మహారాష్ట్ర రాజకీయాలు ఈ మధ్య అగమ్యగోచరంగా మారాయని చెప్పవచ్చు. అవినీతికి అంతేలేదు. మనరాష్ట్రంతో పోల్చితే తక్కువే కావచ్చు. ఈ క్రమంలో ఆదర్శ్ అపార్టుమెంట్ల కుంభకోణంలో ఇరుకున్న అశోక్చౌవాన్ రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాను ఆలస్యంగా నయినా ఆమోదించిన అధిష్టానం కేంద్రమంత్రి పృధ్విరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈనెల11న ప్రమాణం చేస్తారట. ఈయనపై ఎలాంటి ఆరోపణలు లేవని.చాలా బుద్ధిమంతుడని అందరూ కొనియాడుతున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇటీవల అంటే 2000 సంవ్సతరం నుంచి ముఖ్య మంత్రిగా ఉన్న విలాస్రావ్ దేశ్ముఖ్ కుంభ కోణాల్లో ఇరుక్కుని ఏమయ్యాడో చూశాం. అదేవిధంగా అశోక్ చవాన్ మంచోడని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కూడా కుంభకోణాల్లో ఇరుక్కుని రాజీనామా చేశారు. పృధ్విరాజ్ కూడా కుంభకోణాల్లో ఇరుక్కోవడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చని అనిపిస్తుంది. ఇరుక్కో పోవచ్చేమో చెప్పలేం. ముందుముందు చూద్దాం.........
మహారాష్ట్ర గురించి
మహారాష్ట్ర భారత దేశంలో వైశాల్య పరంగా మూడో పెద్దరాష్ట్రం. జనాభా పరంగా రెండో పెద్దరాష్ట్రం ఉత్తర ప్రదేశ్ తరువాత స్థానం దీనికి ఉంది. ఈ రాష్ట్రానికి గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలలోనూ కేంద్రా పాలిత ప్రాంతాలైన దాద్రా-నగర్ హవేలీ తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నది. అతి పెద్దనగరం ముంబయి రాజధానిగా ఉంది. ఈప్రాంతం రుగ్వేదంలో రాష్ట్ర అని, అశోకుని శాసనాలలో రాష్ట్రీకమని తరువాత హువాన్త్సాంగ్ వంటి యాత్రికుల రచనల్లో మహారాష్ట్ర అని ప్రస్తావించారు. మహారాష్ట్ర అనే ప్రాకృత పదం నుంచి ఈ పేరు రూపాంతంరం చెందిందని భావి స్తున్నారు. మహా కాంతార అంటే పెద్ద అడవులు అన్న పదం నుంచి మహారాష్ట్ర పదం ఉట్టిందని అంటారు. దీనంతటికి బలమైన ఆధారాలు మాత్రం లేవని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అధికార భాష మరాఠీ. అయితే హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలను విస్తారంగా మాట్లాడుతారు.
రాజకీయం
ఇక్కడ 35 జిల్లాలు, ఆరు రెవెన్యూ డివిజన్లున్నాయి. 288 శాసన సభ , 48 పార్లమెంటు, 19 రాజ్యసభలో స్థానాలున్నాయి. 1995 వరకు కాంగ్రెస్కు తిరుగులేదు. ఆతరువాత శివసేన, బిజెపి కూటమి అధికారం లోకి వచ్చింది. 2004 కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆతరువాత తిరిగి కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ప్రస్తుతం శాసన సభలో కాంగ్రెస్ 82, ఎన్సిపి 62, బిజెపి 46, శివసేన 45, ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనీత్ నిర్మాణ్ సేన) 13, ఎస్పి 03, పిడబ్ల్యుపిఐ 04, బివిపి 02, సిపిఐ(ఎం) 01, ఇతరులు 30 మంది శాసన సభ్యులున్నారు.
ప్రస్తుతం శాసన సభలో కాంగ్రెస్ 82, ఎన్సిపి 62, బిజెపి 46, శివసేన 45, ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనీత్ నిర్మాణ్ సేన) 13, ఎస్పి 03, పిడబ్ల్యుపిఐ 04, బివిపి 02, సిపిఐ(ఎం) 01, ఇతరులు 30 మంది శాసన సభ్యులున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి