15, నవంబర్ 2012, గురువారం

వణుకుతున్న శ్రీనగర్‌

ఉష్టోగ్రత మైనస్‌ 8 డిగ్రీలు
             జమ్మూ కాశ్మీర్‌లో ఈ సీజనులోనే అత్యంత శీతల రాత్రిని శ్రీనగర్‌ ప్రజలు 2012 నవంబర్‌ 14న బుధవారం రాత్రి అనుభవించారు. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే పరిస్థితి ఉందని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కనీస ఉష్ణోగ్రతలు మాత్రం కాశ్మీర్‌ లోయలోనూ, లడఖ్‌లోనూ ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. అరేబియన్‌ సముద్రం నుంచి వచ్చే పశ్చిమ పవనాలు (వెస్ట్రన్‌ డిస్ట్రబెన్సెస్‌) ఈ ప్రాంతాన్ని సమీపిస్తున్నందున వచ్చే రెండు రోజుల్లో మంచు లేదా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇప్పటివరకు మైనస్‌ 11.2 డిగ్రీలుగా ఉంటూ వచ్చిన ఉష్ణోగ్రత గత రాత్రి మరో మూడు డిగ్రీలు తగ్గి మైనస్‌ 8కి చేరింది. లేV్‌ాలో ఇది అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన రికార్డని వాతావరణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెరువులు, సరస్సులు గడ్డ కట్టుకుపోయాయి. అధికారులు పైప్‌ల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా మాత్రమే ప్రజలకు నీటిని అందిస్తున్నారు. సరిహద్దు పట్టణమైన కార్గిల్‌లో కనీస ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పూ లేదు. బుధవారం కనీస ఉష్ణోగ్రత మైనస్‌ 4.8 డిగ్రీలు కాగా, ఈ రోజు మైనస్‌ 4.6 డిగ్రీలకి చేరింది. కాగా శ్రీనగర్‌-లేV్‌ా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. లడఖ్‌ ప్రాంతాన్ని మిగిలిన రాష్ట్రంతో కలిపే ఏకైక రహదారి ఇదే కావడం గమనార్హం.

కామెంట్‌లు లేవు: