18, అక్టోబర్ 2014, శనివారం

చెన్నయ్‌ చేరిన జయలలిత

               బెంగుళూరు పరప్పన అగ్రహార జైలునుంచి 2014 అక్టోబర్‌ 18న  విడుదలయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిఅన్నా డిఎంకె అధినేత్రి జయలలిత చెన్నయ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆదాయాన్ని మించి అక్రమ ఆస్తులున్నాయని సెప్టెంబర్‌ 27న ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు ఆమెను జైలుకు తరలించారు. ఆమెకు నాలుగేళ్లు శిక్షవిధించిన విషయం తెలిసిందే. బెయిలుకోసం బెంగుళూరు హైకోర్టును ఆశ్రయించగా తిరష్కరించారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 17న బెయిలు మంజూరయింది. 18న బెయిలు పత్రాలు అందిన వెంటనే బెంగుళూరు జైలు నుంచి విడుదల చేశారు. జయలలితకు  చెన్నయ్‌ విమాశ్రయంలో  కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా  పార్టీ కార్యకర్తలు, అభిమానులు విమానశ్రయంనుంచి నివాసం వరకు మానవహారం చేపట్టారు.  ఈసందర్భంగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు.

కామెంట్‌లు లేవు: