కర్‌ దార్శనికతను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కోరింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు రంగానికి రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతమున్న రాజ్యాంగ నిబంధనను విస్తరించేందుకు చట్టాన్ని చేయడం, అలాగే లోక్‌సభలో ఆమోదించినా రాజ్యసభలో పెండిరగ్‌లో వున్న ఎస్‌సి ఎస్‌టి అత్యాచారా నిరోధక బిల్లును పరిష్కరించడం వంటి చర్యను ఈ రెండు రోజుల్లో చేపట్టాలని పొలిట్‌బ్యూరో కోరింది. ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికకు చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించే బిల్లును కూడా ఆమోదించాలని, ఎస్‌సి, ఎస్‌టి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు జరగాలని కోరింది. ఇదేమీ ప్రత్యేక సమావేశం కాకపోయినప్పటికీ, భారత సమాజంలో సిగ్గుచేటైన విధంగా పరిణమించిన ‘పుట్టుక, వారసత్వం ప్రాతిపదికన అసమానత’ను నిర్మూలించడానికి సమగ్రమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అత్యావశ్యకత వుందని దాని కోసం ఈ రెండు రోజులు కేటాయించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. అంబేద్కర్‌ దార్శనికతను ముందుకు తీసుకెళ్ళడానికి భారత పార్లమెంట్‌ చేయాల్సిన కనీసచర్య ఇదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అంబేద్కర్‌ జయంతిని జరుపుకు నేందుకు, ఆయన్ని స్మరించేందుకు ఇది చక్కటి మార్గమని తెలిపింది.

9, నవంబర్ 2015, సోమవారం

సూకి ఘన విజయం

                                                                
  ఓటమిని అంగీకరించిన పాలక పక్షం
                      యాంగాన్‌/హింతాడా(మయన్మార్‌): మయన్మార్‌లో ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోబెల్‌ శాంతిబహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) 95 శాతం స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో విజయపథంలో దూసుకు పోతోంది.  కడపటి సమాచారం అందే సమయానికి ప్రకటించిన 45 స్థానాలో 43 స్థానాను ఎన్‌ఎల్‌డి కైవసం చేసుకుంది.  యాంగాన్‌ ప్రాంతంలోని 12 స్థానాలకుగాను పన్నెండిరటినీ  ఎన్‌ఎల్‌డి  గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మూడిరట రెండొంతు లు  మెజార్టీకన్నా మించి స్థానా లు సూకీ పార్టీకి లభించనున్నాయి. ఇంతవరకు ప్రకటించిన వాటిలో 70 శాతానికి పైగా స్థానాలు ఆ పార్టీ ఖాతాలో జమ అయ్యాయి.    దేశాధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టు కున్న ప్రస్తుత పార్లమెంట్‌ స్పీకర్‌ షా మాన్‌ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.   ఫలితం  వెల్లడి కాక ముందే ఆయన తన ఓటమిని ఫేస్‌బుక్‌ ద్వారా అంగీకరిం చటం విశేషం.  పూర్తి ఫలితాలు (2015 nov-9)మంగళవారం ఉదయం 6-30 గంటలకు పూర్తి పలితాలు వెలువడుతాయని భావిస్తున్నట్లు షామాన్‌ కుమారుడు టోనైంగ్‌ మాన్‌ చెప్పారు.  ఫలితాల ధోరణి ఇప్పటికే కన్పిస్తున్నందున తన తండ్రి ముందుగానే ఎన్‌ఎల్‌డికి అభినందను తెలియచేశారని ఆయన వివరించారు. ఇదిలా వుండగా పాలక పక్షం యూనియన్‌ సోలిడారిటీ అండ్‌ డెవలెప్‌మెంట్‌ పార్టీ (యుఎస్‌డిపి) నేత హ్తే తమ ఓటమిని అంగీకరించారు. హ్తే ఊ ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం   వెల్లడించారు  సోమవారం ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది. 
                                                                     తొందరపడొద్దన్న సూకీ
                   పూర్తి ఫలితాలను అధికారికంగా ప్రకటించేంతవరకు 'సం యమనం పాటించాలని ఆంగ్‌సాన్‌ సూకీ తన పార్టీ సహచరులకు, మద్దతుదారులకు  విజ్ఞప్తి చేశారు.  తమ పార్టీ ఎటువంటి వివక్షకూ తావివ్వని రీతిలో దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తుందని ఆమె చెప్పారు.  ఈ ఎన్నికల్లో యుఎస్‌డిపి తరపున 1,122 మంది, ఎన్‌ఎల్‌డిపి తరపున 1,123 మంది బరిలో నిలిచారు.  మూడంచెల ఈ పార్లమెం టరీ ఎన్నికల్లో మొత్తం 90 రాజకీయ పార్టీలకు చెందిన 6,038 మంది అభ్యర్ధులు , 310 మంది స్వతంత్ర అభ్యర్ధులతో సహా దాదాపు వెయ్యిమందికి పైగా పోటీ పడ్డారు.
                                                           మయన్మార్‌ రాజకీయ   ఘటన క్రమం
                1988లో నాటి బర్మాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, రాజ కీయ అణచివేతపై నిరసనలు వెల్లువెత్తాయి.  దీనిపై స్పందిం చిన సైన్యం అణచివేతలో భాగంగా దాదాపు 3 వేల మందిని హతమార్చింది. సూకీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
           1990: సూకీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా సైన్యం దానిని అంగీకరించలేదు.  అణచివేతను మరింత ఉధృతం చేసిన సైన్యం సూకీని గృహనిర్బంధంలో వుంచింది.
                1991: గృహనిర్బంధంలోనే సూకీకి నోబుల్‌ శాంతి బహుమతి లభించింది.
                2005: దేశ కొత్త రాజధానిగా మారుమూ ప్రాంతంలోని నేపిటా నగరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
             2007: కాషాయ విప్లవం పేరుతో బౌద్ధ సన్యాసుల నిరసన ప్రదర్శన నిర్వహించారు.  వీటిని అణచివేసేందుకు సైనిక ప్రభుత్వం మరింత హింసాకాండకు ప్పాడిరది.
        2010: పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో సైనిక మద్దతుతో తాము విజయం సాధించినట్లు యుఎస్‌డిపి ప్రకటించింది. ఎన్‌ఎల్‌డితో సహా అనేక ఇతర పార్టీ లు ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు నిరాకరించాయి.  ఎన్నిక లు జరిగిన వారంలోపే సూకీని ప్రభుత్వం గృహనిర్బంధం నుండి విడుద చేసింది.
             2011: అందరినీ ఆశ్చర్యపరుస్తూ సైనిక ప్రభుత్వం తన అధికారాను మాజీ సైనికాధికారి థీన్‌సీన్‌ నేతృత్వంలోని పాక్షిక పౌర ప్రభుత్వానికి అప్పగించింది.  ఆయన చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక హక్కును పునరుద్ధరించటంతో పాటు ఆంక్షను కూడా ఎత్తివేశారు.  అనేక మంది రాజకీయ ఖైదీలను విడుదల చేశారు.
            2012: పార్లమెంట్‌ లోని 45 స్థానాకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి 43 స్థానాల్లో విజయం సాధించింది. సూకీ ఎంపిగా ఎన్నికయ్యారు.  అమెరికా, ఐరోపా తదితర దేశాలు మయన్మార్‌పై ఆంక్ష తగింపు ప్రారంభించాయి.  అయితే పశ్చిమ ప్రాంతంలోని రఖినే రాష్ట్రంలో ఎక్కువగా వున్న రోహింగ్యా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింసాకాండ చెలరేగింది.

8, నవంబర్ 2015, ఆదివారం

‘మహా’ ప్రభంజనం


                                                        బీహార్‌లో నితీష్‌కే పట్టం
                                                    చావుదెబ్బతిన్న కాషాయదళం
                                                   జెడియు కూటమి అఖండ విజయం
                                                        మూడుచోట్ల లెఫ్ట్‌ గెలుపు

               బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమికి 178, ఎన్‌డిఏ కూటమి 58, లెఫ్ట్‌ప్రంట్‌ 3, ఇతయి 4 స్థానాలు గెలుచుకున్నారు.  ఆయా వార్తా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ మహాకూటమికి అనుకూలంగా వెల్లడించాయి. అయితే తక్కువ సీట్లతో గెలుస్తుందని ప్రకటించాయి. అంచనాకు మించి భారీ మెజార్టీతో విజయం సాధించింది. బిజెపికి  మరో గట్టి  ఎదురుదెబ్బ తగిలింది. మొన్నఢిల్లీలో  నేడు బీహార్‌లో అది  ఘోర పరాజయాన్ని చవిచూసింది. మోడీ ప్రభుత్వ 18 మాసాల పాలనపై బీహార్‌ ప్రజులు తమ అసమ్మతిని స్పష్టంగా తెలియజేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాను తలకిందు జేస్తూ  జెడియు నేతృత్వంలోని మహా కూటమికి మూడిరట రెండొంతులు మెజార్టీతో తిరుగులేని విజయం చేకూర్చారు. ఈ హ్యాట్రిక్‌ విజయంతో నితీష్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. గోవధ,  గొడ్డు మాంసం, రిజర్వేషన్లు వంటి వాటిని ముందుకు తీసుకొచ్చి దేశంలో అసహనాన్ని పెంచి, రాజకీయ లబ్ధి పొందాలని చూసిన  బిజెపికి తగిన శాస్తి చేశారు. మతోన్మాద శక్తులపై లౌకిక కూటమి సాధించిన ఈ విజయం  బీహార్‌ రాజకీయాల్లోనే గాక దేశ రాజకీయాల్లోనూ కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. జెడియు, ఆర్జెడి మద్దతుదారులు రాష్ట్ర వ్యాపితంగా  బాణ సంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడంతో బీహార్‌కు మూడు రోజుల ముందే దీపావళి వచ్చినట్లుయింది. ఈ పరిణామంతో  వచ్చే శీతాకాల సమావేశాల్లో  కార్పొరేట్‌  అనుకూలబిల్లు,  జిఎస్‌టి, కార్మిక చట్ట సవరణ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్న మోడీ సర్కార్‌కు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకానుంది.

5, నవంబర్ 2015, గురువారం

మహాకూటమికే మొగ్గు !


                                                                ఎగ్జిట్‌ పోల్స్‌వెల్లడి
                                                              ముగిసిన పోలింగ్‌ ఘట్టం
                                                                8న బీహార్‌ భవితవ్యం
    పాట్నా :
బీహార్‌ శాసభసభ ఎన్నికల్లో మహాకూటమికి గెలుపు అవకాశాున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన  ఆయా వార్తా సంస్థలు ప్రకటించాయి.  ఎన్నిక సమరంలో పోలింగ్‌ ఘట్టం ముగిసింది. 2015 నవంబర్‌ 5న జరిగిన చివరి ఐదో విడతలో 59.46 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 56.8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. ఫలితాలు ఈ నెల ఎనిమిదో తేదీన రానున్నాయి. చివరి దశ పోలింగ్‌ ముగిసిన వెనువెంటనే వివిధ వార్తా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌తో హోరెత్తించాయి. ఎన్డీయే, మహాకూటమి హోరాహోరీగా స్థానాలు కైవసం చేసుకోనున్నాయని తెలిపాయి. అయితే  స్వల్పఆధిక్యతతో మహాకూటమే పైచేయి సాధించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేశాయి. టైమ్స్‌నౌ వార్తా సంస్థ ఎన్‌డియేకు 111, మహాకూటమికి 122, ఇతరులు 10 సీట్లు గొచుకునే అవకాశం ఉందని చెప్పింది.   ఎన్‌డిటివి ఎన్డీయేకు 116, మహాకూటమికి 120, ఇతరుకు ఏడు వస్తాయని చెప్పింది. న్యూస్‌ఎక్స్‌ ఎన్‌డియేకు 90 నుంచి100, మహాకూటమికి 130 నుంచి140, ఇతరుకు 13 నుంచి 23  వస్తాయని ప్రకటించింది.  ఇండియా టుడే ఎన్‌డియేకు 112 నుంచి113, మహాకూటమికి 113నుంచి127, ఇతరులకు ఆరు వస్తాయని తేల్చింది. టుడేస్‌ చాణిక్య మాత్రం ఎస్‌డియేకు 155, మహాకూటమికి 83 వస్తాయని ఎన్‌డియేకు అనుకూలంగా ఫలితాలుంటాయని తేల్చింది. అయితే నవంబర్‌ 8న ఎన్నిక లఫలితాలు వచ్చాక ఎవరి అంచనాలు ఏమిటనేది తేల నుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.