వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల
1987-89 పూర్వవిద్యార్ధుల సమ్మేళనం
1987-89 పూర్వవిద్యార్ధుల సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్
మహబూబ్నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1987-89
సవంత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన ఎంపిసి, బైపిసి విద్యార్థుల సమ్మేళనం
అత్యంత వైభవంగా జరిగింది. (21-10-2012) ఆదివారం వనపర్తి చిట్యాల రోడ్డులోని
స్టార్ పంక్షన్హాలులో జరిగిన ఈ సమ్మేళనానికి దాదాపు 70 మంది
పూర్వవిద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయ, న్యాయవాద, జర్నలిజం,
రియల్ఎస్టేట్ , వ్యాపార తదితర వృత్తులో స్థిరపడిన పలువురు 23 సంవత్సరాల
తరువాత కలుసుకుని పరిచయం చేసుకోవడం అత్యంత అనందాన్ని కలిగించిందని
మాట్లాడుతూ చెప్పారు. వారివారి విద్యార్థి దశల్లోని అనుభవాలను, జ్ఞాపకాలను
నెమరు వేసుకున్నారు. నరేష్, వసంత్, ప్రవీణ్, అయోద్యరామ్, అరుణ్,
కిరణ్, రవీందర్, రాము, పానుగంటి చంద్రయ్య, నవీన, మంజుల, సునీత, వేదవతి,
విజయలక్ష్మి, నాగరాణి, ఎం.శ్రీదేవి, అనంద్, ఎల్.రమేష్ , భాస్కర్
తదితరులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పేరు వారి హోదా, ప్రస్తుతం పని చేసే
ప్రదేశం చెప్పారు. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 1987-89
బ్యాచ్ 2014 నాటికి ఇంటర్మీడియట్ పూర్తయి 25 సంత్సరాలు పూర్తయిన
సందర్భంగా సిల్వర్జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించారు. ఆబ్యాచ్
సమయంలో పని చేసిన అధ్యాపకులను సన్మానించాలని, అప్పటి బ్యాచ్లో చనిపోయిన
వారి కుటుంబాలను ఏదో రూపంలో ఆదుకోవాలని అనుకున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి