14, ఆగస్టు 2013, బుధవారం

ఇదీ మన స్వాతంత్య్రం

ఆకలి పెరుగుతోంది
అవినీతి విజృంబిస్తుంది
స్వార్థం పరిడవిల్లుతోంది
స్వాతంత్య్రం ఎవరికొచ్చింది?.

ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి
అందరూ గుర్తించి నట్లే నటిస్తున్నారు
మనిషి మనిషినే అవమానిస్తున్నాడు
మనుషులమని పాలకులే మోసగిస్తున్నారు!!.

ఎవరి తిండి వారు సంపాదించుకోవాలి
ఎవరి దుస్తులు వారు కొనుక్కోగలగాలి
ఎవరి ఇల్లు వారు నిర్మించుకోగలగాలి
ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోగలగాలి
ఎవరైనా విద్యను పొందగలగాలి
అవమానం లేని ఆత్మగౌరవంతో బతకాలి.

బతుకుపై ఆశచావని పేదలంతా ఎదురు చూస్తున్నారు
మార్పును కోరే పాలకులొస్తారని........................
ఆర్థిక అంతరాలుపోతాయని
మనిషి మనిషిగా బతకొచ్చని.!!!!!!!!!!!!!!!!!!!!..???.

1 కామెంట్‌:

ప్రేరణ... చెప్పారు...

చక్కగా చెప్పారు. జైహింద్