6, జనవరి 2019, ఆదివారం

రైల్వే స్టేషన్లకు 20 నిమిషాల ముందు రావాల్సిందే



                    విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఎదుర్కొనే భద్రతా నిబంధనలను ఇకపై రైల్వే స్టేషన్లలోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రైల్వేశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకుంది. విమానాశ్రయాల్లో విమానం బయలుదేరే నిర్దిష్ట సమయానికి గంటల వ్యవధి ముందే సెక్యూరిటీ చెక్‌ ప్రక్రియ కోసం ప్రయాణికులు చేరుకోవాలనే నిబంధన ఉంది. అదే విధానాన్ని రైల్వే స్టేషన్లలోనూ అమలు చేయనున్నారు. దీని ప్రకారం ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకొని సెక్యూరిటీ చెక్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలుత ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ నెలలో అమలు చేయనున్నారు. దీంతో పాటు కర్ణాటకలోని హూబ్లీ సహా మరో 202 స్టేషన్లనూ ఎంపిక చేశామని రైల్వే భద్రతాదళ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు.

కామెంట్‌లు లేవు: