30, డిసెంబర్ 2018, ఆదివారం

ఆ 3 దీవుల పేర్లు మారాయి

 
                   పోర్ట్ బ్లెయిర్ : అండమాన్, నికోబార్ దీవుల్లో మూడింటికి ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టింది. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ పోర్ట్‌ బ్లెయిర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ రాస్ ఐలాండ్‌కు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ ద్వీప్ అని, నీల్ ఐలండ్‌కు షహీద్ ద్వీప్ అని, హవలోక్ ఐలండ్‌కు స్వరాజ్ ద్వీప్ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు.
               ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్ళను, రూ.75 నాణేన్ని మోదీ విడుదల చేశారు. బోస్‌ పేరుపై డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు మోదీ మెరీనా పార్క్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయనకు నివాళులర్పించారు.

కామెంట్‌లు లేవు: