31, జనవరి 2014, శుక్రవారం

ఉన్నత శిఖరాలకు ఎదగాలి


ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ఎస్‌  ప్రవీణ్‌ కుమార్‌

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదివిన, చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలనే తపనతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  చెప్పారు. కర్నూలు  బి క్యాంపులో 2014`01`2014న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల పూర్వ విద్యార్థుల(స్వారోస్‌) సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గురుకుల పాఠశాలలో చదువటం వల్ల తాను ఐపిఎస్‌  స్థాయికి ఎదిగానని అన్నారు. నేనిప్పుడు అనుభవిస్తున్న హోదా  కేవలం  గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల భిక్ష అని అన్నారు.  పేద విద్యార్థులకు నా వంతు కర్తవ్యంగా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పోలీసుశాఖ నుంచి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నానని  గర్వంగా చెప్పారు. దళితుడనైన నేను హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి తొలి పట్టభద్రుడిని కావడం  గర్వించదగ్గ విషయమని  అన్నారు. 16 నుంచి 18 ఏళ్లు ఎస్‌పిగా మచ్చలేని సేవ చేసిన నాకు ఐజి హోదా వస్తుందని, ఇంతటి ఘనతను నాకు ప్రసాదించిన నా గురువులందరికీ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు హృదయపూర్వక వందనాలు తెల్పుతున్నానన్నారు. కార్యదర్శిగా తన కృషి ఎంత ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని అన్నారు. గురుకుల విద్యాలయాల అభివృద్ధికి 150 కోట్లు మంజూరయ్యాయన్నారు. విద్యాలయాలు నడిపే దిశలో మా వైపు నుంచి కూడా లోపాలుంటాయని, వాటిని సరిచేసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ డిగ్రీ కాలేజి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంతేకాకుండా రొబోటిక్‌ కాంప్స్‌, సైంటఫిక్‌ క్యాంప్స్‌, లీడర్‌షిప్‌ క్యాంప్స్‌, బుక్‌ రైటింగ్‌ క్యాంప్స్‌, ఫిలిం ఆక్టింగ్‌ క్యాంప్స్‌ కూడా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సైకాలజిస్టు డాక్టర్‌ వీరేంద్ర విద్యార్థులు`తల్లిదండ్రుల పాత్రపై ూపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పూర్వవిద్యార్థులతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంభాషించారు.  ఈ కార్యక్రమంలో ఎపిఆర్‌ఎస్‌డబ్యుఆర్‌ కన్వీనర్‌ విమల కుమారి, మహమ్మద్‌ ఇర్ఫాన్‌, సోషల్‌వెల్ఫేర్‌ డిడి శోభా రాణి, డాక్టర్‌ సి వీరేంద్ర, గీతావాణి, ప్రస్తుత, పూర్వ విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు, ూపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

స్వారోస్‌ నెట్‌వర్క్‌ను పెంచాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

            ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల ( ఎస్‌డబ్ల్యుఎఇఆర్‌ఓఇఎస్‌) స్వారోస్‌ నెట్‌వర్క్‌ను పెంచాలని ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. కర్నూలులో స్వారోస్‌తో ఆయన సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్యలు, సాధించిన విజయాలను తెలుసుకున్నారు. స్వారోస్‌ నెట్‌ వర్క్‌ ప్రాధాన్యతను తెలుపుతూ ఇజ్రాయిల్‌ దేశంలోని యూదులు నెట్‌వర్క్‌తో ప్రపంచ రికార్డులు సృష్టించారని తెలిపారు.ఉన్నతస్థితికి ఎదిగిన వారు అట్టడుగున ూన్నవారికి శక్తి మేకరకు సహకరించాలని చెప్పారు. కుల, ప్రాంతీయ బేధాలు లేకుండా తోటివారికి  మేలు చేయడమే స్వారోస్‌ ప్రదాన లక్ష్యమని చెప్పారు.  ఇప్పటికీ తెలంగాణా, ఆంధ్ర జిల్లాల్లో స్వారోస్‌ కార్యక్రమాలు చేస్తున్నారని, రాయలసీమలో కూడా విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వారోస్‌ రాష్ట్ర అధ్యక్షులు కన్నారపు ూపేందర్‌, ఫ్రధాన కార్యదర్శి దామోదర్‌రావు, కోశాధికారి సుధాకర్‌, సహాయ కార్యదర్శి స్వాములు పాల్గొన్నారు. సుబ్బయ్య ప్రవీణ్‌కుమార్‌పై రాసిన  కవితను అందజేశారు. స్వారోస్‌ కార్యక్రమాలు నచ్చి సహకరిస్తున్న ఇంజనీరింగు విద్యాసంస్థల అధినేత సతీష్‌, బాలకృష్ణ, మరి కొందరు పోలీసు అధికారులను స్వారోస్‌కు ప్రవీణ్‌కుమార్‌ పరిచయం చేశారు.


24, డిసెంబర్ 2013, మంగళవారం

26న కేజ్రివాల్‌ ప్రమాణం


                 2013 డిసెంబర్‌ 26న అరవింద్‌కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రివాల్‌ మంత్రివర్గం కూడా ఖరారైనట్లు సమాచారం.  గిరీష్‌ సోని, సతేందర్‌జైన్‌, సురభ్‌ భరద్వాజ్‌, సోమనాథ్‌ భారతి, మనీష్‌ సిసోడియా, రాఖీ బిర్లా తదితర ఆరుగురు సభ్యులకు  తొలివిడతగా స్థానం లభించినట్లు ఆ పార్టీ వర్గాల కథనం. ఈ నెల 26న రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణస్వీకారోత్సవంలో కేజ్రీవాల్‌తో పాటు మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు మంగళవారం ఉదయం ఢిల్లీ ప్రధాన కార్యదర్శి డి.ఎం.సపోలియా కేజ్రీవాల్‌ను కలిసి అధికార నివాసం, భద్రతకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అయితే వ్యక్తిగత సెక్యూరిటీకి, అధికార నివాసానికి ఆయన తిరస్కరించినట్లు పార్టీ నేత శిశోడియా విలేకరులకు తెలిపారు. కాగా పోలీసులు మాత్రం ప్రోటోకాల్‌ ప్రకారం కేజ్రీవాల్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తామని చెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం.
ప్రిన్సిపల్‌ సెక్రటరీగా రాజేందర్‌ కుమార్‌?
      ఢిల్లీ పగ్గాలు చేపట్టనున్న అరవింద్‌ కేజ్రీ వాల్‌కు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి రాజేందర్‌ కుమార్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరించ ను న్నారు.  47 ఏళ్ల కుమార్‌ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
బిజెపి ఆగ్రహం
           కేజ్రివాల్‌ కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన సీట్లు రాలేదు. మొత్తం 70 అసెంబ్లీస్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు రావాలి. అధికారం కోసం  పోటీపడిన బిజెపి 32, కాంగ్రెస్‌ 8, ఆమ్‌ఆద్మీ 28 , ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు.  అవీవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆమ్‌ఆద్మీపార్టీ పదిరోజుల సమయం తీసుకుని  రెండుపార్టీల్లో ఏది ఎంత ప్రమాదకరమో అంచనా వేసింది. బిజెపి, కాంగ్రెస్‌ రెండూ ప్రమాదకరమైనవే కాని బిజెపితో పోల్చినప్పుడు కొంత తక్కువ అవినీతి, అదేవిధంగా తక్కువ ప్రమాదకరమైనది కాంగ్రెస్‌ అని నిర్ధారణకు వచ్చింది. అదే విధంగా ఎక్కువ సీట్లున్న బిజెపి మద్దతు తీసుకుంటే ఎప్పుడైనా కొందరు ఎమ్మెల్యేలను కొనేసి  ఆమ్‌ఆద్మీపార్టీని దెబ్బతీయవచ్చని ఆలోచించినట్లు కనబడుతుంది. అయితే కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బిజెపి జీర్ణించుకోలేక పోతుంది.2014లో  దేశంలో జరిగే జనరల్‌ ఎన్నికల్లో కూడా బిజెపి, కాంగ్రేసేతర పార్టీలు గెలుస్తాయని గతంలో బిజెపి నేత ఎల్‌కె అద్వాని తన ట్విట్టర్‌లో పేర్కొట్లుగా జరగవచ్చనిపిస్తోంది. దేశంలో మొత్త 28 రాష్ట్రాలుంటే 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోఉంది. 10 రాష్ట్రాల్లో బిజెపి కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ూన్నాయి. ఐదు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి  ఉంది. బిజెపి అధికారంలోఉన్న చత్తీస్‌ఘడ్‌, గోవా రాష్ట్రాల్లో ఒకటి, రెండేసి ఎంపీలున్నాయి. ఎక్కువ ఎంపీసీట్లున్న,ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బిజెపికి గడ్డు పరిస్థితులేఉన్నాయి. కాబట్టి అద్వాని చెప్పినట్లే 2014 జనరల్‌ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిల ప్రమేయం లేని ప్రభుత్వం ఏర్పడవచ్చు. 

17, డిసెంబర్ 2013, మంగళవారం

65 పేజీలు 13 షెడ్యూళ్లు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం 
                 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 2013 డిసెంబర్‌ 16న ప్రవేశపెట్టిన  పునర్వ్యవస్థీకరణ బిల్లులో 65 పేజీలు, 12 భాగాలు 13 షెడ్యూల్స్‌ ఉన్నాయి. మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు, రెండో షెడ్యూల్‌లో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వివరాలు, మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు,  నాలుగో షెడ్యూల్‌లో శాసనమండలి సభ్యుల విభజన, ఐదో షెడ్యూల్‌లో తెలంగాణా రాష్ట్రంలోని దళిత వర్గాల వివరాలు, ఆరో షెడ్యూల్‌లో తెలంగాణా రాష్ట్రంలోని గిరిజన వర్గాల వివరాలు, ఏడో షెడ్యూల్‌లో నిధులు, ఎనిమిదో షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు, తొమ్మిదో షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు, 10 షెడ్యూల్‌లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు, 11 షెడ్యూల్‌లో నదీజలాల నిర్వహణ బోర్డుల విధివిధినాలు, 12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు, 13వ షెడ్యూల్‌లో విద్య మౌలిక సదుపాయాల అంశాలు ఉన్నాయి. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. బిల్లు ప్రతులు ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు అందాయి. 17న జరిగిన బిఎసిలో 18, 19 తేదీల్లో  బిల్లుపై చర్చ జరగాలని నిర్ణయించారు. 
అందులోని ముఖ్యాంశాలు: 
»10 జిల్లాలతో కూడిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, 
»13 జిల్లాల సీమాంధ్రతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
» పదేళ్లు మించకుండా ూమ్మడి రాజధానిగా హైదరాబాద్‌, పదేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తరాజధాని ఏర్పాటు. 
»కొత్తరాజధానిపై నిఫుణుల కమిటీ ఏర్పాటు. 
»నిఫుణుల కమిటీ బిల్లు పాసైన 45 రోజుల్లో రాజధాని ఏర్పాటుకు సంబంధిత నివేదిక అందించనుంది.
» పదేళ్ల తరువాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌.
» ప్రస్తుత గవర్నరే రెండు రాష్ట్రాలకు ూమ్మడి గవర్నర్‌గా కొనసాగింపు.
» గవర్నర్‌ పరిధిలోనే శాంతిభద్రతలు, రెవెన్యూ ప్రభుత్వ భవనాలు ూంటాయి. 
»ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 175 అసెంబ్లీస్థానాలు, 25 పార్లమెంటుసీట్లు, 50 మంది ఎమ్మెల్సీలు.
» తెలంగాణకు 119 అసెంబ్లీస్థానాలు, 17 ఎంపీసీట్లు, 40 మంది ఎమ్మెల్సీలు.
»ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు ఏర్పాటు. 
»అప్పటి వరకు ూమ్మడిగానే ప్రస్తుత హైకోర్టు.
» అనంతరం ఇది తెలంగాణకు చెందుతుంది. 
»మూడేళ్లపాటు పోలీస్‌ట్రైనింగుసెంటర్‌ కేంద్రం పరిధిలో ూంటుంది. 
»మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రైనింగు సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. 
»నదీజలాల నిర్వహణకు కేంద్ర ూన్నతస్థాయి మండలి ఏర్పాటు. 
»ఈ మండలంలో సభ్యులుగా కేంద్ర మంత్రి, ఇరు ప్రాంత సిఎంలు ూంటారు. 
»జాతీయ ప్రాజెక్టుగా పోలీవరం.
» ఇరు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర సహాయం. 
»సింగరేణి గనులు తెలంగాణకే. 
»జెన్‌కో పవర్‌ ప్లాంట్లు ఎక్కడుంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి.
»ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఎం, ఐఐఎన్‌ఇఆర్‌, ట్రిపుల్‌ ఐటి, ఎయిమ్స్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ. 
»రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు.
» కేంద్రసహకారంతో తెలంగాణాలో ఒక ూద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు. 
»ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా దుగ్గిరాజుపట్నం వద్ద కొత్త మేజర్‌పోర్టు నిర్మాణం చేపడుతారు. ఇది 2013 లోపు పూర్తి అవుతుంది. 
»ఖమ్మంలో స్టీల్‌ప్లాంటు  ఏర్పాటు అంశాన్ని సెయిల్‌ పరిశీలిస్తోంది. 
»ఆర్టికల్‌ 371 `డి రెండు రాష్ట్రాలకు కొనసాగింపు.
» ప్రస్తుత ఆంధ్రసర్వీస్‌కమిషన్‌  ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుంది. 
»తెలంగాణాలో కొత్త సర్వీస్‌కమిషన్‌ ఏర్పాటు చేస్తారు. 
»ఆంధ్రప్రదేశ్‌  కొత్తరాజధానిలో ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. 
»విద్యాసంస్థలో  అడ్మిషన్‌ కోటాలు పదేళ్లపాటు యధాతథంగా ూంటాయి. 
»తెలంగాణాలోని అన్ని వెనుకబడిన ప్రాంతాలకు జాతీయ హైవే అథారిటీ ద్వారా రహదారుల నిర్మాణం కేంద్ర పరిశీలనలో పలు అంశాలు. 
» విశాఖపట్నం`చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు. 
» విశాఖ పట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ అంశం.  
»తెలంగాణాలో 4 వేల  మెగావాట్ల విద్యుత్‌ ూత్పత్తి ప్లాంటు నిర్మాణం. 
» ఆంధ్రప్రదేశ్‌లో కొత్తరైల్వేజోన్‌ ఏర్పాటు.
» హైదరాబాద్‌ నుంచి విడిపోయే ఆంధ్రప్రదేశ్‌  కొత్తరాజధానికి రాపిడ్‌ రెయిల్‌, రోడ్‌ కనెక్టివిటీ అంశాన్ని కేంద్రం పరిశీలన. 

16, డిసెంబర్ 2013, సోమవారం

రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి లేఖ సారాంశమిది


                      రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు`2013ను శాసనసభకు పంపుతూ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన లేఖ   సారాంశం క్లుప్తంగా :
‘భారత ప్రభుత్వం భాగస్వాములతో విస్తృత చర్చలు, సంప్రదింపుల తరువాత , అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత మున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా రాష్ట్రాన్ని కొత్తగా  ఏర్పాటు చేయడానికి ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు `2013ను ప్రతిపాదించింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో రూపొందించిన బిల్లును ఆచరణలో సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిఉంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని భౌగోళిక సరిహద్దులను విస్తీర్ణాన్ని ఈ బిల్లు ప్రభావితం చేస్తుంది. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో కూడి ఉంటుంది. అందువల్ల, భారత రాజ్యాంగంలోని 3వ అధికరణంను అనుసరించి, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు `2013ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ 2014 జనవరి 23వ తేది నాటికి తన అభిప్రాయాలను తెలపడానికి పంపుతున్నాను.’
                                  బిల్లు ప్రతులను చింపేసిన టిడిపి, వైఎస్‌సిపి సభ్యులు 
                   . తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు డిసెంబర్‌ 16న స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు  టిడిపి అధ్యక్షడు నారాచంద్రబాబు నాయుడు కూడా లేరు. సీమాంధ్ర శాసనసభ్యులు టిడిపి, వైఎస్‌ఆర్‌సి శాసనసభ, శాసనమండలిలో గందరగోళం శృష్టించారు. బిల్లు ప్రతులను చింపేశారు.  అయితే బిఎసిలో చర్చించలేదని, ముందుగా చెప్పకుండా బిల్లు పెట్టడం సరైంది కాదని వాదించారు. సీమాంధ్ర, తెలంగాణా సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బిల్లు అధ్యయనానికి సమయం కావాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు కోరారు. రాత్రి పొద్దు పోయేదాకా నిరసన తెలిపారు. అసెంబ్లీలో నిరసన తెలిపిన వారిని అరెస్టు చేసి పార్టీ కార్యాలయాలకు తరలించారు. 

29, నవంబర్ 2013, శుక్రవారం

జ్వలించే కోరిక విజయంవైపు నడుపుతోంది

                        
   ఎక్సలెన్స్‌ లీడర్‌షిప్‌ అకాడమీ డైరెక్టర్‌ కొండా చంద్రారెడ్డి

                      లక్ష్యాన్ని నిర్దేశించుకుని జ్వలించే కోరికతో ముందుకు పోతే విజయం మనదవుతుందని  ఎక్సలెన్స్‌ లీడర్‌షిప్‌ అకాడమీ డైరెక్టర్‌ కొండా చంద్రారెడ్డి సూచించారు. లక్ష్యాన్ని  చేరడానికి సాధన ఒక్కటే మార్గమని  అన్నారు. హైదరాబాద్‌లో 2013 నవంబర్‌ 28న ప్రజాశక్తి సబ్‌ఎడిటర్ల  శిక్షణాతరగతుల్లో ఆయన మాట్లాడారు. నిబద్దతతో పనులు చేసినప్పుడు మార్గం సుగమమవుతుందని చెప్పారు. ఏదయినా సాధించడానికి నడవడిక సరయినదయి ూండాలని తెలిపారు. క్రమ పద్దతిలో  సమయాన్ని సద్వినియోగం  చేసుకుంటే జ్ఞానం వికసించి వృత్తిలో  నైపుణ్యంపెరుగుతుందని సూచించారు. డబ్బు, సమయం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితరాలు లేవని నిరుత్సాహ పడటం సరైంది కాదని అన్నారు. ఇప్పటి వరకు పేదలు నివసించే ప్రాంతాల్లో, విద్య, వైద్య ప్రభుత్వ రంగ సంస్థలతో అనుబంధంగా పని చేసి పేదలు అభివద్ధి వారిసాధికారతకు కావల్సిన సూచనలు చేశామని తెలిపారు. అంతే కాకుండా వారు సంతోషంగా, ూత్సాహంగా  జీవించడానికి సాధ్యమయ్యేలా తన వంతు కృషి చేశానని చెప్పారు. మీ సంస్థలో మీరు విజయం సాధించడానికి , సంస్థను ముందుకు తీసుకుపోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరడానికి క్రమపద్దతిలో సాధన ఒక్కటే మార్గమని వివరించారు.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలువురు విజేతలు, విజ్ఞులు వారు సాధించన విజయాలు , అందుకు సహకరించిన ూపకరణాలను వివరించారు. అంతే కాకుండా వారు కఠోర సాధనతో ఎలా పేరు ప్రతిష్టలు పొందారో తెలిపారు.

13, నవంబర్ 2013, బుధవారం

మోడి విజయం ఇదే....

 
స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారీ స్థాయిలో నెలకొల్పుతున్నారు. దీనిఎత్తు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెట్టింపు వుంటుంది. దీనికయ్యే ఖర్చు అక్షరాలా 2074 కోట్లు. అంటే చంద్రమండల యాత్రకు లేదా ఈ వారం జరగనున్న అంగారక గ్రహయాత్రకు అయ్యే ఖర్చుకన్నా ఐదురెట్లు ఎక్కువ. పోనీయండి ఇదొక పర్యాటక ఆకర్షణగా వుంటుందని సరిపుచ్చుకుందాం. కానీ సర్ధార్ పటేల్ మ్యూజియం మౌళిక వసతులు లేక మూతపడింది. కేవలం కొన్ని లక్షల రూపాయిలు మాత్రం ఖర్చుపెడితే దీన్ని తెరిపించవచ్చు అదే విధంగా సర్ధార్ పటేల్ చదివిన పాఠశాలకు కేవలం పదిహేను లక్షల రూపాయిల నిధులివ్వమని పటేల్ ట్రస్ట్ యాజమాన్యం అడిగితే గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించింది. నిధుల్లేవని సమాధానం చెప్పింది. గాంధీ మహాత్మునికి వున్న అది పెద్ద విగ్రహం ఇటీవల పాట్నాలో నెలకొల్పిన 70 అడుగుల విగ్రహమే కానీ మోడీ సర్కార్ ఏర్పాటు చేస్తున్న పటేల్ విగ్రహం ఎత్తు 392 అడుగులు పటేల్ పై నిజంగానే అభిమానం వుంటే ఆయన మ్యూజియం కో పాఠశాలకూ నిధులు లేవంటారా? ఈ విగ్రహం నెలకొల్పుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం జాతీయ వార్తా పత్రికలలో, టెలివిజన్ ఛానల్స్ లో భారీ వ్యాపార ప్రకటనలను ఇచ్చింది. ఇదంతా చూస్తే పటేల్ పై ప్రేమకన్నా ఆయన విగ్రహం ఎంత ఎత్తుగా వుంటే అంత ఎత్తుగా తన పలుకుబడి పెంచుకోవచ్చన్న నరేద్ర మోడీ లక్షమే కనిపిస్తోంది.

దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని అనవసరంగా పోల్చారు ఇటావల నరేంద్ర మోడీ. మరి మరుగుదొడ్లు లేని దేశంలో విగ్రహాలు కావాలా? దేవాలయాల కన్నా విగ్రహాలే పవిత్రమా? విగ్రహాల కన్నా మీడియాలో అడ్వర్టైజ్ మెంట్లు ముఖ్యమా?

3, నవంబర్ 2013, ఆదివారం

గట్టును వెంటాడుతున్న వివక్ష

                                                  అక్షారాస్యత, అభివృద్ధిలో వెనుకబాటు

                                                 కొనసాగుతున్న రెండుగ్లాసుల పద్దతి

                                                  దళితులకు దేవాలయ ప్రవేశంలేదు

                                                      శ్మశాన వాటకలు లేనేవేవు

           మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలో వివిధ రూపాలో వివక్ష వెంటాడుతుంది. అత్యధిక గ్రామాల్లో  శ్మశాన వాటికలు లేవు. దేవాలయ ప్రవేశం లేదు. రెండుగ్లాసుల పద్దతి కొనసాగుతోంది.  దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.  ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా దళితుల దరి చేరడం లేదు. ఇప్పటికీ మండలంలో 768 కుటుంబాలకు ఇళ్లు లేవు. ఇందిరమ్మ పథకం కింద మంజూరయిన ఇండ్లకు బిల్లులు రాక,  నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక పెండిరగుల్లో ూన్నాయి.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇంత ప్రచారం చేస్తున్నా 90 శాతం దళితులకు మరుగుదొడ్లు లేవు. అన్నింటికీ మించి మండలంలో పెత్తందాల ఆగడాలను ప్రశ్నించిన వారిపై  పెత్తందారులు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హత్యలు చేసిన సంఘటనలు కూడా ూన్నాయి.
        కెవిపిఎస్‌  ఆధ్వర్యంలో గట్టు మండలంలో ఇటీవల సర్వే నిర్వహించారు. జిల్లాలో అక్షరాస్యతలోనూ, అభివృద్ధిలోనూ  వెనుకబడిన గట్టు మండలంలోని  24 పంచాయతీల పరిధిలోని 32 గ్రామాల్లో కెవిపిఎస్‌ నాయకత్వంలో దళితుల సమస్యలపై సర్వే చేశారు. ఐదు బృందాలుగా ఏర్పడి వారంరోజుల పాటు  గ్రామాల్లో తిరిగి దళితుల సమస్యలను అధ్యయనం చేశారు. మండలంలోని  ఏడు  గ్రామల్లో దేవాలయ ప్రవేశం లేదు. రాయవరం, సుల్తానపురం, సోంపురం, చింతలకుంట, ఎస్సందొడ్డి, పెంచికల పాడు, నందిన్నే గ్రామాల్లో దళితులు దేవాలయాల్లోకి వెళ్తే దాడులు చేస్తారు. పండుగలు ూత్సవాల సందర్భంగా దళితులు ఆయా గ్రామాల్లో దూరంగా ూండే వారి మొక్కులు చెల్లించుకుంటారు.  బతికున్నంత కాలం తీవ్రమైన  ఆర్థిక, సామాజిక వివక్షను  ఎదుర్కొనే  దళితులకు సచ్చాక ఆరడుగుల జాగాకూడా లేక పోవడం దురదృష్టకం. శ్మశాన వాటికలు లేనివి  తొమ్మిది గ్రామాలున్నాయి.  మిట్టదొడ్డి, శాగదోని, నారాపురం, మల్కాపురం, కెజి దొడ్డి, సుల్తానపురం,  పుట్టందొడ్డి, నందిన్నే సోంపురం గ్రామాల్లో దళితులు చనిపోతు వ్యవసాయ భూముల్లోనే మృతదేహాలను ఖననం చేస్తారు. వ్యవసాయ భూమి లేని దళితులు శవాలను ఖననం చేయడానికి నానా తంటాలు పడాల్సి ూంటుంది. హోటళ్లలో దళితులు టీ తాగితే పెత్తందారులు ఓర్వలేరు. నేటికీ రాయవరం , సుల్తాన్‌పురం, సోంపూర్‌ గ్రామాల్లో  హోటళ్లలో రెండుగ్లాసుల పద్దతి అమలవుతుంది. అది విధంగా దళితులను గ్రామాల్లో దళితులను రచ్చబండల మీద కూర్చోనీయరు. చింతలకుంట, సోంపురం, సుల్తాన్‌పూర్‌ గ్రామాల్లో దళితులను రచ్చబండమీద కూర్చోనీయరు.  రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించింది. ఇప్పటికే అత్యధిగ గ్రామాల్లో కమ్యూటీ హాళ్లు నిర్మించారు. గట్టు మండలంలో నేటికీ కమ్యూనిటీ హాళ్లు లేని గ్రామాలు 16 ూన్నాయి.  పెద్దమల్కాపురం, గందమాన్‌దొడ్డి, తుమ్మల చెరువు, ఆరెగిద్ద, రాయవరం. చింతలకుంట, కుచ్చినెర్ల, సోంపురం, ఎస్సందొడ్డి, నందిన్నె, సుల్తాన్‌పూర్‌, కెసిదొడ్డి, సారాపురం, మల్గెర, చింతపురం, సల్కెరపురంలో  గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు లేవు. దీంతో పెండ్లిళ్లు ూత్సవాత సందర్భంగా దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సల్కెర పురంలో ఎస్‌సి కమ్యూనిటీ హాలును  బోయలు ఆక్రమించారు. కొన్ని గ్రామాల్లో కయ్యూనిటీ హాళ్లకు రిపేర్లు చేయాల్సి ూంది.
                         గట్టు మండల కేంద్రంలో దళితులకు సర్వేనెంబర్‌ 311, 304లో నాలుగు ఎకరాల ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది.  పెత్తందారులు దానిని ఆక్రమించారు.  పెత్తదారులకు భయపడిన దళితులు ప్రశ్నించడం లేదు.  చింతలకుంట గ్రామంలో ఎస్సీలకు సర్వే నెంబర్‌ 211/వి ఆరున్నర ఎకరాల వ్యవసాయ సాగు భూమి ప్రభుత్వం పంపిణీ చేసింది. దళితులు పొట్టకూటి కోసం వలస వెళ్లారు. కురువ వెంకటేష్‌, గోకారప్ప, ఈరప్ప 15 కుటుంబాల వాళ్లు దళితుల భూమిని కబ్జా చేశారు. అట్టిభూమిని అక్రమంగా  సాగు చేసుకుని రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకుంటున్నారు. దీనిపై దళితులు కోర్టును ఆశ్రయించారు. ఈభూమి దళితులదేనని  కోర్టు తీర్పు ఇచ్చినా బాధితులకు భూమి ఇవ్వడం లేదు. ఇలా మండలంలో లనేక గ్రామాల్లో దళితుల భూమిని ఆక్రమించుకుంటున్నారు.  ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కూడా దళితులకు సక్రమంగా అందడం లేదు. నేటికి 12 గ్రామాల్లో 768 కుటుంబాలలకు ఇళ్లు లేవు.   ఇందిరమ్మ పథకం కింద అందరికీ ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని అందరికి  ఇళ్లు నిర్మించుకునే అవ కాశం మండలంలో లేదు. ఇందిమ్మ బిల్లులు రాక అనేక గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకోవడంలో వెనుకబడి ూన్నారు. బిల్లు మంజూరయినా ఆర్థక పరిస్థితి సక్రమంగా లేక నిర్మించుకోలేని వారు పలువురున్నారు.  వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఎంతో ప్రచారం చేస్తుంది. గట్టు మండలంలో నేటికీ 90 శా త ం మందికి మరుగుదొడ్లు లేవు. గట్టు మండలం అన్ని రంగాల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అక్షరాస్యత. అక్షరాస్యతలో మహబూబ్‌నగర్‌ జిల్లా 56 ూండటా అందులో గట్టు మండలం 34.45 శాతం మాత్రమే. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా అక్షరరాస్యత పెరగడం లేదు. తగిన చర్యలు తీసుకోవాలి. అక్షరాస్యతలోనూ అభివృద్ది లోనూ దళితులు వెనుకబడి ూన్నారు. దాడులు జరిగినా హత్యలు జరిగినా రాజీ కుది రిస్తున్నారు. కేసులు అయినా ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు. రోడ్లు, వీధిదీపాలు, శ్మశాన వాటికలు, కమిటీహాళ్లు, మరుగుదొడ్లు తాగునీటి సమస్యలున్నాయి.  మండలంలో అనేక తీవ్రమైన సమస్యలను  అధికారుల దృష్టికి తెచ్చారు. అధ్యయనం చేసిన అన్ని అంశాలను పరిశీలించి న్యాయం చేయాల్సిన అవసరం ూంది. దళితవాడలు, ఇళ్లస్థలాలు, విద్యుత్‌ స్తంభాలు, వాటర్‌ట్యాంక్‌, కొళాయిలకు అంచనాలు వేసి గతంలో ఆర్డీఓకు అందజేశారు.  మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్ల కోసం వృద్ధుల, వికలాంగుల పేర్ల జాబితాను 2011లో అధికారులకు ఇచ్చినా నేటికీ పట్టించుకోలదు.  సర్వే అనంతరం గట్టు మండల కేంద్రంలో సదస్సు నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. దళితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని గద్వాల ఆర్డీఓ నారా యణ రెడ్డి హామీ ఇచ్చారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాలు లేకపోతే ప్రభుత్వ పరంగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి కేటాయిస్తారన్నారు. గట్టు, చింతలకుంట గ్రామాల్లో శ్మశాన వాటిక విషయంలో  ప్రత్యేకంగా తహశీల్దార్‌తో మాట్లాడుతానన్నారు. అదే విధంగా ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు లేని గ్రామాలను పరిశీలించి నిర్మిస్తామని చెప్పారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వ ూన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.