19, నవంబర్ 2018, సోమవారం

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు

20న పరిశీలన

 21,22 తేదీల్లో నామినేష్ల ఉపసంహరణ

               తెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీక ఘట్టమైన నామినేషన్ల దాఖలు పర్వం సోమవారం 19-11-2018న పూర్తయింది.  ఈ నెల 12వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.  వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18-11-18 నాటికి  1497 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం  మూడు గంటల వరకు నామపత్రాలను స్వీకరిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు పులవురు మంత్రులు, సీనియర్‌ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరికొంత మంది తమ నామపత్రాలను సమర్పించనున్నారు. కొందరు అభ్యర్థు మంచిరోజు, ముహూర్తాలను ద్రుష్టిలో పెట్టుకొని తమ కుటుంబసభ్యుల, అనుచరుల ద్వారా ఇప్పటికే నామినేషన్లు వేయించారు. తాజాగా చివరి రోజు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. జనాన్ని సమీకరించి భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసి అభ్యర్థుల బప్రదర్శన చేశారు.
         అటు కొన్ని పార్టీలు అభ్యర్థిత్వాలను ఆదివారం  ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో వారందరూ  నామపత్రాలు సమర్పించారు. బీఫారాలు ఇవ్వకుండా కేవం నామినేషన్‌ వేసిన వారు ఇవాళ బీఫారాలు సమర్పించారు. నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ పూర్తయ్యాక రేపు పరిశీన చేపడతారు. 21, 22 తేదీల్లో నామపత్రాలు ఉపసంహరణకు గడువు ఉంటుంది.
    కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు ఇవాళ్టి నుంచి అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారు. 53 మంది వ్యయ పరిశీలకులు నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలోనే మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా సాధారణ పరిశీలకులు, శాంతిభద్రత పరిశీలకులు కూడా   పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇప్పటికే 68 మంది సాధారణ పరిశీలకులు, పది మంది శాంతిభద్రత పరిశీలకులు జిల్లాలకు చేరుకున్నారు. రెండు, మూడు నియోజకవర్గాలకు ఒక సాధారణ పరిశీలకులు, ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున శాంతిభద్రతల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

కామెంట్‌లు లేవు: