
తెలంగాణ : 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ కమిషనరేట్లో నగర వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం మేర పెరిగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్ నిమజ్జనోత్సవం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు.
ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి : సిపి
ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని సిపి వివరించారు. మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. సైబర్ నేరాలు 11 శాతం పెరిగాయన్నారు. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయన్నారు పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కఅషి చేస్తోందని చెప్పారు. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని, డ్రగ్స్ను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ను వినియోగిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని సిపిఎం తెలిపారు.
పబ్స్ తెరిచే ప్రసక్తే లేదు : సిపి
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిఎట్టి పరిస్థితుల్లో తిరిగి పబ్స్ ఓపెన్ చేయించే ప్రసక్తి ఉండదు అని సిపి స్పష్టం చేశారు. న్యూ ఇయర్ రోజు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి ఉందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12.30 గంటల నుంచే కష్టమర్లను బయటకి పంపాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించినా, సప్లై చేసినట్లు తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సిపి హెచ్చరించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి