22, అక్టోబర్ 2020, గురువారం

ఉచిత వ్యాక్సిన్‌కు రూ.50వేల కోట్లు, ఒక్కొక్కరికీ రూ.450 ఖర్చు

 

న్యూఢిల్లీ: కరోనా నివారణకు వ్యాక్సిన్‌ సిద్దమయిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమౌతోందని ఎన్‌డిటివి పేర్కొంది. ప్రభుత్వ వర్గాల్లో ఉన్న వ్యక్తుల ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు 50 వేల కోట్ల రూపాయలను సిద్దం చేసిందని ఒక నివేదికలో ఎన్‌డిటివి తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలోపే ఈ డబ్బును వాడుకునేవిధంగా సిద్దం చేసిందని చెప్పింది. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు రెండు దఫాలుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దఫాల వ్యాక్సిన్‌కు ఒక్కొరికీ 150 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనికితోడు వ్యాక్సిన్‌ను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు, వాటి నిల్వ ఉంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించేందుకు ఒక్కొక్కరికీ మరో మూడు వందల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తం ఒక్కొ వ్యక్తిపై 450 రూపాయలవరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ అంచనాల మేరకే మొత్తం 50 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసుకున్నట్లుగా ఎన్‌డిటివి తెలిపింది.

కామెంట్‌లు లేవు: