మూలకణ పరిశోధకులు ఇద్దరికి ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి
లభించింది. పెద్ద కణాలు మూల కణాలుగా మారడంపైనా, శరీరంలో అవి తిరిగి ఏ తరహా
కణాలుగానైనా మారిపోవడంపై విశేష పరిశోధనలు సాగించిన బ్రిటన్కు చెందిన జాన్
గుర్డాన్కు, జపాన్కు చెందిన షిన్యా యమనకకు ఈ పురస్కారం సంయుక్తంగా
లభించింది. ప్రొఫెసర్ గుర్డాన్ కప్పల క్లోనింగ్ ప్రక్రియ కోసం పేగు
నమునాను ఉపయోగించగా..ప్రొఫెసర్ యమనక జన్యువులను రీప్రోగ్రామింగ్ కణాలుగా
మార్పు చేశారు. విజ్ఞానశాస్త్రాన్ని ఈ ఇరువురు పరిశోధకులు విప్లవాత్మకం
చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం
గెల్చుకున్న ప్రొఫెసర్ గుర్డాన్ చదువుకునే రోజుల్లోనే శాస్త్ర ప్రయోగాలపై
ఆసక్తి చూపగా ఆయన ఉపాధ్యాయుడు 'సమయం వృధా' అని వ్యాఖ్యానించారట. దానికి
సంబంధించిన టీచర్ రిపోర్టును ఆయన ఇంకా పదిలంగానే ఉంచుకోవడం విశేషం. బహుళ
సమర్థతను సంతరించుకునేందుకుగాను పరిపక్వత చెందిన కణాలను రీప్రోగ్రామింగ్
చేయగలమని గుర్డాన్, షిన్య శాస్త్రబద్ధంగా నిరూపించారు. ఈ నిరూపణ అంతిమంగా
2012 సంవత్సర వైద్య రంగ నోబెల్ పురస్కారాన్ని గెలుచుకుంది. సోమవారం
స్టాక్హోమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ఓ ప్రకటన జారీ
చేసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి