11, డిసెంబర్ 2010, శనివారం

కొండాసురేఖ ఇప్పుడెందుకలా స్పందించారు?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవాశాత్తు హెలికాప్టర్‌ కూలి చనిపోయారని సిబిఐ, ఇతర పరిశోధనా సంస్థలు తేల్చాయి. ఏడాది దాటిన తరువాత వైఎస్‌ఆర్‌ ప్రాణ స్నేహితుడు కెవిపి రాంచందర్‌రావు అవినీతి గురించి మాజీమంత్రి కొండాసురేఖకు గుర్తుకొచ్చింది. కెవిపి రాంచందర్‌రావు వల్లనే రాజశేఖర్‌రెడ్డికి చెడ్డపేరు వచ్చిందని చెబుతున్నారు. మరి ఏడాది పొడవునా ఎందుకు గుర్తుకు రాలేదు. ఆయన జగన్‌వెంట వుండి ప్రచారం చేసివుంటే కెవిపి చేసిన అవినీతి బయటికి వచ్చేది కాదేమో. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపడం వల్ల అవినీతి గుర్తుకు వచ్చిందా?. జలయజ్ఞం పనులు ఏఏ కంపెనీలకు ఇచ్చారో మీరు మంత్రి పదవిలో కొనసాగారు గదా మీకు తెలువదా? తెలిస్తే అంత నీతిమంతురాలివి ఎందుకు అప్పుడు ప్రశ్నించలేదు. రాజశేఖర్‌రెడ్డి మీకు మంచివాడయితే ఆయన ప్రాణస్నేహితుడు మీకెలా చెడ్డవాడయ్యారు. సరే ఇప్పటికయినా అవినీతిని ప్రశ్నించారు మంచిదే మరి ఆ అవినీతి సొమ్మంతా జగన్‌ వారసుడుగా అనుభవిస్తున్నాడు. ఆయనేమో మీకు మంచివాడు. అధిష్టానం ఆయనపట్ల తప్పుచేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు తప్పుచేశారు. మరింకా కాంగ్రెస్‌లోనే ఎందుకున్నారు. మీకు చాలా మేలు చేసిన రాజశేఖర్‌రెడ్డి చనిపోతే ఆయన మరణాన్ని జీర్జించుకోలేని 680 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండేఆగి చనిపోయారు. అంత ఎక్కువ అభిమానం ఉన్న మీకు ఏమి కాలేదేమి? వైఎస్‌ కుటుంబసభ్యులెవ్వరూ చనిపోలేదే. ఎలాంటి సంబంధం లేని 680 మంది ఎలా ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో బ్యాంకులు జాతీయం చేసి, భూసంస్కరణల చట్టం తెచ్చి పేదల పెన్నిదిగా పేరుగాంచిన ఇందిరాగాంధీని కాల్చి చంపితే అంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు. అంతమంది గుండెలు కూడా ఆగలేదు. మరి కుంభకోణాలు చేసి ప్రజాధనం దోచుకున్న రాజశేఖర్‌రెడ్డి చనిపోతే అంతమంది ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమేనా?. రాజకీయాల్లో ఉండి ఏది మాట్లాడినా నడుస్తుందిలే అని మీరు అనుకుంటున్నారా?. సరే కెవిపి అవినీతి చేశాడు. ఆయనే కోట్లు సంపాదిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఇంకెంత సంపాదించి ఉంటారో అని ప్రతిపక్షాలు, స్వపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సమాధానం ఎవరు చెప్పాలి. ఎందుకమ్మా సురేఖ ఈ ప్రస్తావన జగన్‌కోసం చేశావా? నీ రాజకీయ భవిష్యత్తుకోసం చేశావా? కెవిపిని అభాసుపాలు చేయడానికా? జనం ఏది చెప్పినా నమ్ముతారనా?. సమాధానం మీరే చెప్పాలి.

4 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

"పేదల పెన్నిధిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ"
:):):)

astrojoyd చెప్పారు...

పదవి పైన ఆకలేసి ఉంటున్ది

panuganti చెప్పారు...

పదవి మీద ఆకలేస్తే కాంగ్రెస్ లో పోవచ్చుగా ఈరాద్యాంతం ఎందుకు.

Unknown చెప్పారు...

thanu sandhinchina villu thanake guchukuntundani anukole papam..