30, డిసెంబర్ 2010, గురువారం

చరిత్ర సృష్టించిన డిసెంబర్‌ 30

రైతుకోసం భారీ సభ: ఈ ఏడాది డిసెంబర్‌ 30 చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ' రైతుకోసం ' సభ నిర్వహించారు. దీనిని టిడిపి, వామపక్షాల ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ , టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, ఆర్‌ఎల్‌డి నేత అజిత్‌సింగ్‌, ఎండిఎంకె నాయకులు గణేష్‌మూర్తి, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు దేవరాజన్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమ నిర్మాణానికి వివిధ పార్టీల జాతీయనేతలు పిలుపునిచ్చారు. ఆత్మహత్యల బాటపట్టిన అన్నదాతలను కాపాడేందుకు జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు. ఈ ఉద్యమానికి అందరం తోడుగా నిలుస్తామని ఉద్ఘాటించారు.అన్నదాతల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకు పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. తుపానులకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరించడాన్ని అన్నిపార్టీల నేతలు తప్పుబట్టారు. తక్షణం పరిహారాలు ఇచ్చి ఆదుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సభకు హాజరైన ప్రజానీకం ఆద్యంతం ఆసక్తిగా నేతల ఉపన్యాసాలు విన్నారు.
చిదంరం చేతికి శ్రీకృష్ణకమిటీ నివేదిక
ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ప్రదేశ్‌ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ సభ్యులు గడువుకు ఒకరోజు ముందుగా, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి గురువారమిక్కడ నివేదికను సమర్పించారు. జనవరి 6న నివేదికను బహిర్గతం చేస్తామని, అదే రోజు ఆంధ్రప్ర దేశ్‌లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అనంతరం చిదంబరం ప్రకటించారు.
కృష్ణా టిబ్యునల్‌ తీర్పు వెల్లడి
 65శాతం ఆధారపడిన ( డిపెండబిలిటీ) నీటిపై లెక్కలు గట్టి కృష్ణానదిలో 2,578 టిఎంసీల నికర జలాలు ఉన్నట్లు తేల్చింది. నికర జలాలను ఆంధ్రప్రదేశ్‌కు 1,001, కర్నాటకకు 911, మహారాష్ట్రకు 666 టింఎసీలుగా పంపిణీ చేసింది. 
 మిగులు జలాలను 448 టిఎంసీలుగా లెక్కతీసి ఆంధ్రప్రదేశ్‌కు 190, కర్నాటకకు 177, మహారాష్ట్రకు 81 టిఎంసీలను కేటాయించింది. కర్నాటక నిర్మిస్తున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 524.256మీటర్లకు పెంచుకోవడానికి అనుమతించింది. ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయడానికి 'కృష్ణా జలాల నిర్ణయాల అమలు బోర్డు'ను కేంద్రం నియమించాలి. తుంగభద్ర ఎడమ కాలువ. రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ కూడా తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. చెన్నై నగర తాగునీటి అవసరాలకు నీటి సరఫరా బాధ్యత మూడు రాష్ట్రాలకు పంచింది.
కణ్ణబీరన్‌ మృతి
 కణ్ణభీóరన్‌ 1929 నవంబర్‌ 9న... నెల్లూరులోని స్టోన్‌హౌస్‌ పేటలో జన్మించారు. తార్కుండే కమిటీ, భార్గవ కమిషన్‌లకు కార్యదర్శిగా పనిచేసిన కన్నాభిరాన్‌ 1981 అక్టోబర్‌లో బీహార్‌లోని పాట్నా జిల్లాలో రైతు కూలీలపై జరిగిన కాల్పుల్లో పియూసిఎల్‌లో నిజనిర్ధారణ బృందానికి నేతృత్వం వహించిన కన్నాభిరాన్‌. పియూసిఎల్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో పియుసిఎల్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  కన్నాబిరాన్‌పై 'ది అడ్వకేట్‌' పేరుతో గంటన్నర నిడివి గల డాక్యుమెంటరీ తీసిన దీపాధన్‌రాజ్‌. కన్నాబిరాన్‌ కుటుంబాన్ని హతమారుస్తామని 2003 అక్టోబర్‌లో బెదిరింపు కాల్‌. ఆగంతకులు బెదిరించిన మడమతిప్పని కన్నాబిరాన్‌. బాలగోపాల్‌తో కలిసి పౌరహక్కుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.  మూడున్నర దశాబ్దాలుగా న్యాయవాదిగా, పౌరహక్కుల పోరాట యోధుడిగా పనిచేశారు.  1968-2005 హక్కుల కార్యకర్తల తరఫున వందలాది కేసులు వాదించిన కన్నాబిరాన్‌. 1978-94 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన జగన్‌
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బృందం డిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌సిపి నేత శరత్‌ పవార్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది.
రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తరువాత కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించినా ఆమోదిద్దామని, ఇష్టానుసారం మాట్లాడకుండా సంయమనం పాటించాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. దీనికి మంత్రులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ మనుగడపై రహదారుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై ప్రధానంగా చర్చ జరిగింది. ధర్మాన మాట్లాడుతూ ''కొన్ని పార్టీల నేతలు రెచ్చగొడ్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రజల హక్కులకు భంగం కలగకుండా భరోసా ఇవ్వాలి. ఇందులో విఫలమైతే పరిస్థితి చేయి దాటిపోతుంది. పాలన ఎవరి చేతుల్లోకైనా వెళ్ళిపోయే ప్రమాదముంటుంది. దీనిపై ప్రభుత్వపరంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందాం'' అని సహచరులకు సూచించారు.

కామెంట్‌లు లేవు: