26, ఆగస్టు 2019, సోమవారం

‘మిస్‌ ఇండియా’ కీర్తి సురేశ్‌..


                    హైదరాబాద్‌: కథానాయిక కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’గా కనిపించనున్నారు. అదేంటి..? అనుకుంటున్నారు. ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకుడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, సుమంత్‌, నదియా తదితరులు నటిస్తున్నారు.
                    ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌ నాజూకుగా, స్టైలిష్‌గా కనిపించారు. చిత్రం షూటింగ్‌ దాదాపు విదేశాల్లో జరిగినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం పేర్కొంది. ఇది ‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమాగా కావడం విశేషం.

కామెంట్‌లు లేవు: