2, మార్చి 2012, శుక్రవారం

ప్రజాచైతన్య కరదీపిక పుస్తక సాహిత్యం

ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ పంపాదకులు తెలకపల్లి రవి
          పుస్తకసాహిత్యం ప్రజాచైతన్య కరదీపికలా అసమానతలతో కూడిన వ్యవస్థను ప్రతిఘటించేలా ఉపయోగపడాలని ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కేంద్రం కొత్తబస్టాండు సమీపంలోని సుందరయ్య జంక్షన్‌ మార్కెట్‌ యార్డు మినీకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను శుక్రవారం సిపిఎం సీనియర్‌ నాయకులు టి.నరసింహయ్య ప్రారంభించారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ మేనేజర్‌ ఎ.వెంకటేష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో రవి ముఖ్యోపన్యాసం చేశారు. అభ్యుదయ సాహిత్యాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేలా ప్రజాశక్తి బుకహేౌస్‌ పని చేస్తుందని చెప్పారు. మానవ మస్తిస్కాలకు పదును పెట్టే గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. గ్రంథాలయాల్లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందడం లేదన్నారు. అనంతరం సీనియర్‌ నాయకులు నరసింహయ్య మాట్లాడుతూ నవశక్తి, విశాలాంధ్ర, జనశక్తిగా రూపాంతరం చెందుతూ ప్రజాశక్తిగా మారిందన్నారు. ప్రజాశక్తితో తనకు చాలా అనుబంధముందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సాహిత్య కేంద్రంగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఉండాలన్నారు. మార్క్సిస్టు సాహిత్యంతోపాటు సమాజ పరిణామం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించే పుస్తకాలు జిల్లా ప్రజలకు అందించా లని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్‌ లలిత మాట్లాడుతూ ప్రజల అభివృద్ధ్ధికి అనుగుణంగా ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను ప్రజాశక్తి బుకహేౌస్‌లో ఉంచాలని సూచించారు. అభ్యుదయ సాహిత్యంతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఉస్మానియా కళా శాల విశ్రాంత అధ్యా పకులు వెంకట్రామిరెడ్డి, ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌చార్జి పి చంద్రయ్య, జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: