ఆమె
పేరు మిరియమ్..అతని పేరు పీటర్..ఇద్దరికీ 30 ఏళ్ల వయసు తేడా. ఉన్నతస్థాయి
ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. కానీ ఏదో తెలియని అసంతృప్తి. జీతానికి,
జీవితానికి మధ్య తేడాను గమనించడం మొదలుపెట్టారు. అంతే..చేస్తున్న
ఉద్యోగాల్ని మానేసి, ఉంటున్న ఇంటిని వదిలేసి అప్పటి వరకు దాచుకున్న డబ్బుతో
సంచారకులుగా జీవితాన్ని ప్రారంభించారు. అలా వేరు వేరు చోట్ల 12 ఏళ్ల
క్రితం కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన వారు ప్రస్తుతం సహజీవనం చేస్తూ
ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. పంచభూతాల మాదిరిగా వాళ్లకు కూడా పర్మనెంట్
అడ్రస్ అంటూ ఏమీ లేదు. ప్రపంచమంతా వారిదే..వారిద్దరి కథలు వేరైనా..గమ్యం
మాత్రం ఒకటే.
న్యూజిలాండ్కు చెందిన పీటర్కు ఇప్పుడు 64 ఏళ్లు. ముప్పై సంవత్సరాల క్రితం ఎకాలజీలో పీహెచ్డీ చేసిన పీటర్..లెక్చరర్గా ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. గంటకు 50 డాలర్ల జీతంతో జీవితం బానే సాగిపోతోంది. అయితే, నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేస్తున్న పీటర్..ఇదేనా జీవితం అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి నాలుగు గోడల మధ్య బతకడం జీవితం కాదని తెలుసుకున్న పీటర్ ఆ గోడలను బద్దలుకొట్టి ప్రకృతిలో భాగమవ్వాలనుకున్నాడు. అంతే..చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పేశాడు. ఇంటిని కూడా ఎవరికో అప్పగించేసి సంచారకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. అదే విధంగా నెదర్లాండ్స్లో జన్మించిన మిరియమ్ క్రీడాకారిణిగా జీవితం మొదలుపెట్టింది. కానీ, ట్రావెలింగ్ చేస్తూ బతకాలని ఆమె కోరిక. అందుకే క్రీడారంగాన్ని వదులుకుని సంచారకురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నెదర్లాండ్స్ నుంచి భారతదేశం వచ్చింది. అదే సమయంలో ఇండియాకు వచ్చిన పీటర్ను కలుసుకుంది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని కలిసి చూట్టేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇరువురూ దాచుకున్న 40,000 పౌండ్లతో ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
సంవత్సరానికి వారికయ్యే ఖర్చు కేవలం 3,000 పౌండ్లు మాత్రమే. అదెలా సాధ్యం
అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే వారు అడవులు, పర్వతాలలో నివసిస్తూ
మనుషులకు దూరంగా..ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు. ప్రస్తుతం
బల్గేరియాలోని పర్వత ప్రాంతంలో నివాసముంటున్న వారిని ఓ టీవీ ఛానల్
ఇంటర్వ్యూ చేయగా ఈ వివరాలన్నీ వెల్లడించారు. నిజానికి మిరియమ్ ఓ
వెజిటేరియన్. కానీ, అడవుల్లో జీవించడం మూలంగా ఓపిక కోసం మాంసాహారిగా
మారింది. మరియమ్, పీటర్ ఆహారం విషయంలో కూడా ఓ పద్దతిని పాటిస్తున్నారు.
వేటాడి ఆహారాన్ని తీసుకొచ్చే బాధ్యత మరియమ్ది కాగా, దాన్ని రుచిగా వండే
బాధ్యత పీటర్ది. చిన్న చిన్న జంతువులను వేటాడటానికి తనకు రెండేళ్ల సమయం
పట్టిందంటూ మరియమ్ చెప్పుకొచ్చింది. మొదట్లో వాటిని చంపడం బాధాకరంగా
అనిపించినప్పటికీ..తమ జీవనానికి తప్పడం లేదంటోంది. అయితే ట్రావెలింగ్
సమయంలో దారిలో కనిపించే స్టోర్లలో మాత్రం కావాల్సిన నిత్యవసర వస్తువులు
కొన్ని కొనుక్కుంటారు. వారి షాపింగ్లో సబ్బులు, షాంపూలు వంటివి ఉండవు.
ఎందుకంటే అడవుల్లోని ఆకులతోనే వారు ఒంటిని శుభ్రం చేసుకుంటున్నారు.
జుట్టును మాత్రం తన మూత్రంతో క్లీన్ చేసుకుంటానంటూ మరియమ్ ఆశ్చర్యకరమైన
విషయాన్ని చెప్పింది. ప్రతి రోజూ ఆఫీస్కు వెళ్లడం, ట్రాఫిక్లో గంటలు
గంటలు ఉండటం కంటే ఈ జీవితం తనకు ఎంతో తృప్తిగా ఉందంటోంది మరియమ్.
చాలామంది తమ దగ్గరున్న డబ్బు అయిపోతే ఏం చేస్తారంటూ ప్రశ్నించారని మిరియమ్, పీటర్ చెప్పారు. వారికి ఆర్థిక విషయాలపై ఎటువంటి దిగులు లేదని, డబ్బులు కావాలంటే మళ్లీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటామన్నారు. అయితే అందరూ బతుకుతున్నట్టు మాత్రం తాము బతకమని తేల్చిచెప్పారు. 30 ఏళ్ల వయసు తేడా ఉన్న వ్యక్తితో సహజీవనంపై పీటర్ను ప్రశ్నించగా..వయసుతో తనకు సంబంధం లేదంటూ..ఇలానే బతకాలి అని హద్దులు ఎవరు పెట్టారని బదులిచ్చాడు. మరోపక్క తనకు నచ్చినట్టు జీవిస్తున్నానని..తామిద్దరం ఒకరికి ఒకరు సొంతమేమి కాదని, భవిష్యత్తులో ఒంటరిగా ఉండాలనుకుంటే అలానే ఉంటానని మరియమ్ చెప్పింది. పిల్లల గురించి మాట్లాడుతూ..తనకు పిల్లల్ని కని మళ్లీ సాధారణ జీవితాన్ని మొదలుపెట్టాలనే ఆలోచన లేదంది. పీటర్ మాత్రం జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని..మళ్లీ సాధారణ జీవితానికి వెళ్లే అవకాశాలు ఉంటాయేమో అని అన్నాడు. కానీ, తనకు మాత్రం సాధారణ జీవితం ఇష్టం లేదని స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్కు చెందిన పీటర్కు ఇప్పుడు 64 ఏళ్లు. ముప్పై సంవత్సరాల క్రితం ఎకాలజీలో పీహెచ్డీ చేసిన పీటర్..లెక్చరర్గా ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. గంటకు 50 డాలర్ల జీతంతో జీవితం బానే సాగిపోతోంది. అయితే, నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేస్తున్న పీటర్..ఇదేనా జీవితం అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి నాలుగు గోడల మధ్య బతకడం జీవితం కాదని తెలుసుకున్న పీటర్ ఆ గోడలను బద్దలుకొట్టి ప్రకృతిలో భాగమవ్వాలనుకున్నాడు. అంతే..చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పేశాడు. ఇంటిని కూడా ఎవరికో అప్పగించేసి సంచారకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. అదే విధంగా నెదర్లాండ్స్లో జన్మించిన మిరియమ్ క్రీడాకారిణిగా జీవితం మొదలుపెట్టింది. కానీ, ట్రావెలింగ్ చేస్తూ బతకాలని ఆమె కోరిక. అందుకే క్రీడారంగాన్ని వదులుకుని సంచారకురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నెదర్లాండ్స్ నుంచి భారతదేశం వచ్చింది. అదే సమయంలో ఇండియాకు వచ్చిన పీటర్ను కలుసుకుంది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని కలిసి చూట్టేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
చాలామంది తమ దగ్గరున్న డబ్బు అయిపోతే ఏం చేస్తారంటూ ప్రశ్నించారని మిరియమ్, పీటర్ చెప్పారు. వారికి ఆర్థిక విషయాలపై ఎటువంటి దిగులు లేదని, డబ్బులు కావాలంటే మళ్లీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటామన్నారు. అయితే అందరూ బతుకుతున్నట్టు మాత్రం తాము బతకమని తేల్చిచెప్పారు. 30 ఏళ్ల వయసు తేడా ఉన్న వ్యక్తితో సహజీవనంపై పీటర్ను ప్రశ్నించగా..వయసుతో తనకు సంబంధం లేదంటూ..ఇలానే బతకాలి అని హద్దులు ఎవరు పెట్టారని బదులిచ్చాడు. మరోపక్క తనకు నచ్చినట్టు జీవిస్తున్నానని..తామిద్దరం ఒకరికి ఒకరు సొంతమేమి కాదని, భవిష్యత్తులో ఒంటరిగా ఉండాలనుకుంటే అలానే ఉంటానని మరియమ్ చెప్పింది. పిల్లల గురించి మాట్లాడుతూ..తనకు పిల్లల్ని కని మళ్లీ సాధారణ జీవితాన్ని మొదలుపెట్టాలనే ఆలోచన లేదంది. పీటర్ మాత్రం జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని..మళ్లీ సాధారణ జీవితానికి వెళ్లే అవకాశాలు ఉంటాయేమో అని అన్నాడు. కానీ, తనకు మాత్రం సాధారణ జీవితం ఇష్టం లేదని స్పష్టం చేశాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి