5, డిసెంబర్ 2018, బుధవారం

21న బ్యాంకుల దేశ వ్యాప్త సమ్మె


           ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. మూడు బ్యాంకుల ప్రతిపాదిత విలీనాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరు 26న దేశవ్యాప్త సమ్మె తలపెట్టినట్లు బ్యాంకు యూనియన్లు గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిసెంబరు 21న కూడా సమ్మె చేయనున్నట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌(ఐఏబీఓసీ) బుధవారం ప్రకటించింది. స్కేల్‌ 4, ఆపై ఉద్యోగుల వేతనాల విషయంలో ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సమ్మె చేయనున్నట్లు ఏఐబీఓసీ నోటీసులు విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. సమ్మె ప్రభావం బ్యాంకులపై ఎక్కువగా పడనుంది. ఈ ప్రకారం డిసెంబరు 21 నుంచి డిసెంబరు 26( డిసెంబరు 24, సోమవారం మినహా) వరకు బ్యాంకులు  నిచేయకపోవచ్చు. 22, 23 శని, ఆదివారాలు కావడం, మంగళవారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఐబీఏ తీరును యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) కూడా వ్యతిరేకించింది. విజయా బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రతిపాదిత విలీనాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరు 26న యూఎఫ్‌బీయూ సమ్మె నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

కామెంట్‌లు లేవు: