ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
9, అక్టోబర్ 2020, శుక్రవారం
ఐక్య రాజ్య సమితి ఆకలిపోరాటానికి శాంతి పురస్కారం
క్యూబా డాక్టర్లను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించాలన్న ప్రపంచ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి నార్వే నోబెల్ అకాడెమీ ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్పి)కి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి విభాగమైన డబ్ల్యుఎఫ్పి ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థఅని, ఆకలిదప్పులను నిర్మూలించి, ఆహారభద్రతకు పాటుపడుతోందని నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెస్ ఆండర్సన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ దిశలో ఆ సంస్థ జరిపిన బహుముఖ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థకు ఇస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రతపై పాలకులకు మరిన్ని సందేశాలు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్పి) ద్వారా భవిష్యత్తులో ఇవ్వాలని ఆశిద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి