20, ఫిబ్రవరి 2019, బుధవారం

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు




హైదరాబాద్‌:  2019 ఫిబ్రవరి 19న ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలు కేటాయించారు. గతంలో ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కేటాయించారు. జగదీశ్‌రెడ్డి గతంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేయగా ప్రస్తుతం విద్యాశాఖను కేటాయించారు. నిరంజన్‌రెడ్డికి ఆర్థిక శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ సీఎం.. ఆశాఖను ఎవరికీ కేటాయించలేదు. ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. తెలంగాణ కేబినెట్‌లో 16మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తొలి విడతలో 10 మందికి  అవకాశం దక్కింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. 
మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు...
ఈటల రాజేందర్‌: వైద్య ఆరోగ్యశాఖ
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌: పశుసంవర్థకశాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్‌శాఖ
నిరంజన్‌రెడ్డి: వ్యవసాయశాఖ
కొప్పుల ఈశ్వర్‌: సంక్షేమశాఖ
చామకూర మల్లారెడ్డి: కార్మిక శాఖ
జగదీశ్‌రెడ్డి: విద్యాశాఖ
శ్రీనివాస్‌గౌడ్‌: ఎక్సైజ్‌శాఖ, పర్యాటకశాఖ
ప్రశాంత్‌రెడ్డి: రవాణా, రహదారులు, భవనాలశాఖ
ఇంద్రకరణ్‌రెడ్డి: న్యాయ, అటవీ, దేవాదాయశాఖ

కామెంట్‌లు లేవు: