11, జనవరి 2019, శుక్రవారం

తల్లీ పిల్లల ఉసురు తీసిన ఆచారం!


రుతుక్రమం సమయంలో గుడిసెలో జీవనం 

నేపాల్‌లో ఊపిరాడక ముగ్గురి మృతి
కాఠ్‌మండూ: అనాదిగా కొనసాగుతున్న ఓ ఆచారం నేపాల్‌లో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. రుతుక్రమం సమయంలో ఆమెను వేరుగా ఓ గుడిసెలో ఉంచడంతో గాలీ వెలుతురు లేక ఊపిరాడక ఆమెతో పాటు ఇద్దరు కుమారులు (9, 12 ఏళ్ల పిల్లలు) మృతి చెందారు. బజూరా జిల్లాలో అంబా బోహోరా అనే మహిళ రుతుక్రమం నేపథ్యంలో మంగళవారం రాత్రి భోజనం అనంతరం తన ఇద్దరు పిల్లలతో నిద్రపోయేందుకు ఓ చిన్న గుడిసెలోకి వెళ్లారు. దానికి సమీపంలో చలిమంట వేయగా అక్కడ ఉంచిన ఓ దుప్పటికి నిప్పంటుకుని పొగ వ్యాపించింది. గుడిసెకు కిటికీలు లేకపోవడంతో గుడిసె అంతా పొగతో నిండిపోయింది. మరుసటి రోజు ఆమె అత్త గుడిసెలోకి వెళ్లి చూడగా ముగ్గురూ మృతి చెందారు. పొగ కారణంగా ఊపిరాడక తల్లీ పిల్లలు చనిపోయినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనపై ఓ బృందం దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు.

కామెంట్‌లు లేవు: