5, మార్చి 2012, సోమవారం

రాష్ట్రీయ ఆరోగ్యనిధిని సద్వినియోగం చేసుకోవాలి

20 సూత్రాల పథకం ఛైర్మన్‌ తులసిరెడ్డి
             క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌ తులసీరెడ్డి సూచించారు. ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్శిటీలో రెండ్రోజులుగా జరిగిన విలేకరుల శిక్షణా సమావేశం సోమవా రం ముగిసింది. కార్యక్రమంలో తులసీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. క్యాన్సర్‌ వ్యాధికి గురైన గ్రామీణ నిరుపేద లు రూ.2లక్షలు రీయింబర్స్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రామీణ విలేకరులు వ్యాధిగ్రస్తుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సమాజానికి మీడియా ప్రాణవాయువు
           ప్రజాస్వామ్యానికి మీడియా ప్రాణవాయువని తులసీరెడ్డి తెలిపారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విలేకరులు నిరంతర విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులను నిరంతర అధ్యయం చేస్తూ వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల పనితీరుతో పాటు వాటి అమలు విధానంపై ప్రెస్‌ అకాడమీ గ్రామీణ విలేకరుల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తోందన్నారు. తిరుమలగిరిసురేందర్‌ కృషిని అభినందించారు. మెరుగైన సమాజం కోసం మీడియా కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ మాట్లాడారు. గతంలో 'సమాచార హక్కు చట్టం-గ్రామీణ విలేకరుల పాత్ర' అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ మీడియా రాజకీయ రంగంపైనే కాక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక రంగాలపైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సిలర్‌ కృష్ణానాయక్‌, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు తిలక్‌ మాట్లాడారు.

కామెంట్‌లు లేవు: