15, ఏప్రిల్ 2020, బుధవారం

లాక్‌డౌన్ 2 మార్గదర్శకాలు

            న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కొనసాగింపుపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలు కొనసాగిస్తూ మరికొన్ని జోడించింది. 

ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న గైడ్‌లైన్స్ ఇవే!

  1. విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ 
  2. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్
  3. దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి
  4. గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లలోని  పరిశ్రమల నిర్వహణకు అనుమతి
  5. పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి
  6. నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి 
  7. కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్‌ పవర్‌కు అనుమతి
  8. పట్టణ పరిధిలోని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి
  9. అన్ని రకాల ఈ-కామర్స్‌ సర్వీసులకు అనుమతి 
  10. పబ్లిక్‌లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి
  11. హాట్‌స్పాట్‌లలో నిబంధనలు మరింత కఠినం
  12. హాట్‌స్పాట్‌లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదే
  13. హాట్‌స్పాట్‌లలో జనసంచారం ఉండొద్దు
  14. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
  15. సభలు  సమావేశాలకు అనుమతి లేదు
  16. విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు
  17. మాల్స్‌, సినిమా హాళ్లు, పార్క్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేత
  18. అన్ని రకాల సభలు, సమావేశాలు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌పై నిషేధం 
  19. అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనవద్దు
  20. లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు
  21. కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
  22. 10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం
  23. సోషల్‌ డిస్టెన్స్‌ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం
  24. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి
  25. విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి
  26. వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి
  27. ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదని, 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది. 

కామెంట్‌లు లేవు: