26, డిసెంబర్ 2010, ఆదివారం

కాంగ్రెస్‌ దొంగాట!

తెలంగాణా విషయంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో లేదని అనిపిస్తోంది. తెలంగాణా ఇచ్చేది మేమే తెచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు నిరాహారదీక్షలు చేస్తామని లేదా రాజీనామాలు చేస్తామని తెలంగాణాలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు జరినప్పుడు తెలంగాణా కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అప్పుడు స్పష్టంగా నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు చప్పుడు చేయకుండా ఉన్న తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసులు ఎత్తేయక పోతే దీక్షలు చేస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే ఏమిటి తెలంగాణా కోసం పోరాటం చేస్తున్న పార్టీలకు ఎక్కడ గుర్తింపు వస్తుందోనని గమనించి ఇప్పుడు ఇలాంటి ప్రకటన ఇస్తున్నారా? లేక శ్రీకృష్ణ కమిటీ రాగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఏమయినా సంకేతాలు వచ్చాయా? అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ద్వంద వైఖరి ప్రదర్శిస్తుంది. తెలంగాణా ఉద్యమం తీవ్రమైనప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లి సోనియాగాంధీకి మెమోరాండం ఇచ్చారు. ఒకపక్క పోలీసుల బలగాలను దింపుతున్నామని చెబుతున్నారు. మరోపక్క ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది.ఇవ్వంది తేల్చుతూ ఒక ప్రకటన చేయవచ్చు గదా?. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఒకపక్క రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన సాగుతుంది. ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక పక్క వేర్పాటు వాద ఉద్యమాలు, పలు రకాల సమస్యల్లో ఉన్నామని ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వీటన్నింటినీ వదిలిపెట్టి ఒక్క తెలంగాణా విషయంపైనే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగుతామంటున్నారు. కొందరు శ్రీకృష్ణకమిటీ నివేదికతో సంబంధం లేకుండానే తెలంగాణా ఇవ్వాలని మాట్లాడుతున్నారు. వేర్పాటు వాద ఉద్యమాలపై స్పష్టమైన అవగాహన ఉన్న కాంగ్రెస్‌కు దోంగాట ఎందుకనేది అర్థంగాని పరిస్థితి.
చలిలో వేడి పుట్టించిన ప్రధాన పార్టీల ప్రకటనలు
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఈ నెల 31న కేంద్రానికి అందజేస్తున్న తరుణంలో ఒక్కసారిగా తెలంగాణాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌ వైపునకు ప్రజల దృష్టి మళ్లించేందుకన్నట్లు ఆదివారం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్‌ తెలంగాణా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తేయకుంటే సోమవారం నుండి నిరవధిక దీక్ష చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం కోసం అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామని ఎంపి కె కేశవరావు అన్నారు. తెలుగుదేశం తెలంగాణా ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణాను ఇస్తే సంతోషిస్తాం, లేకుంటే అంతు చూస్తాం అని అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి స్టీరింగ్‌ కమిటీలో టిఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖరరావు 'పోలీసులను ప్రయోగిస్తే.. చేతులు కాల్చుకుంటారు' అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు.

2 కామెంట్‌లు:

మైలవరం చెప్పారు...

thelagana kosam porade migatha socalled partyladi dongata kadani meeru nammutunnara?

panuganti చెప్పారు...

అధికారంలో ఉండే ఫార్టీది ప్రధాన భాధ్యత అనినేను నావాదన