1, జూన్ 2015, సోమవారం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల

                                                  

                                                  ఐదుస్థానాల్లో టిఆర్‌ఎస్‌, ఒకస్థానంలో కాంగ్రెస్‌
              తెలంగాణ రాష్ట్ర్రంలో శాసన సభ్యుల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు 2015 జూన్‌ ఒకటిన నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు అదే రోజు సాయంత్రం  వెలువడ్డాయి. తెరాస తరుపున పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మరోస్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.  తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్‌  సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా 118 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. పోలైన ఓట్లలో ఐదు ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓ ఎమ్మెల్యే నోటా వినియోగించుకున్నారని తెలిపారు. నామినేటెడ్‌ అభ్యర్థికి డబ్బులు ఎరచూపి ఎసిబికి  పట్టుపడి జైల్లో ూన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
                                 విజయం సాధించిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు
కడియ శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు, నేతి విద్యాసాగర్‌రావు, యాదవ రెడ్డి, బి వెంకటేశ్వర్లు.
గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి : ఆకుల లలిత

కామెంట్‌లు లేవు: