15, డిసెంబర్ 2018, శనివారం

2019 తర్వాత టి డి పి పాత్ర నామమాత్రమే!


                   హైదరాబాద్‌: రాష్ట్రాలు, కేంద్రం బలోపేతం కావాలన్న ఉద్దేశంతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని టి ఆర్ ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు.  టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్న కూటమి కేవలం తెదేపాను బలోపేతం చేసుకోవడానికేనని విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో తెదేపా పాత్ర నామమాత్రమవుతుందన్నారు. 15-12-2018 శనివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఈ దేశంలో రాష్ట్రాల పాత్ర, బలోపేతం మీద అర్థవంతమైన చర్చకు దారితీసేదిగా ఉంటుందన్నారు. చంద్రబాబు చెబుతోన్న ఫ్రంట్‌ దేశం బలోపేతం కోసం కాదని, అది  టిడిపి బలోపేతానికన్నారు.
             బిజెపిని బూచిగా చూపించి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే బిజెపిని ఓడగొట్టేందుకు తానేదో కూటమి తయారు చేస్తున్నానన్న ప్రయత్నాన్ని బలంగా ఏపీ ప్రజల ముందు పెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  టిడిపి కోసం పనిచేస్తే.. తాము దేశం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని చెప్పారు.

కామెంట్‌లు లేవు: