21, సెప్టెంబర్ 2011, బుధవారం

బియ్యం ఒక్కటి తగ్గిస్తే పేదోడి ఆకలి తీరుతుందా?

                    ''ఆహార ధాన్యాలు గోదాముల్లో ముక్కిపోతున్నాయి. ఎలుకలు పందికొక్కులకు ఆహారంగా మారుతున్నాయి. ప్రజలు తిండిలేక పలువురు నకనక లాడుతున్నారు.'' ఉచితంగా పంచండని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మన పాలకులు మాత్రం ముక్కిపోయినా సరే ఎలుకలు, పందికొక్కులు తిన్నా సరే ఉచితంగా ఇవ్వం. ఇస్తే ప్రజలు సోమరులుగా మారుతారని ప్రకటించారు. రోజుకు 20 రూపాయలు ఖర్చులేయలేని జనాభా 80 శాతం మంది ఉన్నారు. అలాంటి వారికి ఇది కొంత ఉపశమనమే. అయినప్పటికీ మనిషికి పౌష్టికాహారం కావాలంటే ఎంతకావాలి. 20 రూపాయలు కూడా ఖర్చు చేయలేని పేదలకు ఇది సరిపోతుందా?. పరిశీలించాలి. మరో విషయం ఒక మనిషికి నెలకు నాలుగు కిలోల బియ్యం మాత్రమే రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ ఒకటి నుంచి ఒక్క రూపాయకు ఇస్తారట. రెండు రూపాయలకే ముక్కిపోయి చేదెక్కిన బియ్యం ఇస్తున్నారు. ఒక్కరూపాయకిలో బియ్యం తెచ్చి పశువులకు వేయడానికి కూడా ఉపయోగపడదు. ఒక వేళ మంచివే ఇచ్చారనుకో... ఈ బియ్యం ఎన్నాళ్లు తింటాడు. ముక్కిపోయిన బియ్యం ఇస్తే అందులో ఎన్నిక్యాలరీల శక్తి వస్తుంది. ఒక్క బియ్యం మాత్రమే తినలేడు కదా మనిషి , వంటచెరుకు(కర్రలు, కిరోసిన్‌, లేదా గ్యాస్‌), ఉప్పు, పప్పు, మంచినూనే, కారం తదితరాలు కావాలి కదా. వాటి ధరలు ఆకాశాన్నంటాయి. మనిషికి పౌష్టికాహారం ఎలా అందుతుంది. లక్షల మంది విద్యార్థులు సాంఘీక సంక్షేమ ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్సియల్‌ కశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోజుకు 18 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఎంతకొనాలి. ఎంత పెట్టాలి. అని వార్డెన్లు ప్రశ్నిస్తున్నారు. సమాధానం లేదు. 18 రూపాయలకు ఎన్ని సరుకులు వస్తాయో మనకు తెలియనిది కాదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ఒక్క రూపాయ కిలో బియ్యం పథకంతో ఏమి ప్రయోజనం లేదు. ఇది ప్రచారానికి చెప్పుకోవడానికి పనికి వచ్చేది తప్ప మరొకటి కాదని చెప్పాలి.
పట్టణాల్లో అందుబాటులో లేని చౌకధర దుకాణాలు
              పట్టణ ప్రాంతాల్లో చౌకధర దుకాణాలకు వెళ్లాలంటే కనీసం 20 రూయలకు పైగా ఖర్చువుతున్నాయి. 20 కిలోల బియ్యం కోసం మరో 20 ఖర్చు చేయాల్సిందే. కొన్ని రూట్లకు ఆటోలు వెళ్లవు. ఆరూటుకు వెళ్లాలంటే అదనంగా ఛార్జీ అడుగుతారు. చౌకధరకు దొకికే సరుకులు ఇంటికి చేర్చితే ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా ఒకరోజు బియ్యం, ఒకరోజు చక్కెర, మరో రోజు కిరోసిన్‌ ఇస్తున్నారు. ఎందుకిలా ఎన్నిసార్లు తిరగాలయ్యా అంటే సమాధానం లేదు. సబ్సిడీ సరుకులు తీసుకోవడానికి అదనంగా వినియోగదారునికి ఖర్చులున్నాయి. ప్రయోజనమేంటి ప్రాక్టికల్‌ విషయాలను ఎందుకు పాకులు పరిశీలించడం లేదు.
ధరలు తగ్గించడమంటే ....ఏంటి?
         అన్ని ధరలు పెంచిన పాలకులను ప్రజలు క్షమించరు. పెట్రోలు ధరలు తగ్గించాలి, గ్యా స్‌ ధరలు తగ్గించాలి. ప్రయివేటు పాఠశాలల్లో , కళాశాలల్లో ఫీజులు తగ్గించాలి. అబ్బో చెప్పాలంటే చాలా ఉన్నాయి. పుక్కడికి వచ్చాయిగదాని, బియ్యం కూడా ప్రజలవే ..ముక్కిపోయాక బియ్యం ధర ఒక్కటి తగ్గించడం కాదు. జనం కష్టాలు పరిశీలించాలి. అందరికీ పని కల్పించాలి. ప్రయివేటు ప్రాధాన్యతను తగ్గించాలి. ప్రభుత్వం అవినీతిని తగ్గించాలి. శ్రమదోపిడీని తగ్గించాలి. పేదల ఆకలి తగ్గించాలి. ఇవన్ని చేస్తే పాలకులను ప్రజలు అభినందిస్తారు.

1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

This is not about your post, please see below link and poll your opinion.

http://malakpetrowdy.blogspot.com/2011/10/email-from-niharika.html