నేడు ప్రపంచ చారిత్రక కట్టడాల దినోత్సవం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూ నివర్సిటీ, అసెంబ్లీతోపాటు ఎన్నో చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా నగరం పేరు చెప్పగానే అందరి మదిలో నిలిచేది మా త్రం చార్మినార్. రాష్ట్రపటంలో ఉన్న చిహ్నం. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కట్టడ నిర్మాణానికి వెనక ఉన్న గాథ గురించి నగరవాసులు చర్చించుకుంటున్నారు. ప్రపంచ చారిత్రక కట్టడాల దినోత్సవంగా గుర్తించే ఏప్రిల్ 18 నేపథ్యంలో చార్మినార్ గురించి చర్చ ఎందుకుని భావిస్తున్నారా? చార్మినార్ కట్టడ నిర్మాణానికి ముందు మన నగరం అప్పట్లో... ప్రస్తుత పరిస్థితులే ఎదుర్కొందనే విషయం అతి తక్కువ మందికి తెలుసు.
కలరా వ్యాధి నిర్మూలనకోసం...
చార్మినార్ కట్టడ నిర్మాణం క్రీ.శ. 1591లో ప్రారంభమై 1593లో పూర్తయ్యింది. చార్మినార్ నిర్మాణం కలరా వ్యాధి నిర్మూలన కోసం ప్రారంభమైంది. 16వ శతాబ్దం చివర్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసి
ఎంతోమంది ప్రాణాలను హరించిన కలరా వ్యాధి నిర్మూలనకు కుతుబ్షాహీ వంశానికి చెందిన ఐదోరాజు కులీకుతుబ్ షా నిర్మాణం చేపట్టారు. కలరా వ్యాధి పూర్తిగా సమసిపోయిన తర్వాత చార్మినార్ను దాని గుర్తుగా గుర్తించారు. క్రమేఽణా చారిత్రక కట్టడంగా ప్రసిద్ధి గాంచి దేశ విదేశాల నుంచి మన్ననలు అందుకుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి