17, ఏప్రిల్ 2015, శుక్రవారం

‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

                                                                           మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా గద్దె రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక య్యారు. ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో పదవిని కైవసం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌.. ఎన్‌టిఆర్‌ స్ఫూర్తితో పేద కళాకారులను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చి నప్పుడే నిజమైన విజయం సాధించినట్లుగా పేర్కొన్నారు. ‘మా’ ప్రధాన  కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికవగా, కార్యనిర్వహణ ఉపా ధ్యక్షుడిగా తనికెళ్ల భరణి, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు గెలుపొందారు. రెండు నెలలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడిరది. గత నెల 29న జయసుధ, రాజేంద్రప్రసాద్‌ మధ్య నువ్వా` నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో రాజేం ద్రప్రసాద్‌ విజయం సాధించారు. అసోసి యేషన్‌లో మొత్తం702 ఓటర్లకు 394మంది ఓటు హక్కు వినియెగించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌కు 237 మంది, జయసుధకు 152 మంది ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీపడిన మూడో అభ్యర్థి బొమ్మరిల్లు ధూళిపాళకు ఐదు ఓట్లు పడ్డాయి. 7 రౌండ్లలో ఓట్లను లెక్కించగా..ప్రతి రౌండ్‌లోనూ రాజేంద్రప్రసాద్‌ ఆధిక్యాన్ని కనబర్చారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మి, శివకుమార్‌ ఏకగ్రీవం కాగా.. 168 ఓట్ల మెజార్టీతో కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులుగా నరేష్‌, రఘుబాబు గెలుపొందారు.కాగా, విశేషం ఏమంటే... అధ్యక్షుడిగా రాజేంద్ర పసాద్‌, కార్యదర్శిగా కాదంబరికిరణ్‌.తోపాటు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఇద్దరు ముగ్గురు మినహా... మిగిలిన బాడీ అంతా జయసుధ ప్యానల్‌ గెలుచుకుంది.  జయసుధకు 152 మంది ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీపడిన మూడో అభ్యర్థి బొమ్మరిల్లు ధూళిపాళకు ఐదు ఓట్లు పడ్డాయి. 7 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. ప్రతి రౌండ్‌లోనూ రాజేంద్రప్రసాద్‌ ఆధిక్యాన్ని కనబర్చారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మి, శివకుమార్‌ ఏకగ్రీవం కాగా.. 168 ఓట్ల మెజార్టీతో కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులుగా నరేష్‌, రఘుబాబు గెలుపొందారు. కాగా, విశేషం ఏమంటే... అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌, కార్యదర్శిగా కాదంబరికిరణ్‌.తోపాటు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఇద్దరు ముగ్గురు మినహా... మిగిలిన బాడీ అంతా జయసుధ ప్యానల్‌ గెలుచుకుంది.
                                                               అర్జునిడిలా ఎదుర్కొన్నా...
             ఈ విజయం ఓటర్లదేనని రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ధర్మయుద్ధం లాంటి ఈ ఎన్నికల్లో తనను ఓడిరచేందుకు కౌరవుల్లా ప్రత్యర్థి వర్గం ఎంతో ప్రయత్నించిందని ఆరోపించారు. అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిగా ఎదుర్కొని గెలుపొందానని తెలిపారు. ఎన్‌టిఆర్‌ ఆశీస్సులతో బరిలో దిగిన తాను.. ఆయన స్ఫూర్తితో ‘మా’ అసోసియేషన్‌కు సేవలందించనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్‌ సొమ్ములోని ప్రతి పైసాను పేద కళాకారుల కోసం ఖర్చుపెడతానని చెప్పారు.  అసోసియేషన్‌ డబ్బులతో టీ కూడా ముట్టుకోనన్నారు. తన విజయానికి నాగబాబు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరులేనని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ విజయంపై సంతృప్తి వ్యక్తం చేసిన ‘మా’ మాజీ అధ్యక్షుడు మురళీమోహన్‌.. గెలుపోటములతో సంబంధం లేకుండా అంతా అసోసియేషన్‌కు సేవ చేయాలని సూచించారు. నూతన కమిటీకి తనవంతుగా సలహాలు, సూచనలు  అందించేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన ఈ సినీ కళాకారుల సంఘం... రెండేళ్ళ పాటు తన కార్యకలాపాలను కొనసాగించనుంది.

కామెంట్‌లు లేవు: