7, జనవరి 2019, సోమవారం

ఆకలికి తట్టుకోలేక.....


                 దేశంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడం లేదు అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఆకలికి తట్టుకోలేని చిన్నారులు పురుగుల మందు తాగిన సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ సమితి ( ఎన్‌సీపీసీఆర్‌) తెలిపిన వివరాల ప్రకారం... డిసెంబర్‌ 31న మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కొందరు గిరిజనులకు రేషన్‌ దుకాణాల నుంచి అందవలసిన సరుకులు అందలేదు. దీంతో  చాలా కుటుంబాలు ఆకలితో పస్తులుంటున్నాయి. ఆ కుటుంబాల్లోని కొందరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక పంటపొలాల్లో ఉపయోగించే పురుగుల మందు తాగారు. పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

కామెంట్‌లు లేవు: