8, జనవరి 2019, మంగళవారం

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం‌

 
దిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై చర్చ ముగింపు సందర్భంగా.. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15కి క్లాజ్‌(6), 16కి క్లాజ్‌(6) చేరుస్తున్నామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం మా ప్రభుత్వమే క్రిమిలేయర్‌ పరిమితిని రూ. 6లక్షల నుంచి 8లక్షలకు వరకు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరి అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పష్టం చేశారు. సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్‌ పద్దతిలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా 323 మంది సభ్యులు, వ్యతిరేకంగా ముగ్గురు సభ్యులు ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదాపడింది.

కామెంట్‌లు లేవు: