దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత : మోదీ
‘అరుణ్ జైట్లీ రాజకీయ దిగ్గజం. అత్యున్నత మేధో సంపత్తి గల వ్యక్తి.
దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత. సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు ఆయన
స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారత రాజ్యాంగం, చరిత్ర, ప్రజా విధానాలు, పాలనా
వ్యవహారాలపై సునిశిత విజ్ఞానం ఆయన సొంతం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన
ఎన్నో మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. అలా దేశ ఆర్థిక వృద్ధి, రక్షణ
సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించారు. భాజపాకు, జైట్లీకి
విడదీయరాని అనుబంధం ఉంది. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే దేశం కోసం
పాటుపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎంతో
శ్రమించారు. ఆయన మృతి విచారకరం. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయా’ అని మోదీ
సంతాపం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి
భాజపా సీనియర్ నేత అరుణ్జైట్లీ (66) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల
ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు
పూడ్చలేనిదన్నారు. జైట్లీ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ
చేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. జైట్లీ మృతిపట్ల
తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన
దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని
భవగంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ
సానుభూతి తెలియజేశారు.
‘అరుణ్జైట్లీ
మృతి తీవ్రంగా కలచివేస్తోంది. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు. మా కుటుంబ
సభ్యుడినే కోల్పోయినంత బాధగా ఉంది. నన్ను ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే
వ్యక్తి ఆయన’
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి