డాక్ట్టర్ భీమ్రావ్రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయనను అప్పటి సమాజం అంటరాని వాడిగా చూసింది. అంటరాని వాడిగా ముద్రపడిన ఆయన 'ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, డిలిట్, బారిస్టర్ అట్లా' వంటి ఉన్నత చదువులు చదివి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. ఆరోజుల్లో సంస్కృతం అస్పృశ్యులు చదవరాదనే కట్టుబాట్లు ఉండేవి వాటిని ఎదిరించి సంస్కృతం చదివాడు. మనుధర్మ రక్షకులను మంటలల్లో కలిపాడు. సాటిమానవులను మనుషులుగా గౌరవించని హిందూధర్మాన్ని విడనాడి బౌద్ధధర్మాన్ని పాటించాడు. మతం మార్పుతో సమాజంలో మార్పు రాదని ఆర్థిక అసమానతు పోవాలని పోరాటం చేశారు. దళిత జనోద్దరణ కోసం జీవితాంతం పోరాటం చేశారు. భారత రాజ్యాంగపరిషత్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. రాజ్యాంగ పితగా ఆయనను జాతి గౌరవిస్తోంది. 1931లో మహాత్మగాంధీ, అంబేద్కర్ మధ్య పూనా ఒడంబడిక జరిగింది. జవహర్లాల్నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో ఆయనకు భారతరత్న అవార్డు లభించింది. 1956లో బౌద్ధమతాన్ని స్వీకరించారు. బహిష్కృత్ భారత్, మూక్నాయక్ పత్రికలను నిర్వహించారు. 1956 డిసెంబర్ 6న మరణించారు. భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి వేడుకలను గురువారం జరుపుకుంటుంది. అంబేద్కర్ గొప్ప పోరాట యోధుడు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పోవాలని కెవిపిఎస్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి