8, ఆగస్టు 2019, గురువారం

వాసిరెడ్డి పద్మకు కీలక పదవి

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వైకాపా సీనియర్‌ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమెను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పద్మ కొనసాగనున్నారు. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

కామెంట్‌లు లేవు: