23, నవంబర్ 2018, శుక్రవారం

రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చాం

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ

మేడ్చల్‌: రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చామని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ కార్తీక పూర్ణిమ, గురు నానక్‌ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత సొంతబిడ్డల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత సంతోష పడుతుందో నేను అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్ర్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’’
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తాం!‘‘ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, మీ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం మీరు చేసిన పోరాటం తెరాస ప్రభుత్వం సాకారం చేసిందా?’’
వారి‌ కుటుంబానికి ఉపయోగ పడే పనులే చేసుకున్నారు‘‘ఈ నాలుగున్నరేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతులకు నష్టం చేసింది. కూలీలకు ఎంతో మేలు చేసే ఉపాధి హామీ చట్టాన్ని కూడా తెరా అమలు చేయలేదు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులకు మాత్రమే ఉపయోగపడే పనులు చేసుకున్నారు. ఎన్నో కలలు, ఆశయాలతో తెలంగాణ ఇస్తే.. అవి సాకారం కాలేదు’’
తెరాస పాలన అంతం చేసే సమయం ఇది!‘‘చిన్న పిల్లాడి పెంపకంలో లోపం ఉంటే అతడి భవిష్యత్‌ ఎలా నాశనం అవుంతుందో ఈ నాలుగున్నర పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలతోనే తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ముడి పడి ఉంది. తెరాస పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా.’’ అంటూ తెరాస పాలనపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

19, నవంబర్ 2018, సోమవారం

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు

20న పరిశీలన

 21,22 తేదీల్లో నామినేష్ల ఉపసంహరణ

               తెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీక ఘట్టమైన నామినేషన్ల దాఖలు పర్వం సోమవారం 19-11-2018న పూర్తయింది.  ఈ నెల 12వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.  వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18-11-18 నాటికి  1497 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం  మూడు గంటల వరకు నామపత్రాలను స్వీకరిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు పులవురు మంత్రులు, సీనియర్‌ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరికొంత మంది తమ నామపత్రాలను సమర్పించనున్నారు. కొందరు అభ్యర్థు మంచిరోజు, ముహూర్తాలను ద్రుష్టిలో పెట్టుకొని తమ కుటుంబసభ్యుల, అనుచరుల ద్వారా ఇప్పటికే నామినేషన్లు వేయించారు. తాజాగా చివరి రోజు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. జనాన్ని సమీకరించి భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసి అభ్యర్థుల బప్రదర్శన చేశారు.
         అటు కొన్ని పార్టీలు అభ్యర్థిత్వాలను ఆదివారం  ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో వారందరూ  నామపత్రాలు సమర్పించారు. బీఫారాలు ఇవ్వకుండా కేవం నామినేషన్‌ వేసిన వారు ఇవాళ బీఫారాలు సమర్పించారు. నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ పూర్తయ్యాక రేపు పరిశీన చేపడతారు. 21, 22 తేదీల్లో నామపత్రాలు ఉపసంహరణకు గడువు ఉంటుంది.
    కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు ఇవాళ్టి నుంచి అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారు. 53 మంది వ్యయ పరిశీలకులు నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలోనే మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా సాధారణ పరిశీలకులు, శాంతిభద్రత పరిశీలకులు కూడా   పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇప్పటికే 68 మంది సాధారణ పరిశీలకులు, పది మంది శాంతిభద్రత పరిశీలకులు జిల్లాలకు చేరుకున్నారు. రెండు, మూడు నియోజకవర్గాలకు ఒక సాధారణ పరిశీలకులు, ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున శాంతిభద్రతల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

21, మార్చి 2018, బుధవారం

ఆలోచింప జేసేదే కవిత్వం

                                                                               నేడు ప్రపంచ కవితా దినోత్సవం

                 నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక స్రుజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టులు ఉండకూడదు. కవిత్వం రాసేవారిని కవులు, కవయిత్రులు అంటారు. వారికి కీర్తి కాంక్ష అసలే ఉండొద్దు. ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో  స్రుజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే. ఒకరు రాయమంటే రాసేది కవిత్వం కాజాలదు. ఆకలియే కవిత్వం ఆలోచనయే కవిత్వం కదిలించే ఘటనలు, కవ్వించే ప్రతినలు కవితకు ప్రతిపాదికలు..
                                                కవిత్వంలో రకాలు
అభ్యుదయ, విప్లవ కవిత్వం
భావ కవిత్వం
కాల్పనికత కవిత్వం

                                              కవిత్వం పై ప్రముఖుల వ్యాక్యలు
శ్రీశ్రీ:` కవిత్వ మొక తీరని దాహం
శ్రీశ్రీ:` ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే
గుర్రం జాషువా:` వడగాడ్పుల నా జీవితం. వెన్నెల నా కవిత్వం
దాశరథి క ష్ణమాచార్య:` అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం
                                          కవులలో రకాల
1 జంట కవులు,   2 భారత కవులు, 3 రామాయణ కవులు, 4 శివ కవులు, 5 ప్రబంధ కవులు, 6 పద కవులు,7 శతక కవులు, 8 జాతీయోద్యమ కవులు,  9 భావ కవులు, 10 అభ్యుదయ కవులు,11 దిగంబర కవులు,12 తిరుగబడు కవులు, 13 విప్లవ కవులు, 14 నయాగరా కవులు, 15 చేతనావర్త కవులు,16 అనుభూతి కవులు,  17 స్త్రీవాద కవయిత్రులు,18 దళితవాద కవులు, 19 ముస్లిం మైనార్టీవాద కవులు. ఇప్పటి వరకు ఉన్న రకాలు , మున్ముందు ఇంకా పెరగవచ్చు.....

25, జనవరి 2018, గురువారం

‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం


               గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను గురువారం సాయంత్రం ప్రకటించింది.
 
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా- పద్మవిభూషణ్
 
పద్మశ్రీ అవార్డు గ్రహితలు వీరే...
మహారాష్ట్ర- అరవింద్‌ గుప్తా (శాస్త్రవేత్త)
కేరళ- లక్ష్మీ కుట్టి
తమిళనాడు- ఎంఆర్‌ రాజగోపాల్ (వైద్యరంగం)
మధ్యప్రదేశ్‌- బజ్జూ శ్యామ్‌ (కళారంగం)
బెంగాల్‌- బిశ్వాస్‌ (సేవారంగం)
కర్ణాటక- సులగట్టి నర్సమ్మ (వైద్యరంగం)
మహారాష్ట్ర- నవనీతకృష్ణన్‌ (విద్యారంగం)
హిమాచల్‌ప్రదేశ్- యేషి ధోడెన్‌ (వైద్యరంగం)
మహారాష్ట్ర- మురళీకాంత్‌ పెట్కర్‌ (క్రీడారంగం)
బెంగాల్- సుభాషిణి మిస్త్రీ (సామాజికసేవ)
తమిళనాడు- రాజగోపాలన్‌ వాసుదేవన్‌ (సైన్స్‌-ఇంజినీరింగ్‌)
నాగాలాండ్- లెంటినా ఠక్కర్- (సమాజ సేవ)
మహారాష్ట్ర- రాణి అభయ్‌ బాంగ్- (వైద్యరంగం)
నేపాల్- సందుఖ్‌ రుట్ (వైద్యరంగం) 
మహారాష్ట్ర- సంపత్ రామ్‌ టెకే (సమాజసేవ)

14, జనవరి 2018, ఆదివారం

తెలుగు ప్రజలకు ఆనందాల హరివిల్లు సంక్రాంతి


              తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండగలలో సంక్రాంతి ముఖ్యమైనది. నాలుగు రోజులపాటు జరుపుకునే విశిష్టమైన పండగ. రైతులు చేతికొచ్చిన పంట సమృద్ధిగా వస్తే ధనం సమృద్ధిగా వస్తుందని నమ్మకం. పండగంటే కొత్తబట్టలు, పిండివంటలొక్కటే కాదు జానపదకళలకు ప్రాధాన్యతనిచ్చే పర్వదినం. ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి విశిష్టతలతో ప్రజాశక్తి ప్రత్యేక కథనం..
భౌగోళికంగా..
                   మేషాది పన్నెండు రాశులలో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక రాశిలో ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణంగా పిలుస్తారు. అయితే మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రమణానికి ప్రాముఖ్యత వుంది. ఈ సంక్రమణంతోనే ఉత్తరాయణం ఆరంభమవుతుంది. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు భూమధ్య రేఖకు ఉత్తరంగా, ఆరు నెలలు దక్షిణంగా అక్షాంశాలను మార్చుకుంటూ సంచరిస్తాడు. ఇలా ఉత్తర అక్షాంశంలో సంచరించే ఆరునెలల కాలాన్ని ఉత్తరాయణం అనీ, దక్షిణ అక్షాంశంలో సంచరించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు. ఈ ఉత్తరాయణాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ కాలంలో స్వర్గం పన్నెండు ద్వారాలు తెరచి వుంటాయని పురాణాల్లో నమ్మకం. సంక్రాతి పండుగకా నాంది ధనుస్సంక్రమణం. సంక్రాంతికి నెలరోజుల ముందు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసాన్ని ధనుర్మాసం అంటారు. వైష్ణవులకు పవిత్రమైన మాసం. ఈ మాసంలో వైష్ణవాలయాలను అత్యంతవైభవంగా అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముంగిట్లో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తారు.
                                                సంక్రాంతి మూలకథ..
               బలి చక్రవర్తి ప్రహ్లాదుడి మనువడు. ఈయనకు దానవచక్రవర్తిగా పేరు. అనాదిగా దేవదానవులకు గొడవలున్నందువల్ల బలిచక్రవర్తి స్వర్గం మీద దండెత్తి ఇంద్రుడిని తరిమికొడతాడు. కుమారుడు ఇంద్రుడికి పట్టిన ఈ గతికి తల్లి అదితి చాలా బాధపడి విష్ణువును ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి ఆమె కడుపున వామనుడిగా అంటే మరుగుజ్జుగా జన్మిస్తాడు. ఒకరోజు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్తాడు. యాగదీక్షలో ఉన్న బలిని మూడు అడుగుల స్థలం దానంగా ఇమ్మని విష్ణువు అడుగుతాడు. బలిచక్రవర్తి కులగురువు శుక్రమహర్షి బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలం ఇవ్యకు, అడిగిన వాడు మహా విష్ణువు అని హెచ్చరిస్తాడు. అడిగిన వారికి లేదనుకుండా ఇచ్చే దానగుణమున్న బలి చక్రవర్తి శుక్రమహర్షి మాటలు పట్టించుకోకుండా దానమిస్తాడు. వామనుడు మొదటి అడుగుతో ఆకాశం, రెండో అడుగుతో భూమి ఆక్రమించి మూడో అడుగుకు స్థలం చూపించమని వామనుడు కోరతాడు. విష్ణుపాదాన్ని తన తలపై మోపమని బలిచక్రవర్తి తన తలను చూపిస్తాడు. వామనుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి అతనిని రసాతలం అనే అధో లోకానికి పంపిస్తాడు. దానగుణశీలి అయిన బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు ఒక వరం కోరుకోమంటాడు. అప్పుడు బలిచక్రవర్తి నేను ఈ భూమిని చాలా సుభిక్షంగా పాలించాను. నా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. వారు నన్నెంతో ప్రేమగా అభిమానించారు. సంవత్సరానికొకసారి భూమిని, భూలోకవాసులను కళ్లారా చూసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుతాడు. ప్రతి సంవత్సరం మకర సంక్రమణ దినాన నువ్వు భూలోకాన్ని, లోకవాసులని దర్శించమని వరమిస్తాడు. అప్పటి నుండి సంక్రాంతి రోజున బలిచక్రవర్తి ఈ లోకాన్ని సందర్శిస్తాడు. బలి చక్రవర్తిని ఆహ్వనించడం కోసమే ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దుతారు. రథం ముగ్గులను గృహ ప్రాంగణంలో వేయడం సంప్రదాయంగా భావిస్తారు.
సంక్రాంతి విశిష్టత..
                 భోగి రోజున కొత్తబట్టలు కట్టుకుని, విందుభోజనాలు చేస్తారు. భోగాలు జరుపుకుంటారు. కావున భోగి అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు చెరకు ముక్కలు, కొత్తనాణెలు, రేగు పళ్లు నెత్తిమీద నుంచి ముతైదువులు పోస్తారు. భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. మకర సంక్రమణాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి రోజున దైవకార్యాలు, పితృకార్యాలు చేస్తారు కాబట్టి భోగిరోజునే కొత్తబట్టిలు ధరించడం ఆనవాయితీ. సంక్రాంతి పండగ మరుసటిరోజున కనుమ. ఈ రోజు మినుము తప్పని సరిగా తినాలి. కనుమ పండగ నాడు ఏడాదంతా కష్టపడే పశువులను రైతులు పూజించి కృతజ్ఞతలని తెలుపుకుంటారు. పూలదండలు, పూసల దండలు, పూలదండలు, చిరుగంటలతో అలంకరిస్తారు. రైతులకు సిరిసంపదలొచ్చేది ఈ పంటల వల్లనే గనుక వాటిని పూజించడం తెలుగు ప్రజలు ఆనవాయితీగా పెట్టుకున్నారు. కనుమ నాడు కాకి అయినా ఇల్లుకదలదంటారు. మూడు రోజుల సంక్రాంతి అనంతరం జరిపే పండుగను ముక్కనుమ అంటారు. స్త్రీలు సావిత్రి గౌరీదేవి వ్రతాన్ని ఆరంభించి తొమ్మిది రోజులపాటు గౌరీదేవులను పూజించి 10వ రోజున వాలలాడింపు పేరుతో నిమజ్జనం చేస్తారు.
కర్నూలు జిల్లాలో...
             కర్నూలు జిల్లా జానపద కళలలకు పెట్టింది పేరు. గంగిరెద్దుల సందడి, హరిదాసుల సంకీర్తనలతో పలుచోట్ల జానపద ఉత్సవాలు జరుగుతాయి. తోలుబొమ్మలాటలు కూడా ఈ సందర్భంగా ఆడిస్తారు. ఆలూరు మండలం రామదుర్గం గ్రామంలో తోలుబొమ్మలాట కళాకారులున్నారు. వీధి నాటకాలు, బుర్రకథ, హరికథలు సంకురాతిరి సంబరాల్లో భాగంగా పల్లెల్లో చేస్తారు. ఈ సంక్రాంతి సమయంలోనే ఎక్కువగా గ్రామాల్లో పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగుతాయి. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించే జానపద నృత్యకళ కర్నూలుకు ప్రత్యేకం. సంచార జీవనం చేస్తున్న ఈ కళాకారులు జిల్లా వాసులు అనేక ప్రాంతాలు తిరిగి గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తారు. ఆదోని ప్రాంతంలో కన్నడ, తెలుగు భాషల్లో ఈ కళావిన్యాసాలు ప్రదరిస్తారు. ప్రపంచీకరణ విషపంజా సమాజంపై విసరడం వల్ల కళలు కనుమరుగవుతున్నాయి.

27, డిసెంబర్ 2017, బుధవారం

లిస్బన్‌, అమరావతి : రెండు నగరాల కథ




            ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్‌ డికెన్స్‌ రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'ఏ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌'- రెండు నగరాల కథ. 1789 మే ఐదున ప్రారంభమై 1799 నవంబర్‌ 9న రాచరిక వ్యవస్థ కూల్చివేతతో ముగిసిన ఫ్రెంచ్‌ విప్లవం నేపథ్యం, విప్లవానికి ముందు, తర్వాత ప్యారిస్‌, లండన్‌ నగరాల్లో చోటు చేసుకున్న మార్పులు ఈ నవల ప్రధాన ఇతివృత్తం. పోర్చుగీస్‌ నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని స్థిరీకరించిన అనంతరం వలస రాజ్యాల నుంచి దోచుకున్న సంపదతో లండన్‌, ప్యారిస్‌, లిస్బన్‌ వంటి యూరోపియన్‌ నగరాలు సుపంపన్నం అవుతున్న కాలం అది. రాచరిక వ్యవస్థ కూల్చివేత తర్వాత సమాజంలో మంచి మార్పులు వచ్చి సామాన్యుల స్థితిగతులు మెరుగవుతాయని ఆశించి భంగపడిన మేధావుల్లో చార్లెస్‌ డికెన్స్‌ ఒకరు. ఆయన తన ఆవేదనను రెండు నగరాల కథలో 'సమాజం స్వార్థపూరితంగా, యాంత్రికంగా మారింది. దానిని నియంత్రించే శక్తి సామాన్యులకు లేదు. మిల్లులో నలిగిన ధాన్యాల నుంచి వచ్చే వ్యర్థాలుగా వారు మారారు. విప్లవాలు కూడా సామాన్యులకు ఏమీ చేయలేకపోయా యనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?' అంటారు. నిజానికి ఆనాటి పరిస్థితికి నేటికి పెద్దగా ఏమీ మార్పు రాలేదు. నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా సామాన్యులకు ఒనగూరుతున్న దేమీ లేదు.
              ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయిన తర్వాత ఎన్నో ఆశలతో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారు. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆ లోటు తీర్చేందుకు తాను రేయింబవళ్లు కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఎక్కువ కాలం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే గడిపారు. ఈ నేపథ్యంలో 'ఓటుకు నోటు కేసు' మీద పడడంతో ఆగమేఘాల మీద అమరావతికి తరలి వచ్చారు. అప్పటి నుంచి అమరావతి ప్రహసనం ప్రారంభమైంది. రాజధాని నిర్మాణం పేరుతో దేశ దేశాలు పట్టి తిరగడం, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించడం, డిజైన్లు తయారు చేయించడం, తిరస్కరిం చడం నిత్యకృత్యంగా మారింది. అమరావతిని ఎంపిక చేసి ఒక్క శాశ్వత కట్టడమైనా కట్టకుండా తాత్కాలిక భవనాల పేరిట వందలాది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు.
                చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఏ నగరానికి వెళితే ఆ నగరంలాగా అమరావతిని తీర్చిదిద్దుతానని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. కనీస పౌర సదుపాయాలు లేని నగరాలను కూడా గొప్పగా పొగిడే ముఖ్యమంత్రి దృష్టిలో పోర్చుగీస్‌ రాజధాని లిస్బన్‌ నగరం పడలేదు. ప్రపంచ మేటి నగరాల్లో 29వ స్థానంలో ఉన్న ఈ నగరం 1775లో భూకంపం, సునామీ, అగ్ని ప్రమాదాల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. శిధిలాల మయంగా మారిన లిస్బన్‌ నగరాన్ని కేవలం ఐదేళ్ళలో అంటే 1780వ సంవత్సరానికల్లా అద్భుత నగరంగా పునర్‌నిర్మించారు. ఏడు కొండల మధ్యలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో 237 సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని భారీ భూకంపాలను కూడా తట్టుకునే విధంగా కట్టారు. ఆనాడు నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకపోవడం, నేటికీ సుమారు ఐదు లక్షల మంది ప్రజల ఆవాస అవసరాలు తీర్చుతుండడం గొప్ప విశేషం.
1775వ సంవత్సరం నవంబర్‌ ఒకటో తేదీన లిస్బన్‌ వాసులు 'ఆల్‌ సెయింట్స్‌ డే' ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9.40 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలు మీద సుమారు 8.5 నుంచి 9 పాయింట్ల మాగ్నిట్యూడ్‌ తీవ్రత గల భూకంపం సంభవించింది. నగరం మొత్తం నేలమట్టమైంది. వేలాది మంది అక్కడికక్కడే చనిపోయారు. వందలాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్ర తీరానికి చేరుకున్నారు. అయితే భూకంపం వచ్చిన 50 నిముషాలలోపే సునామీ అలలు రావడంతో తీర ప్రాంతంలో తలదాచుకున్న వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయారు. 'ఆల్‌ సెయింట్స్‌ డే' ప్రార్థనల కోసం ఇళ్ళలోను, చర్చిలలోనూ వెలిగించిన కొవ్వొత్తుల కారణంగా నగరమంతటా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకేసారి వచ్చిన ఈ మూడు ఉపద్రవాలతో లిస్బన్‌ నగరం నామరూపాలు లేకుండా పోయింది. వాస్కోడిగామా తన సముద్రయాన అనుభవాలను పొందుపరిచిన పత్రాలతో సహా విలువైన కళాఖండాలు, గ్రంథాలు, పెయింటింగ్స్‌ సమస్తం కాలిపోయాయి.
             నిరాశ్రయులైన పోర్చుగల్‌ రాజు జోసెఫ్‌-1, అతని కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడానికి పొరుగునే ఉన్న స్పెయిన్‌ అంగీకరించింది. అయితే జోసెఫ్‌-1 శిధిల నగరం మధ్యలో ఉన్న కొండపై టెంట్‌లు వేయించి అక్కడి నుంచే పాలన సాగించాడు. విధ్వంసం జరిగిన నెలలోగానే అంటే 1775 డిసెంబర్‌ నాలుగో తేదీన రాజాస్థాన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మాన్యూల్‌ డ మైయ నగర నిర్మాణానికి చక్కటి ప్రణాళిక తయారు చేశారు. వేరే ప్రాంతంలో నగరాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. శిధిలాల్లో పనికి వచ్చే రాళ్ళు, కలప, ఇనుము ఇతర సామాగ్రి ఒకచోట చేర్చి పునర్‌నిర్మాణ పని ప్రారంభించారు. తిరిగి నిర్మించే నగరంలో విశాలమైన స్క్వేర్‌లు, వెడల్పాటి రహదారులు, బ్రిడ్జిలు, అద్భుతమైన భవంతులు, గృహ సముదాయాలకు సంబంధించిన ప్రణాళిక లను నెల రోజుల లోపులోనే రూపొందించడం విశేషం. శిధిలా లను తొలగించడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. కేవలం నాలుగేళ్ళలో లిస్బన్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలి గారు. నగర పునర్‌నిర్మాణా నికి ముందు పోర్చుగీస్‌ ప్రధాన మంత్రి సెబాస్టియో డి మెలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'భూకంపం సృష్టించిన విధ్వంసం చూసి దిగులు చెందవద్దు. భూకంపం కారణంగా వచ్చిన కొత్త నీటి ఊటలు చూసి ఆనంద పడదాం. ఈ విధ్వంసం మన మేధో శక్తికి, శక్తి సామర్థ్యాలకు, ఐక్యకతు సవాల్‌ విసిరింది. పోర్చుగీస్‌ వాసుల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటడానికి ఇది మంచి అవకాశం' అన్నారు. నిజానికి పోర్చుగీస్‌ చాలా చిన్న దేశమే అయినప్ప టికి శక్తివంతమైన నావికాదళం ఉండేది. పోర్చుగీస్‌ నావికుడు వాస్కోడిగామా నౌకా మార్గం ద్వారా ఇండియా వచ్చి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల మొదట లబ్ధిపొందిన యూరోపియన్‌ దేశం పోర్చుగీస్‌.
              విధ్వంసం తర్వాత పోర్చుగీస్‌ వాసులు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి తమ సత్తా చాటారు. నిజానికి నాడు పోర్చుగీస్‌ వాసుల ఇబ్బందులతో పోల్చితే ప్రస్తుతం మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తక్కువే. అయినా మన పాలకులు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనలు వేసి మూడేళ్లు కావస్తున్నా ఇంకా డిజైన్లు కూడా ఖరారు చేయలేకపోయారు. నాటి పోర్చుగీస్‌ పాలకులు తమ ప్రజలతో పాటు గుడారాలలో నివసించారు. నేటి మన పాలకులు విలాసవంతమైన భవనాల్లో నివశించడానికే మోజు పడుతున్నారు. లిస్బన్‌లో విధ్వంసం జరిగిన ఏడాదిలోగానే నగర నిర్మాణానికి ప్లాన్‌లు సిద్ధం చేస్తే, ఇక్కడ మాత్రం అవి ఇంకా డ్రాయింగ్‌ బోర్డులపైనే ఉన్నాయి. లిస్బన్‌లో ప్రతి రాయినీ తిరిగి ఉపయోగించడానికి ప్రయత్నించగా ఇక్కడ ప్రతి పైసానూ తమ స్వార్థ ప్రయోజనాలు, ప్రచారం కోసం వాడుతున్నారు.
            237 సంవత్సరాల క్రితం నిర్మించిన లిస్బన్‌ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉంటే అమరావతిలో వందలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తాత్కాలిక భవనాలు బీటలు వారుతున్నాయి. లిస్బన్‌లోని ప్రతి అంగుళం భూమిని ప్రజల కోసం ఉపయోగిస్తే నేడు మన పాలకులు అమరావతిలోని వందలాది ఎకరాలు విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. నాటి లిస్బన్‌ నగర నిర్మాణం త్యాగాలకు, సమష్టి కృషికి, ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలబడగా నేటి అమరావతి స్వార్థ ప్రయోజనాలకు, సంకుచిత అలోచనలకు, మిడిమిడి జ్ఞానాలకు, ఏకపక్ష నిర్ణయాలకు కొలువుగా మారింది. ప్రతి పనికి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే అమరావతి 'భ్రమరావతి'గానే మిగిలిపోతుంది.

- వివిఆర్‌ కృష్ణంరాజు ( రచయిత ఎపి ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు,
సెల్‌ : 9505292299 )

26, డిసెంబర్ 2017, మంగళవారం

ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువతి


            అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సృష్టి ధర్మం. మరి అమ్మాయే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ముగ్గురమ్మాయిలను వివాహం చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది. పులివెందులలో పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన నాటకం  2017 డిసెంబర్ 26న వెలుగుచూసింది. మగాడిలా వేషం మార్చుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మగాడి వేషంలో మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకున్న రమాదేవి ఆమెను వివాహం చేసుకుంది. రమాదేవి మోసాన్ని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
               పోలీసులు విచారణ జరపగా మోసం బయటపడింది. పులివెందులలో ఓ కాటన్ మిల్లులో పని చేస్తున్న రమాదేవి, అదే మిల్లులో పనిచేస్తున్న మౌనికతో పరిచయం పెంచుకుంది. అది పెళ్లి వరకు దారి తీసింది. పెళ్లై రెండు నెలలు అవుతున్నా మౌనిక పుట్టింట్లోనే ఉంది. తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పలేదు. అయితే రమాదేవి స్వయంగా మౌనిక ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పింది. మొత్తం తెలుసుకున్న మౌనిక కుటుంబసభ్యులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మౌనిక కంటే ముందే రమాదేవి మరో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి కంటే ముందే బాధితులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సెటిల్ చేసుకున్నట్లు తెలియవచ్చింది. మూడు పెళ్లిళ్ల మాట నిజమే అని ఆమె స్వయంగా రమాదేవి ఒప్పుకుంది. రమాదేవికి ఊహ తెలిసినప్పటినుంచి మగాడిలా ఉండడమంటే ఇష్టమట. అసలు కాటన్ మిల్లులో పనికి కూడా మగాడులానే చేరింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆమెలో తేడా గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఈ విషయంపై స్పందించిన మౌనిక... రమాదేవి తనకు 2సార్లు కూల్ డ్రింక్‌లో, ఓసారి పెరుగన్నంలో మత్తుమందు కలిపి ఇచ్చిందని తెలిపింది. పెళ్లి మాత్రం కాలేదని చెబుతోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

25, డిసెంబర్ 2017, సోమవారం

చుక్కల్లో ధనవంతుడు.. పాతాళంలో పేదవాడు!

Major difference between Rich and poor people assets in India - Sakshi
భారత్‌ సాధించిన ఆర్థిక పురోగతి ఇదే
               అమెరికా, చైనా దేశాల తర్వాత భారత దేశం ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతోంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో సరాసరి ఏడు శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధించడమే అందుకు కారణం. దీన్ని మనకు ఆర్థిక నిపుణులు గొప్పగా చెబుతారు. మన నాయకులు కూడా తమ విజయంగా ఈ విషయాన్నే వల్లె వేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. భారత్‌ మూడవ బలమైన ఆర్థిక శక్తిగా బలపడిందంటే కొనుగోలు శక్తిలో మాత్రమే. దీన్ని కూడా గర్వించతగ్గ పరిణామంగానే పరిణమించినా ప్రపంచంలోనే ప్రజల మధ్య ధనిక, పేద వ్యత్యాసాల్లో రష్యా తర్వాత స్థానాన్ని భారతదేశం ఆక్రమించి ఉందన్న అపకీర్తిని ఎలా జీర్ణించుకోవాలి?
            క్రెడిట్‌ సూస్స్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అంచనాల ప్రకారం భారత దేశంలోని 60 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. అదే రష్యాలోనైతే 74 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. ఇక 80 శాతం భారత్‌ ఆస్తి 10 శాతం ప్రజల వద్దనే పోగుబడిపోయింది. మన జాతీయ స్థూల ఉత్పత్తి తలసరి సరాసరి సగటు 1990 నుంచి ఇప్పటివరకు ఆరు రెట్లు పెరిగింది. అంటే, 1,130 డాలర్ల నుంచి 6, 576 డాలర్లకు పెరిగింది. దీంతో మౌలిక సౌకర్యాలతోపాటు పరిశుభ్రత, మహిళల్లో అక్షరాస్యత పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మృతి, అదే సమయంలో పిల్లల మృతి తగ్గుముఖం పట్టి ఆయు: ప్రమాణం పెరిగింది. దేశ జనాభా 130 కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీవన ప్రమాణాల్లో భారత్, బంగ్లా, పాకిస్థాన్‌ లాంటి దేశాలను అధిగమించింది.
              అయితే ఈ అభివృద్ధి దేశంలోని ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. హిందువుల్లోని అగ్రకులాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో పెరిగింది. ఈ వర్గాలకు చెందిన 28 శాతం ప్రజలు, అంటే 36 కోట్ల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న భారత్‌లో సగటు భారతీయులు దారిద్య్రంలోనే జీవిస్తున్నారు. భారత ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ఆర్థిక వృద్ధి రేటుపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆర్థికాభివృద్ధిని ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూసినప్పుడు మాత్రమే ఆ ఆర్థిక ఫలాలు పేదలకు కూడా చేరుతాయి. దాన్నే సామాజిక అభివృద్ధిగా నిపుణులు చెబుతారు.
               2000 సంవత్సరం నుంచి 2016 వరకు భారత్‌ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందినా.. సంపన్నులే ఎక్కువగా లబ్ధి పొందారు. 2000 సంవత్సరంలో 1 శాతం ధనికుల వద్ద 36.8 శాతం ఆస్తులుండగా, నేటికి అవి 60 శాతానికి చేరుకున్నాయి. మొత్తం దేశం ఆస్తిలో 4.1 శాతం వాటానే పేదలు అనుభవిస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్‌ సూస్స్, ఆక్స్‌ఫామ్‌ సంస్థల అంచనా ప్రకారం 1988 నుంచి 2011 మధ్య కాలంలో పేదవారిలో పది శాతం పేద వారి ఆదాయం సగటున రెండు వేల రూపాయలకు చేరుకోగా, పదిశాతం సంపన్నుల ఆదాయం సగటున 40వేల రూపాయలకు పెరిగింది. పేదవారి ఆదాయం ఏటా ఒకశాతం పెరగ్గా, సంపన్నుల ఆదాయం ఏటా 25 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. క్రోని క్యాపిటలిజం, కార్పొరేషన్‌ సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లకు, వాటాదారులకు డివిడెండ్లు ఎక్కువగా ఇవ్వడం, ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ రావడం వల్ల ప్రజల మధ్య ఈ ఆదాయ అంతరాలు తీవ్రంగా పెరిగాయి.
మధ్య తరగతి కూడా పెద్ద దెబ్బ
                   ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలక పాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2011లో భారత్‌లోని మధ్య తరగతి ఆదాయం రోజుకు పది డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. అంతకుముందు నుంచి వారి ఆదాయం పురోగతిని పరిశీలిస్తే ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా దేశాలకన్నా భారత్‌ వెనుకబడింది.

24, డిసెంబర్ 2017, ఆదివారం

దినకరన్‌ ప్రభంజనం.. బీజేపీ కన్నా నోటాకే అధికం!


ttv dinakaran won in rk nagar by election - Sakshi













గట్టిపోటీ ఇవ్వలేకపోయినా అన్నాడీఎంకే.. డీఎంకే డిపాజిట్‌ గల్లంతు
                  ప్రతిష్టాత్మకంగా మారిన తమిళనాడు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ ఘనవిజయం సాధించారు. 2017 డిసెంబర్ 24న ఫలితాలు వెలువడ్డాయి. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్‌ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్‌ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్‌ కోల్పోయాయి.
                దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ,  అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్‌ గుర్తుతో పోటీచేసిన దినకరన్‌ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు.
బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ
                 ఈ ఎన్నికల్లో దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్‌ తమిళార్‌ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి.