29, ఆగస్టు 2020, శనివారం

అన్‌లాక్-4 గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. సెప్టెంబర్ 30 వరకూ ఇవి అమల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా మరిన్ని కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రేడెడ్ (దశలవారీ) విధానంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిది. అయితే కంటైన్‌మెంట్ జోన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉంటాయని తెలిపింది. 

సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మాల్స్ మూసే ఉంటాయి. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్‌ కొనసాగేందుకు, ప్రోత్సహించేందుకు అనుమతించినట్టు పేర్కొంది. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అలాగే 21 నుంచి క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిది. 100 మందికి మించి హాజరు కాకూడదని నిబంధన విధించింది.

సినిమా హాళ్లు (ఓపెన్ ఎయిర్ థియేటర్లు మినహా), స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసే ఉంటాయి. అంతర్ రాష్ట్ర రవాణాకు  అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ విమానా ప్రయాణాలను అనుమతించరు. కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. నిత్యావసర కార్యకలాపాలను మాత్రమే అనుమతిస్తారు.

అలాగే, 65 ఏళ్లు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణిలు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఆరోగ్య అవసరాలకు మినహాయిస్తే ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది.