న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్లో తాజా పరిస్థితిపై కేంద్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్లో మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరినట్లు కేంద్రం ప్రకటించింది. భారత్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,454గా కేంద్రం వెల్లడించింది. మొత్తం భారత్లో ఇప్పటివరకూ 4,257 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. భారత్లోని 12 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాదు, మరో 78 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కొత్త కేసు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం. భారత్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతం 19.89గా కేంద్రం ప్రకటించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి