శ్రీకృష్ణ కమిటీ నివేదికతో ఏదో జరుగుతుందని. ..తెలంగాణాకు అనుకూలంగా రాకుంటే యుద్ధమేనని కెసిఆర్ ప్రకటనకు భయపడుతున్నారా?. ఇంతకు తెలంగాణాకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎందుకు ఆ కమిటీ నివేదిక వస్తుందనుకుంటున్నారు.? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన మొక్కుబడి కమిషన్. ఎన్నికమిషన్లు వేశారు. ఏం తేల్చాయని. కాంగ్రెస్ అనుకుంటేనే ఏదో ఒకటి అవుతుంది తప్ప. శ్రీకృష్ణకమిటీ నివేదిక ఆధారంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేదు. ఇవ్వకూడదని లేదు. ప్రాంతాల వారీగా కమిటీ ప్రజల, రాజకీయ పార్టీల, సంఘాల, ఉద్యోగుల తదితరుల మనోభావాలు తెలుసుకున్నది. ఎన్నికలకు ముందు ఒక్క సిపిఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా కావాలనే చెప్పాయి. సిపిఎం కూడా ఒకటి స్పష్టం చేసింది. మాప్రమేయం లేకుండా పాలకులు ఎన్నోనిర్ణయాలు తీసుకున్నారు. అమలు చేశారు. ముందుగా శాసనమండలి వద్దని సిపిఎం చెప్పింది. అయినా ఆగిందా? అమలు చేశారు. ప్రపంచబ్యాంకు ఒప్పందాలు ప్రమాదకరమని, అణుఒప్పందం నష్టదాయకమని చెప్పినా వినలేదు. రాష్ట్రం విడిపోవడానికి తాము వ్యతిరేకం కాని విడగొడితే తాము చేసేదేమి లేదని స్పష్టం చేసింది. మిగతా పార్టీలన్నీ ప్రత్యేక రాష్ట్రానికి తలూపి తరువాత ప్రాంతాల వారీగా మాట మార్చాయి.
శ్రీకృష్ణ కమిటీ పరిశీలనలను ప్రభుత్వం ముందు పెడుతుంది. కాని నిర్ణయించేది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ప్రయోజనానికే పెద్దపేట వేస్తుంది. ప్రజల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోపోవచ్చు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలను కుంటే ఉంచవచ్చు. విడగొట్టాలనుకుంటే విడగొట్టవచ్చు. కాని జనాన్ని ఇంతరెచ్చగొట్టి ఉద్యమాలవైపు మళ్లించాక గొడవలు చేయకుండా ఉంటారా? ఉన్నా తెలంగాణా తెస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ప్రశాంతంగా ఉండనిస్తారా? అనేది ప్రశ్న.
ఏది చేయాలన్నా పోలీసు బలగాలను పెట్టి ఆందోళన కారులను అదుపులో పెట్టవచ్చు. మధ్యన ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా చూడవచ్చు. శ్రీకృష్ణ కమిటీ బూచీతో 2013 వరకు మరో పరిశీలన కమిటీ వేసి కాలయాపన చేయవచ్చు. 2014లో ప్రత్యేక రాష్ట్రం చేయవచ్చు చేయక పోవచ్చు. ఇవ్వన్ని కాదనుకుంటే ముందుగానే కేంద్రం శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చిన రోజే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలి. కమిటీ ఏ నివేదిక ఇచ్చినా ఆమోదిస్తామని చెప్పిన రాజకీయ పార్టీల నాయకులను సమావేశ పరిచి సరయిన నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి.
శ్రీకృష్ణ కమిటీ పరిశీలనలను ప్రభుత్వం ముందు పెడుతుంది. కాని నిర్ణయించేది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ప్రయోజనానికే పెద్దపేట వేస్తుంది. ప్రజల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోపోవచ్చు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలను కుంటే ఉంచవచ్చు. విడగొట్టాలనుకుంటే విడగొట్టవచ్చు. కాని జనాన్ని ఇంతరెచ్చగొట్టి ఉద్యమాలవైపు మళ్లించాక గొడవలు చేయకుండా ఉంటారా? ఉన్నా తెలంగాణా తెస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ప్రశాంతంగా ఉండనిస్తారా? అనేది ప్రశ్న.
ఏది చేయాలన్నా పోలీసు బలగాలను పెట్టి ఆందోళన కారులను అదుపులో పెట్టవచ్చు. మధ్యన ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా చూడవచ్చు. శ్రీకృష్ణ కమిటీ బూచీతో 2013 వరకు మరో పరిశీలన కమిటీ వేసి కాలయాపన చేయవచ్చు. 2014లో ప్రత్యేక రాష్ట్రం చేయవచ్చు చేయక పోవచ్చు. ఇవ్వన్ని కాదనుకుంటే ముందుగానే కేంద్రం శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చిన రోజే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలి. కమిటీ ఏ నివేదిక ఇచ్చినా ఆమోదిస్తామని చెప్పిన రాజకీయ పార్టీల నాయకులను సమావేశ పరిచి సరయిన నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి.
3 కామెంట్లు:
emee avvadu
ఏమి జరగనపుడు ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నారు.
please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.
కామెంట్ను పోస్ట్ చేయండి