2, అక్టోబర్ 2016, ఆదివారం

ప్రజాపాటల ఉద్యమగొంతుక మూగబోయింది

ఆర్‌.ఏ.వాసుదేవుడు కన్నుమూత

                ప్రజానాట్యమండలి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆర్‌.ఏ వాసు ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. జనంభాషలో జానపదాలు రాస్తూ ఇప్పటివరకు 30 పాటల సీడీలు రికార్డు చేయడం మామూలు విషయం కాదు. జానపద సాహిత్యంలో ఈయన పాటలు చరిత్రను సృష్టించాయి. అంతటి కవి, పల్లెపాటల ప్రజాకవి మన జిల్లాలో ఉన్నాడంటే ఎవరబ్బా అని ఆలోచిస్తారు. ఆహర్యాన్ని చూసి ఈయనేం రాశాడబ్బా అనుకుంటారు. కాని ఆ రచయిత గూర్చి చెప్పాలంటే ఎన్ని పుటలైనా సరిపోవు. చెమటచుక్కల్ని అక్షరాలుగా పేర్చగలడు. కన్నీళ్ళను ఆనందభాష్పాలుగా మార్చేయగలడు. కొట్టంబడిలో సదువుకున్నది ఐదేండ్ల సదువు ఐదవతగతి అయినా ఆయన రాసిన పాటలు తొలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రగతిశీ ప్రజాతంత్ర ఉద్యమాల్లో వందలాది మంది కార్యకర్తల గొంతుకల్లో చైతన్యగీతాలై ప్రజల పక్షాన పోరాడతాయి. ప్రజా సమస్యల్ని చాలా దగ్గర్నుంచి చూసి పాటల్ని అల్లేస్తాడు. తిరిగి వాటికి అక్షరరూపమిచ్చి పాడతాడు రాళ్ళపోగు అన్నవరం వాసుదేవుడు అలియాస్‌ ఆర్‌.ఏ.వాసు
                 ‘అమ్మనేను ఆగమైతి అక్షరాలు రెండు నేర్వక..’ అనే పాట చాలా మంది వినే వుంటారు. ఈ పాట నేటికీ బాలకార్మక కష్టాు తెలిపే ఉద్యమగీతం. కర్నూలు జిల్లాలోనే తొలిసారిగా బాకార్మికగీతంగా చరిత్రకెక్కింది. ఈపాటలు రాసిన ఆర్‌ఏ వాసు 1972 జూన్‌ 1న కర్నూలు ప్రజా ఉద్యమకేంద్రం ఇందిరాగాంధీ నగర్‌లో పెద్దయ్య, బీసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి కర్నూలు ప్రభుత్వ ప్రెస్‌లో మజ్ధూర్‌గా పని చేసేవారు. మహబూబ్‌నగర్‌ జిల్లా తుమ్మ్లెల వీరి స్వగ్రామం. వాసు పూర్వీకులు కర్నూలుకు వస వచ్చారు. ఇందిరాగాంధీనగర్‌లోని ప్రాథమికపాఠశా పూరిగుడిసెలో నిర్వహిస్తున్న పాఠశాలలో ఐదవతరగతి వరకు చదువుకున్నాడు. చదువు ఒంటబట్టని ఆయన ప్రజాఉద్యమాలవైపు ఆకర్షితుయ్యారు. 1989లో డివైఎఫ్‌ఐ సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం పేపర్‌మ్లిలు కార్మకులు ఇందిరాగాంధీనగర్‌లో నృత్యం నేర్చుకునే వారు. ఆ సందర్భంలో ‘లాల్‌ లాల్‌ జెండా’ అనే నృత్యరూపకంలో ఒక నటుడు అవసరమైతే వాసును తీసుకున్నారు. నటుడిగా తనప్రతిభ చూపించారు. తర్వాత పీర్‌లెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రమహాసభ సందర్భంగా విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో నర్స్‌పాత్ర వేశారు. 1990 కర్నూలు జిల్లాలో జరిగిన అక్షరాస్యత ఉద్యమంలో నటుడిగా కళాజాతాలో తిరుగుతూ రిసోర్స్‌ పర్సన్‌ గా నియమితులై 12 మందికి శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో వేసిన పల్లెసుద్దు గ్రామాల్లో ఎంతో పేరు తెచ్చాయి. అనంతరం పొదుపులక్ష్మీ కళాజాతకు సన్నాహకంలో రచయితగా అరంగేట్రం చేస్తూ నా బంగరు తల్లీ అనే ప్లల వితోకూడుకున్న పాటను రాసి అందరిచే మెప్పు పొందారు. ప్రజా ఉద్యమంలో పరిచయమైన సుజాతతో మనసు కలిపాడు. మనువాడారు. ఆమేకూడా తీయనైనగొంతుతో ప్రజా ఉద్యమగీతాలను ఆపించే సుప్రసిద్ద ప్రజాపాట గాయని. వారికి ఇద్దరు అమ్మాయిలు హరి, వెన్నెలు కూడా చిరుగొంతుతో పాటను ఆపిస్తూ తీయని స్వరా మధురానుభూతు జ్లు కురిపిస్తారు. వాసు పర్యావరణ ఆవశ్యకతను తెలియజేస్తూ వానదేవుడు అనే నాటకం రాశారు. ఇక పాటతోనే చైతన్యం కలిగించాని జనం నుడిలో, జనంయాసలో, జనం భాషలో పాటు రాసే రచయితగా స్థిరపడ్డారు. వాసు రాసిన పాట అంశాన్నీ సామాజిక సమస్యలే. కులవివక్ష, వరకట్నం, మూఢనమ్మకాు, నిరక్షరాస్యత, అధిక ధరలు తదితర వాటిపై ఇప్పటివరకు వంద పాటలు రాశారు. వామపక్ష ఉద్యమగేయాలు , హమాలీ, చేనేత, రజక వృత్తుల స్థితిగతుపై, కరవు, వ్యవసాయకూలీ సమస్యు, రైతు సమస్యు, నీళ్ళు, కుటుంబనియంత్రణ, మహిళాసమస్లలు అదీ ఇదీ అనకుండా సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సామాజిక సమస్యను పాటుగా రాశారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన పాట చూడండి...
నా సెమట సుక్కో నా సెమట సుక్కో
ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా సెమట సుక్కా
అంటరానిదంటే అగ్గయి మండే నా సెమట సుక్కా... ఈ పాట విన్న ప్రముఖపాట రచయిత సుద్దాల అశోక్‌తేజ పాటురాసే రచయితకు పాఠ్యాంశమన్నారంటే ఈ పాటలోని సాహిత్యం భాష, జానపదబాణీ అనిర్వచనీయం. ఈ పాట చరణంలో చిత్రకారుల కుంచెలో శిలకూపిరిపోసే శ్పిుల్లో/ వెండిబంగారా వన్నెల్లో కొండజాతి గుండె చిన్నెల్లో/ అందా బొమ్మల్లో ముత్యా ముగ్గులో/ఇంపుగా మురిసింది నా సెమట సుక్కా/ కెంపై మెరిసింది నా సెమటసుక్కా చరణాలు అద్దేపల్లి లాంటి కవు విని అబ్బురపడి వాసును వెన్నుతట్టి ప్రోత్సహించి ప్రజాపాట పూదోట అని అభివర్ణించారు. గతేడాది విశాఖపట్నంలో జరిగిన సిపిఎం ఆలిండియా మహాసభల్లో వాసు కుటుంబం పాటులు పాడి అలరించింది. ఇటీవల అకాల మరణం పొందిన మహిళా ఉద్యమనేత క్ష్మ(క్ష్య)మ్మ పై ఆర్‌ఏ. వాసు రాసిన పాట కమ్యూనిస్ట్‌ పార్టీ కుటుంబసభ్యుల్ని కంటతడి పెట్టించింది. ఆ పాట...
అమ్మా ఓ చ్చుమమ్మ
కన్నీళ్ళకు సెలవమ్మ
చెబుతున్నా నిజమమ్మా

ఉద్యమాలకు ఊపిరిమ్మ... ఆమెపై ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టుకుని అక్షరనీరాజనాలర్పిస్తూ రాసిన వాసును సుప్రసిద్ద పాటలరచయిత అని అనకుండా ఎలా ఉండగల. సన్మానాలకు, సత్కారాలకు దూరంగా వుంటూ, ప్రజాపాటలే ఆహారంగా ఆహర్యంగా ప్రజా ఉద్యమాలే ఊపిరిగా బతుకుతూ ఒకపక్క ప్రజానాట్యమండలిలో క్రియాశీలక నాయకుడిగా బాధ్యతల్లో వుంటూ, మరోపక్క కర్నూలు ప్రజాశక్తి దినపత్రికకు క్చరల్‌ విలేకరిగా పని చేసిన ఆర్‌.ఏ. వాసు ఆకాలమరణం. ప్రజాతంత్ర ూద్యమానికి తీరని లోటు. ప్రజాశక్తి దినపత్రిక కర్నూలు టాబ్లాయిడ్‌లో నిర్వహించే ‘కర్నూలు కవనం’ శీర్షికకు ఈ ఏడాది మే నెలలో కెంగారమోహన్‌ రాశారు.

2 కామెంట్‌లు:

panuganti చెప్పారు...

Badakaram

GARAM CHAI చెప్పారు...

so sad
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg