9, అక్టోబర్ 2020, శుక్రవారం

ఐక్య రాజ్య సమితి ఆకలిపోరాటానికి శాంతి పురస్కారం


                 క్యూబా డాక్టర్లను నోబెల్‌ శాంతి పురస్కారంతో సత్కరించాలన్న ప్రపంచ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి నార్వే నోబెల్‌ అకాడెమీ ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి)కి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి విభాగమైన డబ్ల్యుఎఫ్‌పి ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థఅని, ఆకలిదప్పులను నిర్మూలించి, ఆహారభద్రతకు పాటుపడుతోందని నోబెల్‌ కమిటీ చైర్మన్‌ బెరిట్‌ రెస్‌ ఆండర్సన్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ దిశలో ఆ సంస్థ జరిపిన బహుముఖ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థకు ఇస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రతపై పాలకులకు మరిన్ని సందేశాలు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ద్వారా భవిష్యత్తులో ఇవ్వాలని ఆశిద్దాం.

కామెంట్‌లు లేవు: