న్యూఢిల్లీ: లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలు కొనసాగిస్తూ మరికొన్ని జోడించింది.
ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న గైడ్లైన్స్ ఇవే!
- విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్
- రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్
- దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి
- గ్రామీణ ప్రాంతాలు, సెజ్లలోని పరిశ్రమల నిర్వహణకు అనుమతి
- పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి
- నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి
- కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్ పవర్కు అనుమతి
- పట్టణ పరిధిలోని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి
- అన్ని రకాల ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతి
- పబ్లిక్లో తప్పకుండా మాస్క్లు ధరించాలి
- హాట్స్పాట్లలో నిబంధనలు మరింత కఠినం
- హాట్స్పాట్లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదే
- హాట్స్పాట్లలో జనసంచారం ఉండొద్దు
- మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
- సభలు సమావేశాలకు అనుమతి లేదు
- విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు
- మాల్స్, సినిమా హాళ్లు, పార్క్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
- అన్ని రకాల సభలు, సమావేశాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్పై నిషేధం
- అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనవద్దు
- లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు
- కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
- 10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం
- సోషల్ డిస్టెన్స్ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం
- ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి
- విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
- వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి
- ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదని, 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి