30, నవంబర్ 2012, శుక్రవారం

మాజీ ప్రధాని ఐ కె గుజ్రాల్‌ కన్నుమూత

                   భాతర మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధితో హర్యానా రాష్ట్రం గుర్గావ్‌లోని ఆ సుపత్రిలో చికిత్స పోదుతూ తుదిస్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రెల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పని చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. 1919 డిసెంబర్‌ నాలుగున జన్మించిన ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీసింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవేగౌడ తరువాత యునైటెడ్‌ ప్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్‌ సతీమణి షీలాగుజ్రాల్‌ పంజాబీ , హిందీ, ఆంగ్ల తదితర బాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీష్‌ గుజ్రాల్‌ ప్రముఖ చిత్రకారుడు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్‌ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నారు. అనంతరం కొంతకాలం సోవియట్‌ యూవియట్‌ యూనియన్‌లో భారత రాయభారీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. వీపీసింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌లో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవేగౌడ సారధ్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ప్రంట్‌ సర్కారులోనూ విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. గుజ్రాల్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.

కామెంట్‌లు లేవు: