ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఈ మహమ్మారి అంతకంతకు పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఏపీలో ఆదివారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 420 కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్గా తేలినట్లు నిర్ధారించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో 199 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. వారిద్వారా 161 మందికి కరోనా సోకిందని చెబుతున్నారు. ఇతరత్రా మార్గాల వల్ల 32 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు.జిల్లాల వారీగా కేసులు ఇవీ..
01. కర్నూలు : 84
02. గుంటూరు : 82
03. నెల్లూరు : 52
04. కృష్ణా : 35
05. ప్రకాశం : 41
06. కడప : 31
07. అనంతపురం: 15
08. చిత్తూరు : 21
09. తూర్పు గోదావరి : 17
10. విశాఖపట్నం : 20
11. పశ్చిమ గోదావరి : 22
మొత్తం కేసుల సంఖ్య : 420
డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య : 12
మరణించిన వారు..
ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 07. మరణించిన వారు అనంతపురంలో 02, కృష్ణాలో 02, గుంటూరులో 02, కర్నూలులో ఒకరు మరణించారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 401 మంది చికిత్స పొందుతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి