22, జనవరి 2013, మంగళవారం

ఆకలిపై పోరుకు సిద్ధం

డిక్రీజారీ చేసిన మెక్సికో అధ్యక్షుడు

                   ఈ 21వ శతాబ్దంలో కూడా లక్షలాదిమంది మెక్సికన్లు ఆకలి, దారిద్య్రాలతో బాధపడడం దురదృష్టకరమని మెక్సికో అధ్యక్షుడు పెనా నిటో వ్యాఖ్యానించారు. 'ఆకలిపై జాతీయ పోరాటం' పేరుతో బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన డిక్రీపై ఆయన సంతకాలు చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తమతో చేతులు కలపాల్సిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత తక్కువగా అభివృద్ధి సాధించిన కమ్యూనిటీలకు మద్దతునివ్వాల్సిందిగా కోరారు. చిపాస్‌ రాష్ట్రం దేశానికి అవసరమైన విద్యుత్‌లో 50శాతం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ప్రతి నలుగురిలో ముగ్గురు దారిద్య్రంలో బతుకీడుస్తున్నారని, ముగ్గురిలో ఒకరిది దుర్భర దారిద్య్రమని అన్నారు. తగినంత ఆహారం ప్రతి ఒక్కరికీ లభించాలన్నది రాజ్యాంగంలోని రెండవ చాప్టర్‌ కింద పేర్కొన్నారని, కానీ ఈ మానవ హక్కు పూర్తిగా విస్మరించబడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన ఈ దేశవ్యాప్త పోరాటాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది సాయం కాదని, సామాజిక సంక్షేమానికి సంబంధించిన సమగ్ర వ్యూహమని పేర్కొన్నారు. మెక్సికన్ల అవసరాలను తీర్చడానికి అనేక కార్యక్రమాలు, పథకాలతో, లక్ష్యాలతో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

కామెంట్‌లు లేవు: