13, ఆగస్టు 2019, మంగళవారం

విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి : రాహుల్‌


గవర్నర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ 

         దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు రావాలన్న గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ స్వాగతించారు. అయితే అందుకు విమానం పంపాల్సిన అవసరం లేదన్నారు. తనతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, ప్రజలు, సైనికులను కలిసి మాట్లాడేందుకు స్వేచ్ఛ కల్పించాలని రాహుల్‌ గవర్నర్‌ను కోరారు. ‘ప్రతిపక్ష నాయకుల బృందం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యటించాలన్న మీ ఆహ్వానం చాలా గొప్పది. కానీ అక్కడ పర్యటించి ప్రజలు, సైనికులతో కలిసి మాట్లాడే స్వేచ్ఛ మాకు కావాలి’ అని రాహుల్‌ గవర్నర్‌కు ట్వీట్‌ చేశారు.  
            కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిన్న మండిపడ్డారు. రాహుల్‌ను తాను కశ్మీర్‌కు ఆహ్వానించానని, ఆయనకు విమానం కూడా పంపుతానని, వచ్చి ఇక్కడి పరిస్థితి గమనించి అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు.

1 కామెంట్‌:

maheshudu చెప్పారు...

vadi italiki povacchuga. akkadaite pellam etc untaru. challaga untundi. svecchaga tiragocchu.