
కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా రవాణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఫలితంగా ఈ నెలలో దేశంలో ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. రికార్డు స్థాయిలో 50 శాతానికి పడిపోయింది. ప్రొవిజనల్ ఇండస్ట్రీ డేటా ప్రకారం.. ఏప్రిల్ తొలి అర్ధ భాగంలో పెట్రోలు అమ్మకాలు 64 శాతం పడిపోయాయి. డీజిల్ విక్రయాలు 61 శాతం క్షీణించాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగమైతే ఏకంగా 94 శాతం పడిపోయింది. కారణం అందరికీ తెలిసిందే. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడమే ఇందుకు కారణం. అయితే, ఒక్క ఎల్పీజీ వినియోగం మాత్రం పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 15వ తేదీ మధ్య ఎల్పీజీ వినయోగం 21 శాతం పెరిగింది. ఇక, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం మొత్తంగా 50 శాతానికి పడిపోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి